Petrol price: సామాన్యుడి ఆశలకు సౌదీ, రష్యా గండి.. పెట్రో ధరల తగ్గింపు హుళక్కేనా?
గ్యాస్తో పాటు పెట్రోల్, డీజిల్ ధరలూ తగ్గుతాయని ఆశించిన వారికి నిరాశే ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. సౌదీ, రష్యా తీసుకున్న నిర్ణయం కారణంగా అంతర్జాతీయంగా మళ్లీ చమురు ధరలు పెరిగాయి.
దిల్లీ: గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరను ప్రభుత్వం ఇటీవల రూ.200 తగ్గించడంతో సామాన్యులు ఊపిరి పీల్చుకున్నారు. పనిలో పనిగా పెట్రోల్, డీజిల్ ధరల (petrol, diesel price) భారం కూడా తగ్గిస్తారన్న ఆశ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో సౌదీ, రష్యా తీసుకున్న నిర్ణయం వారి ఆశలు గండికొట్టినట్లయ్యింది. ఉత్పత్తిలో కోత విధిస్తూ ఆ రెండు దేశాలూ తీసుకున్న నిర్ణయంతో అంతర్జాతీయ బ్రెంట్ క్రూడ్ (Brent crude) ధర 90 డాలర్లకు చేరింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరల మార్పు ఇప్పట్లో ఉండబోదన్న విశ్లేషణలు వినవస్తున్నాయి.
రోజుకు 1.3 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు ఉత్పత్తి కోతను ఈ ఏడాది చివరి వరకు పొడిగించేందుకు సౌదీ అరేబియా, రష్యాలు నిర్ణయించాయి. ఈ పరిణామంతో మంగళవారం బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 90 డాలర్ల ఎగువకు వెళ్లింది. 2023లో బ్రెంట్ క్రూడ్ ఈ స్థాయి ఎగువకు వెళ్లడం ఇదే మొదటిసారి. బుధవారం క్రూడాయిల్ 89.67 వద్ద ట్రేడవుతోంది. ఆగస్టు నెలలో సగటున 86.43 డాలర్లుగా ఉన్న బ్యారెల్ ముడిచమురు ధర సెప్టెంబర్లో 89 డాలర్లకు చేరనుంది.
శాంసంగ్ ఆఫర్.. ఈ 2 ఫోన్లపై ఇంతకు ముందెన్నడూ లేనంత బిగ్ డిస్కౌంట్!
ఈ ఏడాది మే, జూన్ నెలల్లో సగటున 73-75 డాలర్ల వద్ద భారత్ ముడిచమురును దిగుమతి చేసుకుంది. జులైలో అది 80కి చేరగా.. తాజాగా అది 90 డాలర్లకు చేరింది. గతేడాది క్రూడాయిల్ ధరలు ఆకాశాన్ని తాకినప్పుడు నష్టాలు భరించిన ఆయిల్ కంపెనీలు.. ధరలు తగ్గిన తర్వాత లాభాలను ఆర్జిస్తున్నాయి. ఇప్పుడు మళ్లీ అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నాయి. దీంతో పెరిగిన ధరల కారణంగా ఖర్చుకు, రిటైల్ ధరల మధ్య వ్యత్యాసం ఏర్పడుతోంది.
సాధారణంగా అంతర్జాతీయ 15 రోజుల సగటు ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు కంపెనీలు సవరించేవి. 2022 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు చమురు కంపెనీలు ధరల్లో ఎలాంటి మార్పూ చేయలేదు. గతేడాది మే 22న చివరికి సారిగా కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో రిటైల్ రేట్లు దిగి వచ్చాయి. ఆ తర్వాత ధరల్లో ఎలాంటి మార్పూ లేదు. ఈ నేపథ్యంలో బ్యారెల్ ధర 73-74 డాలర్ల మధ్య ఉంటే ఆయిల్ కంపెనీలు రోజువారీ ధరలను సవరించేవని సంబంధిత వర్గాలు తెలిపాయి. ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదని తెలుస్తోంది. మరోవైపు రష్యా నుంచి చౌక ధర చమురు దిగుమతులూ తగ్గాయి. దీంతో చమురు ఊరట ఉండకపోవచ్చని సమాచారం. అయితే, ఐదు రాష్ట్రాల ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ధరలు పెరిగే అవకాశం లేనప్పటికీ.. ధరలు తగ్గే సూచనలైతే కనిపించడం లేదు. చూడాలి ప్రభుత్వం ఏం చేస్తుందో!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
Nothing phone 2a: నథింగ్ ఫోన్ 2ఏ ప్రత్యేక ఎడిషన్ భారత్లో విడుదలైంది. నేవీ బ్లూ రంగులో దీన్ని తీసుకొచ్చారు. -
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 329 పాయింట్ల లాభంతో 74,059 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 22,505 దగ్గర కొనసాగుతోంది. -
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
-
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
-
బాలీవుడ్ స్టార్స్తో ఎన్టీఆర్.. వీడియో వైరల్