Twitter: బోర్డు సభ్యులందరిపై మస్క్ వేటు.. ఇక సీఈఓగా ఆయనేనా?
ట్విటర్ నూతన యజమాని ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కంపెనీ బోర్డు సభ్యులందరిని తొలగించారు. ప్రస్తుతం ఆయనొక్కరే బోర్డు డైరెక్టర్గా ఉన్నారు.
న్యూయార్క్: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ను సొంతం చేసుకున్న అపర కుబేరుడు ఎలాన్ మస్క్.. సంస్థలో సమూల ప్రక్షాళనకు సిద్ధమయ్యారు. సంస్థను కొనుగోలు చేసిన తొలి రోజే సీఈఓ పరాగ్ అగర్వాల్ సహా నలుగురు ఉన్నత స్థాయి ఉద్యోగులను ఇంటికి పంపించిన ఆయన.. తాజాగా బోర్డు సభ్యులందరిపై వేటు వేశారు. ప్రస్తుతం ట్విటర్ బోర్డులో తానే ఏకైక డైరెక్టర్ అని పేర్కొన్నారు. ఈ మేరకు సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్కు సోమవారం సమర్పించిన ఫైలింగ్లో వెల్లడించారు. దీంతో ట్విటర్ సీఈఓ పదవిని ఆయన చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
ట్విటర్ను తాను కొనుగోలు చేయడానికి ముందు డైరెక్టర్లుగా ఉన్నవారంతా ఇకపై ట్విటర్ బోర్డు సభ్యులుగా కొనసాగబోరని మస్క్ ఆ ఫైలింగ్లో పేర్కొన్నారు. అందులో మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్ కూడా ఉన్నారు. ప్రస్తుతానికి బోర్డులో తానొక్కడినే డైరెక్టర్గా ఉన్నానని, అయితే ఇది తాత్కాలికమేనని సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్కు తెలిపాడు. ఇంతకంటే వివరాలేమీ మస్క్ వెల్లడించలేదు.
ఇదిలా ఉండగా.. ఏకైక బోర్డు సభ్యుడిగా ఉన్న మస్క్ ఇక ట్విటర్ సీఈఓగా ఉండనున్నట్లు తెలుస్తోంది. పరాగ్ అగర్వాల్ను సీఈఓ పదవి నుంచి తొలగించిన తర్వాత కొత్త సీఈఓను నియమించలేదు. అయితే సోమవారం నాటి ఫైలింగ్లో తానే ట్విటర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని మస్క్ పేర్కొన్నట్లు కొన్ని మీడియా కథనాలు తెలిపాయి. దీంతో త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఇన్వెస్టర్లలో సౌదీ యువరాజు
ఇక ట్విటర్ కొత్త ఇన్వెస్టర్లలో సౌదీ యువరాజు అల్వలీద్ బిన్ తలాల్, ట్విటర్ సహా వ్యవస్థాపకుడు జాక్ డోర్సె ఉన్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్ ద్వారా తెలిసింది. తలాల్కు చెందిన కింగ్డమ్ హోల్డింగ్ కంపెనీ ట్విటర్లో దాదాపు 35 మిలియన్ల షేర్లను 1.9 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతో మస్క్ తర్వాత కంపెనీలో రెండో అతిపెద్ద ఇన్వెస్టర్గా సౌదీ యువరాజు ఉండనున్నారు. ఇక, జాక్ డోర్సే 978 మిలియన్ డాలర్లతో 18 మిలియన్ల షేర్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వీరితో పాటు ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ కూడా ఇన్వెస్టర్గా ఉన్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘3 ఇడియట్స్’ సీన్తో సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు సుందర్ పిచాయ్ సలహా..
