FTP: భారత్కు కొత్త విదేశీ వాణిజ్య విధానం.. 2లక్షల కోట్ల డాలర్ల ఎగుమతులే లక్ష్యం
Foreign Trade Policy 2023: కొత్త ‘విదేశీ వాణిజ్య విధానాన్ని (FTP 2023)’ కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం ఆవిష్కరించారు. 2023 ఏప్రిల్ 1 నుంచి ఈ నూతన విధానం అమల్లోకి రానుంది.
దిల్లీ: భారత ఎగుమతుల్ని 2030 నాటికి రెండు ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త ‘విదేశీ వాణిజ్య విధానాన్ని (FTP 2023)’ ప్రవేశపెట్టింది. దీన్ని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం ఆవిష్కరించారు. 2023 ఏప్రిల్ 1 నుంచి ఈ నూతన విధానం అమల్లోకి రానుంది.
ఎప్పటిలా ఐదేళ్ల కాలపరిమితితో కాకుండా ఈసారి ఎఫ్టీపీ (Foreign Trade Policy)కి ఎలాంటి గడువును నిర్దేశించలేదు. కావాల్సినప్పుడల్లా మార్పులు చేర్పులు ఉంటాయని ‘డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (DGFT)’ సంతోష్ సారంగి ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం ఎగుమతుల విలువ 760- 770 బిలియన్ డాలర్లుగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. క్రితం ఏడాది ఇది 676 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు గుర్తుచేశారు.
ఇప్పటి వరకు అమల్లో ఉన్న విదేశీ వాణిజ్య విధానాన్ని 2015 ఏప్రిల్ 1న ప్రవేశపెట్టారు. ఐదేళ్ల గడువుతో దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. కానీ, మధ్యలో కొవిడ్ కారణంగా పలు దఫాల్లో పొడిగిస్తూ వచ్చారు. చివరిసారి 2022 సెప్టెంబరులో సవరించి 2023 మార్చి 31 వరకు పొడిగించారు. కొత్త ఎఫ్టీపీ (FTP 2023)లో కొత్త పట్టణాలను ‘టౌన్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఎక్సలెన్స్’ కింద ఎంపిక చేశారు. ఫరీదాబాద్, మొరాదాబాద్, మీర్జాపూర్, వారణాసి ఇందులో ఉన్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 39 పట్టణాలు టీఈఈల జాబితాలో ఉన్నాయి.
ఈసారి ఎఫ్టీపీ (FTP 2023) ప్రయోజనాలను ఇ-కామర్స్ ఎగుమతులకు కూడా విస్తరించారు. 2030 కల్లా వీటి విలువ రూ.200- 300 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేశారు. మరోవైపు కొరియర్లో ఒక్కో దఫాలో చేసే సరకు రవాణా విలువ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. అలాగే భారత రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా మార్చాలని ఎఫ్టీపీ (FTP 2023)లో ప్రతిపాదించారు. అందుకనుగుణంగా అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలను దేశీయ కరెన్సీలో జరిగేలా ప్రోత్సాహించాలని నిర్ణయించారు.
పాలసీలోని కీలకాంశాలు..
-
ఐదేళ్ల కాలపరిమితితో కాకుండా.. ఎఫ్టీపీ (FTP 2023)కి ఎలాంటి తుది గడువును నిర్ణయించలేదు. అవసరాన్ని బట్టి ఎప్పకప్పుడు మారుస్తారు
-
సరకుల ఎగమతులపై ప్రభుత్వం విధించే సుంకాలు, పన్నులపై తగ్గింపునిచ్చేలా పథకాన్ని ప్రకటించారు
-
ఎఫ్టీపీ (FTP 2023)కి సంబంధించిన దరఖాస్తుల డిజిటైజేషన్
-
దరఖాస్తులకు సిస్టమ్ ఆధారిత ఆటోమేటిక్ ఆమోదం
-
అడ్వాన్స్ ఆథరైజేషన్ కావాల్సిన దరఖాస్తుల ప్రాసెసింగ్ గడువును ఒకరోజుకు కుదించేలా ప్రయోగాత్మక ప్రాజెక్టు
-
‘యావరేజ్ ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్’ నుంచి పాడి పరిశ్రమకు మినహాయింపు
-
‘స్పెషల్ అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్’ వస్త్ర పరిశ్రమకూ విస్తరణ
-
ఇ-కామర్స్ ఎగుమతులకూ ఎఫ్టీపీ (FTP 2023) ప్రయోజనాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 609 పాయింట్లు, నిఫ్టీ 150 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. -
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
Realme C65: మొబైల్ తయారీ సంస్థ రియల్మీ బడ్జెట్ ధరలో ఎయిర్గెశ్చర్స్ సదుపాయంతో కొత్త ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. -
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
Flight ticket prices: టికెట్ ధరలో మిగిలిన సేవలను కూడా కలిపేస్తున్న నేపథ్యంలో డీజీసీఏ విమానయాన సంస్థలు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాబోయే రోజుల్లో టికెట్ ధరలు కొంతమేరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీఓకు సిద్ధమైంది. ఇందుకోసం సెబీకి తాజాగా ముసాయిదా పత్రాలను సమర్పించింది. -
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
Raymond group: రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా, ఆయన భార్య నవాజ్ మోదీ విడాకుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. తాజాగా ఆమెను గ్రూప్నకు చెందిన పలు కంపెనీల నుంచి డైరెక్టర్గా తొలగించారు. -
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
ICICI Credit Cards: కొత్తగా జారీ చేసిన దాదాపు 17 వేల క్రెడిట్ కార్డుల వివరాలు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?