stock market : లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

బుధవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.

Updated : 26 Jul 2023 10:07 IST

ముంబయి :  దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో నిఫ్టీ 19,700 పాయింట్లపైన కదలాడగా.. సెన్సెక్స్‌ 200 పాయింట్లు లాభపడింది. ఉదయం 9.21 నిమిషాలకు సెన్సెక్స్‌(Sensex) 191 పాయింట్లు లాభపడి.. 66,546 వద్ద, నిఫ్టీ(Nifty) 42 పాయింట్ల లాభంతో 19,722 వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 81.89 వద్ద మొదలైంది.

నిఫ్టీలో ఎల్‌అండ్‌టీ, టాటా మోటార్స్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఇన్ఫోసిస్‌, యూపీఎల్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అపోలో హాస్పిటల్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని