Jack Ma: ‘మా కిచెన్ ఫుడ్’.. కొత్త కంపెనీ ప్రారంభించిన జాక్ మా
Jack Ma: అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా మరో కొత్త కంపెనీని ప్రారంభించారు. గత కొన్నేళ్లుగా ప్రజా జీవితానికి దూరంగా ఉంటున్న ఆయన తన అభిరుచికి అనుగుణంగా వ్యవసాయ ఆధారిత వ్యాపారంలోకి ప్రవేశించారు.
బీజింగ్: చైనాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ‘జాక్ మా’ (Jack Ma) మరో కొత్త బిజినెస్ను ప్రారంభించారు. తద్వారా ఆయన తన భవిష్యత్ ప్రణాళికలేంటో పరోక్షంగా వెల్లడించారు. వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి విక్రయించే ఒక చిన్న కంపెనీని ప్రారంభించారు. 1.4 మిలియన్ డాలర్ల మూలధనంతో దీన్ని రిజిస్టర్ చేయించారు.
‘హాంగ్జౌ మా కిచెన్ ఫుడ్’ పేరిట ఈ కంపెనీని జాక్ మా (Jack Ma) ప్రారంభించారు. ఇది ప్యాకేజ్డ్ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించనున్నట్లు చైనా నేషనల్ ఎంటర్ప్రైజ్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ పబ్లిసిటి సిస్టమ్ సమాచారం ద్వారా తెలుస్తోంది. ‘జాక్ మా ఫౌండేషన్’లో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తులే కొత్త కంపెనీ బాధ్యతలను నిర్వర్తిస్తున్నట్లు ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ కథనం వెల్లడించింది. భవిష్యత్లో ఈ కంపెనీ ‘రెడీ మీల్స్’ బిజినెస్లోకీ ప్రవేశించే అవకాశాలు ఉన్నాయనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఈ వ్యాపారం చైనాలో వేగంగా విస్తరిస్తోంది.
జాక్ మా (Jack Ma) గత కొన్నేళ్లుగా అజ్ఞాత జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే. చైనా బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలు ఎత్తిచూపుతూ గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అక్కడి ప్రభుత్వ ఆగ్రహానికి కారణమయ్యాయి. దీంతో ఆయన వ్యాపారాలపై ప్రభుత్వం పెద్ద ఎత్తున విరుచుకుపడింది. ఆయన నేతృత్వంలోని అలీబాబా, యాంట్ గ్రూప్ కంపెనీలపై దర్యాప్తుల పేరిట ఆంక్షలు విధించింది.
అప్పటి నుంచి జాక్ మా (Jack Ma) ప్రజా జీవితం నుంచి దూరమయ్యారు. ఎక్కువ సమయాన్ని ఆయన తన ఫౌండేషన్ కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు. ఆయన వ్యక్తిగత ఆసక్తి అయిన వ్యవసాయం, అనుబంధ రంగాల్లో పరిశోధనలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో వివిధ వ్యవసాయ పద్ధతులను పరిశీలించేందుకు ఆయా దేశాల్లో పర్యటించారు. తాజాగా ప్రారంభించిన కంపెనీ కూడా ఆయన అభిరుచుల్లో భాగమేననే వాదన వినిపిస్తోంది. తద్వారా ఇకపై ఆయన పూర్తిగా తన సమయాన్ని వ్యవసాయ ఆధారిత వ్యాపారంపైనే వెచ్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!