Bharat Expo: రికార్డు సమయంలో ఇంజినీరింగ్ అద్భుతాలను సృష్టిస్తున్నాం: మోదీ
వరుసగా మూడోసారి తామే అధికారంలోకి వస్తామని విశ్వాసం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ.. ఆ కాలంలోనే ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని తెలిపారు.
దిల్లీ: ఆర్థికాభివృద్ధిలో భారత్ దూసుకెళ్తోందని.. వరుసగా మూడోసారి ఏర్పడే తమ ప్రభుత్వ హయాంలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ధీమా వ్యక్తం చేశారు. దిల్లీలో నిర్వహించిన ‘భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో’ను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ట్రక్కు, ట్యాక్సీ డ్రైవర్ల కోసం జాతీయ రహదారుల వెంబడి ఫేజ్-1లో భాగంగా 1000 ఆధునిక విశ్రాంతి గృహాలు నిర్మిస్తామని ప్రకటించారు.
‘‘2014కి ముందు పదేళ్లలో దేశంలో దాదాపు 12 కోట్ల వాహనాలు అమ్ముడుపోయాయి. అదే 2014 నుంచి ఇప్పటివరకు ఈ సంఖ్య 21 కోట్లు దాటింది. పదేళ్ల క్రితం సుమారు రెండు వేల ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయించారు. ఇప్పుడు ఏటా 12 లక్షలు అమ్ముడవుతున్నాయి. గత దశాబ్ద కాలంలో ప్యాసింజర్ వాహనాల్లో దాదాపు 60 శాతం వృద్ధి నమోదైంది’ అని ప్రధాని మోదీ తెలిపారు. స్థానికంగా లభ్యమయ్యే ముడి పదార్థాలను ఉపయోగించి బ్యాటరీలను తయారు చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేయాలని వాహనరంగ పరిశ్రమకు పిలుపునిచ్చారు.
వాహన బీమా.. అనుబంధాలతో అదనపు రక్ష
మౌలిక సదుపాయాల కల్పనలోనూ భారత్ పురోగమిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. ‘నిర్మాణాల విషయంలో మేం సముద్రాలు, పర్వతాలకు సవాలు విసురుతున్నాం. రికార్డు సమయంలో ఇంజినీరింగ్ అద్భుతాలను సృష్టిస్తున్నాం. అటల్ టన్నెల్ (హిమాచల్ప్రదేశ్) నుంచి అటల్ సేతు (ముంబయి) వరకు దేశ మౌలిక సదుపాయాల రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. గత పదేళ్లలో 75 కొత్త విమానాశ్రయాలు, సుమారు 4 లక్షల గ్రామీణ రహదారులు నిర్మించాం’’ అని వివరించారు. ఇదిలా ఉండగా.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు భాజపా సారథ్యంలోని ఎన్డీయే శ్రమిస్తోన్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘అమ్మో జగన్ బొమ్మా’ళీ.. అడ్డగోలుగా ఫైబర్నెట్ ధరల పెంపు!
-
అన్నకు నచ్చని తమ్ముడి పెళ్లి.. యువతి అమ్మమ్మ ఇంటికి నిప్పుపెట్టిన ప్రబుద్ధుడు
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
-
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
-
ఒక్క ఫోటో .. నాలుగేళ్ల కష్టం
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..