Tesla: టెస్లా భారత ప్రవేశం.. వచ్చేవారం పీయూష్ గోయల్తో మస్క్ భేటీ!
Tesla: భారత్లోకి ప్రవేశించేందుకు టెస్లా గతకొంత కాలంగా ప్రయత్నిస్తోంది. కానీ, ఇప్పటి వరకు ఆ ప్రణాళికలు కార్యరూపం దాల్చలేదు. తాజాగా భారత్ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో వచ్చేవారం మస్క్ భేటీ కానున్నారనే అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన విద్యుత్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా (Tesla) భారత ప్రవేశంపై ప్రచారం జోరందుకొంది. త్వరలోనే దేశీయ రోడ్లపై ఈ కార్లు చక్కర్లు కొట్టే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal)తో అమెరికాలో వచ్చేవారం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) భేటీ కానున్నట్లు సమాచారం. ఇప్పటికే జర్మనీలోని గిగాఫ్యాక్టరీ నుంచి భారత్కు కార్లను సరఫరా చేసేందుకు టెస్లా ప్రణాళికలు రచిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
జూన్లో అమెరికా పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఎలాన్ మస్క్ (Elon Musk) సమావేశమయ్యారు. భారత్లో గణనీయ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు తాము ఆసక్తిగా ఉన్నామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో మస్క్ తాజాగా గోయల్తో భేటీ కానుండటం ప్రాధాన్యం ఏర్పడింది. భారత్లో ఫ్యాక్టరీ ఏర్పాటు, దేశీయంగా పరికరాల కొనుగోలు, ఛార్జింగ్ మౌలిక వసతుల ఏర్పాటుపైనే ప్రధానంగా వీరు చర్చించనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు తెలిపారు. దేశీయంగా కొంత వరకైనా తయారీ చేపట్టే కంపెనీలకు.. అవి దిగుమతి చేసుకొనే ఇతర మోడళ్లపై (కంప్లీట్లీ బిల్ట్ అప్) సుంకాన్ని 15 శాతానికి తగ్గించడంపై కూడా మస్క్తో గోయల్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా విదేశాల్లో తయారై (కంప్లీట్లీ బిల్ట్ అప్) భారత్కు వచ్చే వాహనాలపై ప్రస్తుతం 100 శాతం వరకు సుంకం వర్తిస్తోంది. ఒకవేళ దేశీయంగా కొన్ని మోడళ్లనైనా తయారు చేసే కంపెనీలకు దిగుమతి సుంకంలో రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు సరికొత్త ఈవీ విధానాన్ని (Eletric Vehicle policy) కూడా రూపొందిస్తున్నట్లు సమాచారం.
భారత్కు టెస్లా క్లార్లు.. వయా జర్మనీ
ఈ కొత్త ఈవీ విధానంపైనే ప్రధాన మంత్రి కార్యాలయం సోమవారం వివిధ మంత్రిత్వ శాఖలతో చర్చలు జరిపినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. అయితే, దిగుమతి సుంకం తగ్గింపు వల్ల ఆ ప్రభావం దేశీయ ఈవీ కంపెనీలపై ఎలా ఉంటుందనే అంశాన్ని అంచనావేస్తున్నట్లు పేర్కొన్నారు. టెస్లా (Tesla) 2021 నుంచి భారత్లోకి ప్రవేశించేందుకు యత్నాలు చేస్తోంది. అయితే, ఈవీలపై దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించాలని కోరుతోంది. దీనికి ప్రభుత్వం కొన్ని షరతులను విధించింది. దేశీయంగా తయారీ ప్రారంభించడంతో పాటు ప్రాంతీయంగానే విడిభాగాలను కొనుగోలు చేయాలని కోరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 329 పాయింట్ల లాభంతో 74,059 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 22,505 దగ్గర కొనసాగుతోంది. -
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం