PM Kisan: రైతులకు త్వరలో గుడ్న్యూస్.. కిసాన్ సమ్మాన్ కింద మరో ₹2 వేలు!
PM Kisan: దేశంలో రైతన్నలకు త్వరలో మోదీ సర్కారు శుభవార్త చెప్పే అవకాశం ఉంది. కిసాన్ సమ్మాన్ కింద ఇస్తున్న సాయాన్ని రూ.2వేలు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
PM Kisan | ఇంటర్నెట్ డెస్క్: దేశంలోని రైతులకు మోదీ సర్కారు గుడ్న్యూస్ చెప్పనుందా? గత సార్వత్రిక ఎన్నికల ముందు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని (PM Kisan) తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ఈ సారి ఆ మొత్తాన్ని పెంచనుందా? అంటే అవుననే అంటున్నాయి సంబంధిత వర్గాలు. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరగనున్న వేళ రైతుల మనసు గెలుచుకునేందుకు మోదీ సారథ్యంలోని భాజపా సర్కారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రస్తుతం ఇస్తున్న రూ.6 వేల మొత్తాన్ని రూ.8 వేలకు పెంచే అవకాశం ఉందని ‘బ్లూమ్బెర్గ్’ పేర్కొంది.
ఒకవేళ రూ.2 వేలు చొప్పున రైతులకు అదనంగా చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయిస్తే ప్రభుత్వ ఖజానాపై రూ.20వేల కోట్ల మేర అదనపు భారం పడనుంది. దీనిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధిని వివరణ కోరగా.. అందుకు నిరాకరించినట్లు బ్లూమ్బెర్గ్ తెలిపింది. దేశంలో 140 కోట్ల మందిలో దాదాపు 65 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారని, భాజపా సర్కారు మూడోసారి అధికారంలోకి రావాలంటే వీరి ఓట్లు కీలకమని బ్లూమ్బెర్గ్ అభిప్రాయపడింది. దేశంలో ఇప్పటికీ మోదీనే పాపులర్ లీడర్ అయినప్పటికీ.. అసమానతలు, నిరుద్యోగం వంటి సమస్యలు సవాళ్లుగా మారనున్నాయని తెలిపింది.
పండగ సేల్లో నో-కాస్ట్ ఈఎంఐతో కొనుగోళ్లు చేస్తున్నారా? ఇవి తెలుసుకోవాల్సిందే..!
గత సార్వత్రిక ఎన్నికల ముందు 2018లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించారు. మూడు విడతలుగా రూ.2 వేలు చొప్పున రైతులకు నేరుగా బ్యాంక్ అకౌంట్లలో ఈ నిధులు జమ అవుతున్నాయి. అయితే, నిధుల పెంపుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల వేళ ఉచిత రేషన్ పథకాన్ని మరోసారి పొడిగించే అవకాశం కూడా ఉందని తెలిసింది. దీంతో పాటు గృహ నిర్మాణానికి వడ్డీ రాయితీ పథకాన్ని కూడా త్వరలోనే ప్రకటించొచ్చని సమాచారం. ఇప్పటికే ఎల్పీజీ సిలిండర్ ధర తగ్గించడం, బియ్యం ఎగుమతులపై నిషేధం విధించడం వంటి చర్యలను ప్రభుత్వం చేపట్టిందని గుర్తు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రత్యేక ట్రేడింగ్ సెషన్.. సెన్సెక్స్ 88+, నిఫ్టీ @ 22,500
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు శనివారం కొంతసేపు పనిచేశాయి. ఈ ప్రత్యేక సెషన్లో సూచీలు లాభపడ్డాయి. -
నవ లిమిటెడ్.. రుణ రహితం
ఫెర్రో అల్లాయ్స్, మైనింగ్, విద్యుదుత్పత్తిలో నిమగ్నమై ఉన్న నవ లిమిటెడ్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.951.6 కోట్ల ఆదాయాన్ని, రూ.255.1 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వసూళ్లు 27%.. వదులుకుంది 73%
నిరర్థక ఆస్తులుగా మారిన రుణాల నుంచి వసూళ్లకు చేపట్టిన దివాలా పరిష్కార ప్రక్రియ, ఆర్థిక సంస్థలకు ఎంతగా ఉపయోగ పడుతోందో ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. -
నలుపు రంగులో అపాచీ ఆర్టీఆర్ 160
టీవీఎస్ మోటార్ తన ‘అపాచీ 160 ఆర్టీఆర్’ బైక్లో బ్లాక్ డార్క్ ఎడిషన్ (నలుపు రంగు)ను తీసుకొచ్చింది. -
టీవీ ఛానళ్లతో పాటు ఓటీటీ ప్రసారాలూ.. స్మార్ట్ ప్లస్ను ఆవిష్కరించిన డిష్ టీవీ
టీవీ ఛానళ్లతోపాటు, ఓటీటీ ప్రసారాలూ అందించే స్మార్ట్ ప్లస్ సేవలు ప్రారంభిస్తున్నట్లు డైరెక్ట్-టు-హోమ్ సేవలను అందించే డిష్ టీవీ ప్రకటించింది. -
2031కి రిటైల్ విపణి రెట్టింపు
భారత వినియోగ వస్తు- సేవల విపణి 2031 కల్లా రెట్టింపు కావొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. -
మదుపర్ల సంపద రూ.410 లక్షల కోట్లకు
వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. ఎం అండ్ ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. అయితే విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగడంతో లాభాలు పరిమితమయ్యాయి. -
ప్రస్తుత కంపెనీలకూ ప్రోత్సాహకాలు!
విద్యుత్ వాహన (ఈవీ) నూతన విధానాన్ని అనుసరించి, పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న సంస్థలకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయనుంది. -
విదేశీ ఫండ్ల ఆస్తుల్లో 20% వరకే మన మార్కెట్లకు! : సెబీ ప్రతిపాదన
మ్యూచువల్ ఫండ్లలో విదేశీ పెట్టుబడులను మరింత సులభతరం చేసే దిశగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కొన్ని చర్యలను ప్రతిపాదించింది. -
కియా కార్లు అద్దెకూ తీసుకోవచ్చు.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో
కారు కొంటే బీమా - నిర్వహణ ఖర్చుల వంటివి తప్పవు. మరో కొత్త మోడల్ కొనుగోలుకు పాత కారు విక్రయించాలంటే తగిన ధర వస్తుందో రాదో అనే బెంగ ఒకటి. -
సంక్షిప్త వార్తలు(5)
కేన్సర్ వ్యాధి చికిత్సలో వినియోగించే కాబోజాంటినిబ్ ట్యాబ్లెట్లను హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఉత్పత్తి చేసి, జైడస్ లైఫ్సైన్సెస్కు సరఫరా చేయనుంది. -
ఇక కంటితోనే స్క్రీన్ను ఆపరేట్ చేసేలా: త్వరలో యాపిల్ కొత్త ఫీచర్లు
Apple: దివ్యాంగులు కూడా ఐఫోన్, ఐప్యాడ్లను సులువుగా వినియోగించేందుకు వీలుగా యాపిల్ కొత్త ఫీచర్లును త్వరలోనే తీసుకురానున్నట్లు వెల్లడించింది. -
ఆరోగ్యకరమైన ఆహారం.. జొమాటోలో కొత్త ఫీచర్
Zomato: జొమాటోలో కొత్త ఫీచర్ని తీసుకొచ్చినట్లు కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ఇంతకీ ఆ ఫీచర్ ఎలా ఉపయోగపడనుందంటే..
తాజా వార్తలు (Latest News)
-
10 ఏళ్లలో 31వేల కి.మీ రైల్వే మార్గం నిర్మాణం: అశ్వినీ వైష్ణవ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
తిరుపతి చేరుకున్న సిట్ బృందం.. విచారణ ప్రారంభం
-
ప్రత్యేక ట్రేడింగ్ సెషన్.. సెన్సెక్స్ 88+, నిఫ్టీ @ 22,500
-
సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టం: కంగనా రనౌత్ ఆసక్తికర పోస్ట్
-
ఏ దశలోనూ క్వాలిటీ క్రికెట్ మాత్రం ఆడలేకపోయాం: హార్దిక్ పాండ్య