Musk vs Zuckerberg: జుకర్తో మస్క్ కేజ్ ఫైట్.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
గత కొంత కాలంగా మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్, ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ మధ్య పోరు జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ పోరును లైవ్ స్ట్రీమ్ చేస్తామని మస్క్ ట్వీట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా టెక్ దిగ్గజాలు ఎలాన్ మస్క్ (Elon Musk), మార్క్ జుకర్బర్గ్ ( Mark Zuckerberg) మధ్య కేజ్ ఫైట్ (cage fight) జరగనుందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఆదివారం దీనికి సంబంధించి మస్క్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ‘‘జుకర్, మస్క్ మధ్య జరిగే పోరు ఎక్స్లో లైవ్ స్ట్రీమ్ అవుతుంది. దాని ద్వారా వచ్చిన నిధులు స్వచ్ఛంద సంస్థలకు వెళతాయి’’ అని మస్క్ ట్వీట్ చేశాడు. దీంతో మరోసారి వీరి మధ్య పోరు గురించి నెట్టింట చర్చ మొదలైంది. కొన్నేళ్లుగా రాజకీయాలు, కృత్రిమ మేధ( AI)కు సంబంధించి పలు విషయాల్లో భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తూ.. మస్క్, జుకర్బర్గ్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. గత నెలలో ఇవి తారస్థాయికి చేరాయి. ఎక్స్ (Twitter)కు పోటీగా మెటా సంస్థ థ్రెడ్స్ అనే యాప్ను తీసుకొచ్చింది. దీనిపై మస్క్ విమర్శలు చేశాడు. ఎక్స్ను కాపీ కొట్టి థ్రెడ్స్ను డిజైన్ చేశారని ఆరోపించాడు.
డెలివరీ బాయ్గా జొమాటో సీఈఓ.. ఫ్రెండ్షిప్డే స్పెషల్...
ఈ క్రమంలోనే జుకర్బర్గ్ రెడీ అంటే అతడితో కేజ్ ఫైట్కు తాను సిద్ధమని తొలుత మస్క్ ఎక్స్లో పేర్కొన్నాడు. దీనిపై జుకర్బర్గ్ స్పందిస్తూ ‘ప్లేస్ ఎక్కడో చెప్పు’ అంటూ సవాల్కు సై అన్నాడు. ‘వెగాస్ ఆక్టాగాన్’.. రా చూసుకుందాం’ అంటూ మస్క్ సమాధానమిచ్చాడు. దీంతో వీరిద్దరూ కేజ్ ఫైట్లో తలపడబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. అయితే, తొలుత ఇది కేవలం ప్రచారం కోసం జరుగుతుందని నెటిజన్లు భావించారు. కానీ, కొద్ది రోజులుగా ఇరువురు ట్రైనింగ్ సెషన్లో పాల్గొనడం.. శరీరాకృతిని ప్రదరిస్తూ ఫొటోలు, వీడియోలు పోస్టు చేస్తుండటంతో వీరి మధ్య పోరు ఖాయమని నెట్టింట ప్రచారం జరుగుతోంది. తాజాగా మస్క్ ట్వీట్ ఈ ప్రచారానికి బలం చేకూర్చింది. అయితే, ఈ ఫైట్ ఎప్పుడు జరుగనుందో ఇంత వరకు తెలియరాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
Warren Buffett: భారత మార్కెట్లో ఉన్న అవకాశాలను భవిష్యత్తులో అందిపుచ్చుకునేందుకు తమ కంపెనీ బెర్క్షైర్ హాత్వే సిద్ధంగా ఉందని వారెన్ బఫెల్ తెలిపారు. -
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
IPO: రూ.6,400 కోట్ల సమీకరణ లక్ష్యంతో వచ్చేవారంలో మూడు కంపెనీలు ఐపీఓకు వస్తున్నాయి. 2004 నుంచి సాధారణ ఎన్నికల సమయంలో మే నెలలో ఐపీఓలు ఉండడం ఇదే తొలిసారి. -
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ రియాక్షన్ ఇదే..
యాపిల్ వాచ్ ఓ మహిళ ప్రాణాల్ని కాపాడింది. అసలు ఒక స్మార్ట్ గడియారం ఆమెను ఎలా రక్షించగలిగిందంటే. -
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
USA: అమెరికా టెక్ పరిశ్రమలో భారతీయులది కీలక పాత్ర అని సిలికాన్ వ్యాలీ సెంట్రల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ సీఈఓ హర్బీర్ కె భాటియా తెలిపారు. వారు లేనిదే ఆ పరిశ్రమ మనుగడ సాగించలేదని అభిప్రాయపడ్డారు. -
ఆరోగ్య బీమా మరింత భారం
పెరుగుతున్న ఆసుపత్రి ఖర్చులను తట్టుకునేందుకు ఆరోగ్య బీమా తప్పనిసరిగా మారింది. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఇటీవలి కాలంలో ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు చేసింది. -
కేకేఆర్ చేతికి హెల్తియమ్ మెడ్టెక్
సర్జికల్ సూదుల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న బెంగళూరు సంస్థ హెల్తియమ్ మెడ్టెక్లో మెజార్టీ వాటాను, అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల సంస్థ కేకేఆర్ రూ.7,000 కోట్ల (840 మిలియన్ డాలర్ల)కు కొనుగోలు చేయనుందని తెలిసింది. -
సైబర్ దాడులు.. మనపై ఎక్కువే
అమెరికా, బ్రిటన్ తర్వాత అంతర్జాతీయంగా ‘ఫిషింగ్’ దాడులను అత్యధికంగా ఎదుర్కొంటున్నది మన దేశమే. భారత దేశంపై జరిగిన సైబర్ దాడుల్లో 33% టెక్నాలజీ రంగంపైనే కనిపించాయని స్కేలర్ అనే సైబర్ భద్రతా సంస్థ తన నివేదికలో పేర్కొంది. -
ప్రయాణ - పర్యాటకంలో 5.82 కోట్ల ఉద్యోగాలు!
దేశీయంగా పర్యాటకానికి గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, ఆ రంగంతో పాటు ప్రయాణ రంగంలోనూ ఉపాధికి భారీ అవకాశాలు కలగనున్నాయి. -
ఎయిరిండియా క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితి తగ్గింపు
దేశీయ మార్గాల్లో క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితిని ఈనెల 2 నుంచి తగ్గించినట్లు ఎయిరిండియా తెలిపింది. తక్కువ ధర ఉండే ఎకానమీ తరగతి ప్రయాణికులు ఇకపై 15 కిలోలే ఉచితంగా క్యాబిన్ లగేజీగా తీసుకెళ్లొచ్చని వెల్లడించింది. -
కోటక్ బ్యాంక్ లాభం రూ.5,302 కోట్లు
ప్రైవేటు రంగ కోటక్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.5,302 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభంతో పోలిస్తే ఇది 25% అధికం. -
రెండేళ్లలో మళ్లీ చిన్న కార్ల హవా
దేశీయ విపణిలో చిన్న కార్ల విభాగం 2026 చివరికల్లా లేదా 2027 నాటికి పుంజుకునే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ఇండియా అంచనా వేస్తోంది. -
రూ.15,000 కోట్ల రుణాల కోసం వొడాఫోన్ ఐడియా యత్నాలు!
ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకులతో పాటు ప్రైవేటు రంగ బ్యాంకుల నుంచీ రూ.15,000 కోట్ల (1.8 బిలియన్ డాలర్ల) రుణాలు తీసుకునేందుకు వొడాఫోన్ ఐడియా చర్చలు సాగిస్తోందని సమాచారం. -
మన ఎగుమతులకు అంతర్జాతీయ అనిశ్చితులే బెంగ
అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండటం వల్ల, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయ ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని ఎగుమతిదార్ల సంఘం ఫియో అంచనా వేస్తోంది. -
పేటీఎం సీఓఓ భవీశ్ గుప్తా రాజీనామా
పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ అధికారి (సీఓఓ) భవీశ్ గుప్తా రాజీనామా చేశారు. పేటీఎంలో రుణ వ్యాపారం, ఆన్లైన్, ఆఫ్లైన్ చెల్లింపులు, కాంప్లియెన్సెస్ తదితర విభాగాలను భవీశ్ నడిపించేవారు. -
సంక్షిప్త వార్తలు
డీమార్ట్ సూపర్మార్కెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్, మార్చి త్రైమాసికంలో రూ.563 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.460 కోట్లతో పోలిస్తే, ఇది 22.39% అధికం. -
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
layoffs: ప్రపంచవ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్ నెలలోనే 20 వేల మందిని సాగనంపాయి.
తాజా వార్తలు (Latest News)
-
పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్ జైశంకర్
-
వైట్హౌస్ గేటును ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