Mukesh Ambani: ముకేశ్‌ అంబానీ ఇంటికి ఐఓసీ అధ్యక్షుడు

ముకేశ్ అంబానీ ఇంటికి ఐఓసీ అధ్యక్షుడు థామస్‌ బచ్‌ విచ్చేశారు. ఆయనకు ముకేశ్‌ అంబానీ, నీతా అంబానీ దంపతులు స్వాగతం పలికారు.

Updated : 11 Oct 2023 15:30 IST

ముంబయి: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సెషన్‌ కోసం భారత్‌కు విచ్చేసిన ఐఓసీ (IOC) అధ్యక్షుడు థామస్‌ బచ్‌కు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ సాదర స్వాగతం పలికారు. ముంబయిలోని ముకేశ్‌ నివాసానికి ఆయన మంగళవారం విచ్చేశారు. ఈ సందర్భంగా భారత సంప్రదాయం ప్రకారం.. బచ్‌కు బొట్టు పెట్టి, హారతిచ్చి నీతా అంబానీ ఆహ్వానం పలికారు. అనంతరం ముకేశ్‌, నీతాతో బచ్‌ ఫొటోలు దిగారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సెషన్ ముంబయిలో జరగబోతోంది. అక్టోబరు 15 నుంచి 17 వరకు ఈ సెషన్‌ నిర్వహించనున్నారు. 40 ఏళ్ల తర్వాత భారత్‌లో ఈ సెషన్‌ నిర్వహిస్తుండడం గమనార్హం. నీతా అంబానీ ఐఓసీ సభ్యులుగా ఉన్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని