Paytm: పేటీఎంకు థర్డ్‌ పార్టీ అప్లికేషన్‌ ప్రొవైడర్‌ లైసెన్స్‌

Paytm: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు థర్డ్‌ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్‌ లైసెన్స్‌ను ఎన్‌పీసీఐ మంజూరు చేసింది. 

Published : 14 Mar 2024 20:32 IST

ముంబయి: పేటీఎం (Paytm) మాతృ సంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్స్‌కు ఊరట లభించింది. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) థర్డ్‌ పార్టీ అప్లికేషన్‌ ప్రొవైడర్‌ (TPAP) లైసెన్స్‌ను గురువారం మంజూరు చేసింది. దీని ప్రకారం మల్టీ బ్యాంక్‌ మోడల్‌ కింద ఇకపై పేటీఎం బ్రాండ్‌పైనా యూపీఐ సేవలందిస్తుంది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఆంక్షల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యస్‌ బ్యాంక్‌లు ఇకపై పేటీఎంకు పేమెంట్‌ సిస్టమ్‌ ప్రొవైడర్‌ బ్యాంక్స్‌గా వ్యవహరిస్తాయి. ప్రస్తుతం ఉన్న మర్చంట్స్‌కు, కొత్త మర్చంట్స్‌కు యస్‌ బ్యాంక్‌ ఇకపై సేవలందిస్తుంది. అంటే @paytm యూపీఐ హ్యాండిల్‌ కలిగిన మర్చంట్‌ పేమెంట్స్‌ ఇకపై యస్‌ బ్యాంక్‌కు రీడైరెక్ట్‌ అవుతాయి.

ప్రస్తుతం ఉన్న యూజర్లు, మర్చంట్లు తమ యూపీఐ లావాదేవీలు, ఆటో పే మ్యాండెట్లను ఎలాంటి అవాంతరం లేకుండా వినియోగించుకోవడానికి ఈ నిర్ణయం వీలు పడుతుందని ఎన్‌పీసీఐ తెలిపింది. పేటీఎం కూడా కొత్త పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ బ్యాంకులకు తమ హ్యాండిళ్లను మైగ్రేట్‌ చేయాలని సూచించింది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖాతాదారులు, మర్చంట్స్‌ మార్చి 15లోగా తమ అకౌంట్లను వేరే బ్యాంకులకు మార్చుకోవాలని ఆర్‌బీఐ సూచించిన నేపథ్యంలో ఎన్‌పీసీఐ నుంచి ఈ నిర్ణయం వెలువడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని