Ratan Tata: ఛైర్మన్ అయిన 15 రోజులకే గ్యాంగ్స్టర్తో గొడవ.. తొలి సవాల్ గురించి చెప్పిన రతన్ టాటా
టాటా సన్స్ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనకు ఎదురైన తొలి సవాల్ను పరిష్కరించిన తీరును రతన్ టాటా వివరించారు. దీనికి సంబంధించిన పాత వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
ముంబయి: పారిశ్రామిక, ఉపాధి కల్పనా రంగాల్లో విశిష్ట సేవలు అందించినందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా (Ratan Tata)కు కొద్ది రోజుల క్రితం మహారాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ రత్న (Udyoga Ratna) అవార్డును ప్రదానం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా రతన్ టాటాకు చెందిన పాత వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. 2013లో కొలంబియా బిజినెస్ స్కూల్లో ఓ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న ఆయన, టాటా సన్స్ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తొలి నాళ్లలో తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు. ఓ గ్యాంగ్స్టర్ తనను చంపేందుకు ఒప్పందం చేసుకున్నప్పటికీ ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లినట్లు చెప్పారు. ఆ సమయంలో అతనితో రాజీ పడాలని చాలా మంది తనకు సూచించినా.. ఆ పని చేయలేదని చెప్పారు.
‘‘టాటా గ్రూప్ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన 15 రోజులకు నేను ఈ సమస్యను ఎదుర్కొన్నాను. మా సంస్థల్లో ఒకటైన టాటా మోటార్స్లో పెద్ద మొత్తంలో సంపద ఉందని భావించిన ఓ గ్యాంగ్స్టర్, ఎలాగైనా దాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. మా సంస్థలో అతడికి 200 మంది అనుచరులు ఉన్నారు. వారితో కంపెనీ కార్యకలాపాలు అడ్డుకోవాలనుకున్నాడు. కానీ, నేను మాత్రం అతడి ఒత్తిడికి తలొగ్గకుండా.. అతడిని ఎదుర్కొవాలని నిర్ణయించుకున్నాను. నాతో ఉన్నవారు, సంస్థలోని ఉద్యోగులు మాత్రం గ్యాంగ్స్టర్కు పోలీసుల మద్దతు కూడా ఉండటంతో అతడితో రాజీ పడటం మంచిదని భావించారు. మేం ఊహించినట్లుగానే అతడు మా ప్లాంట్ కార్యకలాపాలను అడ్డుకున్నాడు. తన అనుచరులతో సమ్మెకు పిలుపునిచ్చాడు’’ అని రతన్ టాటా తెలిపారు.
తుది దశల్లో జాతీయ ఇ-కామర్స్ విధానం
సమ్మె పిలుపుతో కొద్ది మంది ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరయ్యేవారని, వారికి అండగా ఉంటానని భరోసానిచ్చేందుకు తాను కూడా రోజంతా ప్లాంట్లోనే ఉండేవాడినని రతన్ టాటా వివరించారు. దీంతో మిగిలిన ఉద్యోగులు సైతం ప్లాంట్కు వచ్చి పనిచేయడం ప్రారంభించారని ఆయన చెప్పారు. అయితే, గ్యాంగ్స్టర్ మాత్రం ప్లాంట్ మూతపడిందని ప్రచారం చేయడంతో, దాన్ని తిప్పికొట్టేందుకు ప్లాంట్ పనిచేస్తుందని, ఉద్యోగులు తిరిగి విధులకు హాజరయ్యారని తెలిసేలా కొన్ని ప్రకటనలు చేయించినట్లు తెలిపారు.
యాజమాన్యం వెనక్కి తగ్గడం లేదని గ్రహించి, మిగిలిన ఉద్యోగులు కూడా సమ్మెను విరమించడంతో గ్యాంగ్స్టర్ పథకం బెడిసికొట్టిందని రతన్ టాటా చెప్పారు. తర్వాత, గ్యాంగ్స్టర్ను పోలీసులు అరెస్టు చేశారని, అతడు జైలు నుంచి విడుదలయ్యాక తనను హత్య చేయించేందుకు ఒప్పందం చేసుకున్నాడని తెలిసి, చాలా మంది అతడితో రాజీ పడాలని సూచించారు. కానీ, తాను మాత్రం ఆ ఒత్తిడికి తలొగ్గకుండా తన పని చేసుకుంటూ వెళ్లిపోయానని రతన్ టాటా వీడియోలో వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘అమ్మో జగన్ బొమ్మా’ళీ.. అడ్డగోలుగా ఫైబర్నెట్ ధరల పెంపు!
-
అన్నకు నచ్చని తమ్ముడి పెళ్లి.. యువతి అమ్మమ్మ ఇంటికి నిప్పుపెట్టిన ప్రబుద్ధుడు
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
-
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
-
ఒక్క ఫోటో .. నాలుగేళ్ల కష్టం
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..