EVs: ఈవీ కొనాలనుకుంటున్నారా? వీటినీ దృష్టిలో పెట్టుకోండి..
Electric Vehicles: విద్యుత్ వాహనం కొనాలనుకుంటున్నారా? వాటి ప్రయోజనాలే కాదు కొన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయాలూ ఉన్నాయి.
Electric Vehicles | ఇంటర్నెట్ డెస్క్: దేశంలో విద్యుత్ వాహన (Electric Vehicles) విక్రయాలు ఊపందుకుంటున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉండడం, ఈవీల పట్ల ప్రజల్లో అవగాహన పెరగడం ఇందుకు కారణం. ముఖ్యంగా ఎంట్రీ లెవల్లో బైక్స్, స్కూటర్ కొనాలకునేవారు ఈవీల వైపు మళ్లుతున్నారని ఇటీవల బజాజ్ సీఈవో రాజీవ్ బజాజ్ అన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు విద్యుత్ కార్ల అమ్మకాలూ నెమ్మదిగా పెరుగుతున్నాయి. రాబోయే పండగల సీజన్లో ఈవీల అమ్మకాలు మరింత ఊపందుకోనున్నాయి. ఒకవేళ ఈవీ ఆలోచన మీకూ ఉంటే ప్రయోజనాలే కాదు.. మరికొన్నింటిపైనా లుక్కేయండి..
ప్రయోజనాలు
-
పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆలోచించేది వాటి గురించే. ప్రస్తుతం పెట్రోల్ లీటర్ ధరలు రూ.100కు పైనే ఉన్నాయి. భవిష్యత్లో తగ్గే సూచనలూ కనిపించడం లేదు. రోజూ ఎంతోకొంత దూరం ప్రయాణించే వారు ఈవీలైతే తక్కువ ఖర్చుతో ప్రయాణించొచ్చు. నెలంతటికీ కలిపితే రూ.వందల్లో ఆదా అవుతుంది.
- పెట్రోల్, డీజిల్తో నడిచే వాహనాలతో పోలిస్తే విద్యుత్ వాహనాల మెయింటెనెన్స్ తక్కువనే చెప్పాలి. సంప్రదాయ వాహనాలు రిపేర్కి వస్తే వేలల్లోనే ఖర్చవుతుంది. అదే ఎలక్ట్రిక్ వాహనాలకైతే అంత ఖర్చవ్వదు.
- విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే వారికి ప్రభుత్వం పన్ను ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఎవరైతే ఈవీలను రుణం ద్వారా కొనుగోలు చేస్తారో వారు సెక్షన్ 80EEB కింద రూ.1.5 లక్షల వరకు వడ్డీ మొత్తంపై పన్ను రాయితీ పొందొచ్చు. కార్లను కొనే వారికి ఇది అనువుగా ఉంటుంది.
వీటిని దృష్టిలో పెట్టుకోండి..
- ఒకవేళ మీరు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం గానీ, కారు గానీ కొనుగోలు చేయాలంటే ముందుగా రేంజ్ను దృష్టిలో పెట్టుకోండి. మీ రోజువారీ ప్రయాణానికి వారంలో ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది? దూరపు ప్రయాణాలు చేయాల్సి ఉంటుందా? అనే ప్రశ్నలు వేసుకోవాలి. సర్వీసు సెంటర్లూ దగ్గర్లోనే ఉన్నాయా లేదో చూసుకోండి.
- పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి. ఒకవేళ మీరు నగరాల్లో ఉంటే ఛార్జింగ్ విషయంలో బహుశా ఇబ్బంది రాకపోవచ్చు. చిన్న చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడప్పుడే ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులోకి రాకపోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
- సాధారణంగా ఈవీలు ఛార్జింగ్ చేయడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. పైగా మీరు నివాసం ఉండే చోట ఛార్జింగ్కు అనువుగా ఉందో లేదో కూడా చూసుకోవాలి. లేదంటే దానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.
- విద్యుత్ వాహనాల్లో బ్యాటరీనే కీలకం. ఒకవేళ కొన్నేళ్లు వాడిన తర్వాత బ్యాటరీ పాడైతే మార్పించుకోవడం మినహా ఇంకో ఆప్షన్ ఉండదు. ఇప్పుడున్న ధరల ప్రకారం వాహనం ధరలో బ్యాటరీనే దాదాపు సగం ధర ఉంటుంది. ఒక కారు బ్యాటరీ మార్చుకోవాలంటే రూ.4 లక్షలు, టూవీలర్ బ్యాటరీ అయితే రూ.50 వేలు వెచ్చించాల్సి ఉంటుంది.
- చాలా మంది కార్లు, ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు వారికి అమ్మే ఉద్దేశం ఉన్నా లేకపోయినా దాని రీసేల్ వాల్యూ చూడడం రివాజు. అదే ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో అయితే రీసేల్ వాల్యూ గురించి ఆలోచించకపోవడమే మంచిది.
చివరిగా: పై అంశాలేవీ పెద్దగా మీకు ప్రతికూలంగా అనిపించకపోతే ఎంచక్కా ఈవీలు కొనుగోలు చేయొచ్చు. ఇప్పటికే కంపెనీలు వివిధ రకాల ఫీచర్లతో పలు మోడళ్లను లాంచ్ చేశాయి. ఇప్పుడిప్పుడే ఈవీల్లోకి పెద్ద పెద్ద కంపెనీలూ ప్రవేశిస్తున్నాయి. త్వరలో మరిన్ని మోడళ్లూ అందుబాటులోకి రానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మారుతీ సుజుకీ స్విఫ్ట్ మరింత కొత్తగా.. ధర రూ.6.50 లక్షలు
Maruti Suzuki Swift: అత్యాధునిక ఫీచర్లను జోడిస్తూ మారుతీ సుజుకీ తమ హ్యాచ్బ్యాక్ మోడల్లో కొత్త స్విఫ్ట్ను విడుదల చేసింది. దీని ధర రూ.6.50 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. -
పోర్షే రూ.1.69 కోట్ల కారు
పోర్షే సరికొత్త పనమేరాను, అత్యంత ఆకర్షణీయ ఫీచర్లతో ఆవిష్కరించింది. దీని ధర(ఎక్స్ షోరూం) రూ.1,69,62,000. -
బజాజ్ కొత్త పల్సర్ NS400Z.. టాప్ స్పీడ్ 154kph
Bajaj Pulsar NS400Z: ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో పల్సర్ ఎన్ఎస్400Z పేరుతో మరో కొత్త పల్సర్ను లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి. -
ఒకాయా ఇ-బైక్ డిస్రప్టర్
దిల్లీకి చెందిన ఒకాయా సంస్థ ప్రీమియం బ్రాండ్ ఫెరాటో, సరికొత్త విద్యుత్ బైక్ ‘డిస్రప్టర్’ను విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.1,59,999. విద్యుత్ వాహన రాయితీల తర్వాత దిల్లీలో ఈ బైకు రూ.1.40 లక్షలకు లభించనుంది. -
యాంపియర్ నుంచి విద్యుత్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 136 km
electric scooter: భారత్ మార్కెట్లోకి మరో కొత్త విద్యుత్ స్కూటర్ వచ్చేసింది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి చెందిన యాంపియర్ ఈ స్కూటర్ను లాంచ్ చేసింది. -
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
Mahindra XUV 3XO: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఎక్స్యూవీ 3XOను లాంచ్ చేసింది. దీని ధర రూ.7.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
మారుతీ సుజుకీ త్వరలోనే అందుబాటు ధరలో హైబ్రిడ్ కార్లను తీసుకురావడంపై పని చేస్తోంది. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్ మార్టిన్ రూ.3.99 కోట్ల కారు
బ్రిటన్ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త ‘వాంటేజ్’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్కార్లలో ఇది రెండో మోడల్ అని కంపెనీ తెలిపింది. -
ధరలు తగ్గించిన ఓలా.. ఎస్1X ఇక రూ.69,999 నుంచే!
ఓలా తన ఎస్1 ఎక్స్ స్కూటర్ల ధరలను తగ్గించింది. ఇకపై వీటి ధరలు రూ.69వేల నుంచే ప్రారంభం కానున్నాయి. -
2023-24లో 5.5% తగ్గిన వాహన ఎగుమతులు
Automobile exports: 2024 ఆర్థిక సంవత్సరంలో వాహన ఎగుమతులు 5.5శాతం తగ్గాయని తయారీదార్ల సమాఖ్య వెల్లడించింది. -
ఓలా నుంచి త్వరలో మరో స్కూటర్.. ఎస్1 ఎక్స్ సిరీస్లో ఈ ఫీచర్లతో!
Ola Electric: ఓలా మరో స్కూటర్ తీసుకురాబోతోంది. ఎస్1 ఎక్స్ సిరీస్లో అప్డేట్ చేసిన వెర్షన్ వస్తోంది. -
విపణిలోకి ఎంజీ హెక్టార్ బ్లాక్స్టార్మ్
ఎంజీ (మోరిస్ గ్యారేజెస్) మోటార్ సంస్థ, తమ హెక్టార్ మోడల్లో సరికొత్త బ్లాక్స్టార్మ్ ఎడిషన్ను తీసుకొచ్చింది. -
స్విఫ్ట్, విటారా ధరల్ని పెంచిన మారుతీ సుజుకీ
Maruti Suzuki: మారుతీ సుజుకీ ఇండియా తన విపణిలోని కొన్ని మోడల్ వాహనాల ధరల్ని పెంచినట్లు బుధవారం ప్రకటించింది. -
బజాజ్ నుంచి కొత్త పల్సర్ N250
Bajaj Pulsar N250: ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో కొత్త N250ని లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి. -
జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ @ రూ.20.5 లక్షలు
Jeep Compass: జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ విడుదలైంది. దీన్ని పూర్తిగా బ్లాక్-గ్లాస్ ఫినిష్తో తీర్చిదిద్దింది. -
2023-24 వాహన విక్రయాల్లో రెండంకెల వృద్ధి.. కార్లు, ట్రాక్టర్లలో రికార్డు!
Automobile retail sales: వాహనాల లభ్యత మెరుగవ్వడం, కొత్త మోడళ్ల విడుదల వంటి అంశాలు దోహదం చేయటంతో విక్రయాలు పుంజుకున్నట్లు ఫాడా అధ్యక్షుడు మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు. -
ఏథర్ నుంచి ఫ్యామిలీ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 160 km
ఏథర్ సంస్థ రిజ్తా పేరుతో ఫ్యామిలీ స్కూటర్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.1.10 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్
టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత్లో మరిన్ని ప్రీమియం మోడళ్లను తీసుకురావాలని భావిస్తోందని కంపెనీ డిప్యూటీ ఎండీ తడషి అసజుమా పేర్కొన్నారు. -
బీఎండబ్ల్యూ.. టాటా టెక్ జాయింట్ వెంచర్
BMW-Tata Tech: జాయింట్ వెంచర్ నుంచి బీఎండబ్ల్యూ (BMW) గ్రూప్నకు చెందిన ప్రీమియం వాహనాలకు కావాల్సిన సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్ (SDV) సొల్యూషన్స్తో పాటు ఇతర ఐటీ సేవలను అందించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
-
పూర్వ వైభవానికి బైజూస్ పాట్లు.. కోర్సు ఫీజు తగ్గింపు!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
-
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/05/24)
-
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!