Sundar Pichai: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత వినియోగం పెరుగుతున్న తరుణంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సలహా అందించారు. -
ప్రత్యేక ట్రేడింగ్ సెషన్.. సెన్సెక్స్ 88+, నిఫ్టీ @ 22,500
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు శనివారం కొంతసేపు పనిచేశాయి. ఈ ప్రత్యేక సెషన్లో సూచీలు లాభపడ్డాయి. -
నవ లిమిటెడ్.. రుణ రహితం
ఫెర్రో అల్లాయ్స్, మైనింగ్, విద్యుదుత్పత్తిలో నిమగ్నమై ఉన్న నవ లిమిటెడ్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.951.6 కోట్ల ఆదాయాన్ని, రూ.255.1 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వసూళ్లు 27%.. వదులుకుంది 73%
నిరర్థక ఆస్తులుగా మారిన రుణాల నుంచి వసూళ్లకు చేపట్టిన దివాలా పరిష్కార ప్రక్రియ, ఆర్థిక సంస్థలకు ఎంతగా ఉపయోగ పడుతోందో ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. -
నలుపు రంగులో అపాచీ ఆర్టీఆర్ 160
టీవీఎస్ మోటార్ తన ‘అపాచీ 160 ఆర్టీఆర్’ బైక్లో బ్లాక్ డార్క్ ఎడిషన్ (నలుపు రంగు)ను తీసుకొచ్చింది. -
టీవీ ఛానళ్లతో పాటు ఓటీటీ ప్రసారాలూ.. స్మార్ట్ ప్లస్ను ఆవిష్కరించిన డిష్ టీవీ
టీవీ ఛానళ్లతోపాటు, ఓటీటీ ప్రసారాలూ అందించే స్మార్ట్ ప్లస్ సేవలు ప్రారంభిస్తున్నట్లు డైరెక్ట్-టు-హోమ్ సేవలను అందించే డిష్ టీవీ ప్రకటించింది. -
2031కి రిటైల్ విపణి రెట్టింపు
భారత వినియోగ వస్తు- సేవల విపణి 2031 కల్లా రెట్టింపు కావొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. -
మదుపర్ల సంపద రూ.410 లక్షల కోట్లకు
వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. ఎం అండ్ ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. అయితే విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగడంతో లాభాలు పరిమితమయ్యాయి. -
ప్రస్తుత కంపెనీలకూ ప్రోత్సాహకాలు!
విద్యుత్ వాహన (ఈవీ) నూతన విధానాన్ని అనుసరించి, పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న సంస్థలకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయనుంది. -
విదేశీ ఫండ్ల ఆస్తుల్లో 20% వరకే మన మార్కెట్లకు! : సెబీ ప్రతిపాదన
మ్యూచువల్ ఫండ్లలో విదేశీ పెట్టుబడులను మరింత సులభతరం చేసే దిశగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కొన్ని చర్యలను ప్రతిపాదించింది. -
కియా కార్లు అద్దెకూ తీసుకోవచ్చు.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో
కారు కొంటే బీమా - నిర్వహణ ఖర్చుల వంటివి తప్పవు. మరో కొత్త మోడల్ కొనుగోలుకు పాత కారు విక్రయించాలంటే తగిన ధర వస్తుందో రాదో అనే బెంగ ఒకటి. -
సంక్షిప్త వార్తలు(5)
కేన్సర్ వ్యాధి చికిత్సలో వినియోగించే కాబోజాంటినిబ్ ట్యాబ్లెట్లను హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఉత్పత్తి చేసి, జైడస్ లైఫ్సైన్సెస్కు సరఫరా చేయనుంది. -
ఇక కంటితోనే స్క్రీన్ను ఆపరేట్ చేసేలా: త్వరలో యాపిల్ కొత్త ఫీచర్లు
Apple: దివ్యాంగులు కూడా ఐఫోన్, ఐప్యాడ్లను సులువుగా వినియోగించేందుకు వీలుగా యాపిల్ కొత్త ఫీచర్లును త్వరలోనే తీసుకురానున్నట్లు వెల్లడించింది. -
ఆరోగ్యకరమైన ఆహారం.. జొమాటోలో కొత్త ఫీచర్
Zomato: జొమాటోలో కొత్త ఫీచర్ని తీసుకొచ్చినట్లు కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ఇంతకీ ఆ ఫీచర్ ఎలా ఉపయోగపడనుందంటే..
తాజా వార్తలు (Latest News)
-
నాన్నకు ఇష్టమైన జిలేబీలు.. ప్రియాంక చేసిన కేకులు..! రాహుల్ మధుర జ్ఞాపకాలు
-
హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదు: కిషన్రెడ్డి
-
‘3 ఇడియట్స్’ సీన్తో సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు సుందర్ పిచాయ్ సలహా..
-
ధోనీకిదే చివరి సీజనా? విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
-
అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం: జీవన్రెడ్డి
-
స్వాతి మాలీవాల్పై దాడి ఘటన.. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ అరెస్ట్