Sam Altman: మైక్రోసాఫ్ట్లోకి శామ్ ఆల్ట్మన్.. స్వయంగా ప్రకటించిన సత్య నాదెళ్ల
Sam Altman: ఓపెన్ఏఐ సీఈఓగా ఉద్వాసనకు గురైన శామ్ ఆల్ట్మన్ భవిష్యత్ కార్యాచరణ ఖరారైంది. ఆయన తమ కంపెనీలో చేరనున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్వయంగా ప్రకటించారు.
వాషింగ్టన్: ఓపెన్ఏఐ నుంచి ఉద్వాసనకు గురైన శామ్ ఆల్ట్మన్ (Sam Altman) భవితవ్యానికి సంబంధించి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella) సోమవారం కీలక ప్రకటన చేశారు. ఆల్ట్మన్ తమ కంపెనీ కొత్త కృత్రిమ మేధ పరిశోధన బృందంలో చేరనున్నారని వెల్లడించారు. ఆయనతో పాటు ఓపెన్ఏఐ నుంచి బయటకు వచ్చిన గ్రెగ్ బ్రాక్మన్ సైతం మైక్రోసాఫ్ట్తో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు.
వీరిదే నేతృత్వం..
ఆల్ట్మన్, బ్రాక్మన్ కలిసి మైక్రోసాఫ్ట్ ఏఐ టీమ్కు నేతృత్వం వహించనున్నట్లు నాదెళ్ల (Satya Nadella) పేర్కొన్నారు. వారి విజయానికి కావాల్సిన వనరులు సమకూర్చేందుకు తాము వేగంగా చర్యలు చేపడతామని ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. దీన్ని ఆల్ట్మన్ (Sam Altman) కూడా ధ్రువీకరించారు. తమ లక్ష్యం కొనసాగుతుందంటూ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
ఓపెన్ఏఐకి సీఈఓగా ఎమ్మెట్ షియర్..
మరోవైపు వీడియో స్ట్రీమింగ్ సైట్ ట్విచ్ సహ వ్యవస్థాపకుడు ఎమ్మెట్ షియర్ (Emmet Shear)ను కొత్త తాత్కాలిక సీఈఓగా ఓపెన్ఏఐ బోర్డు నియమించింది. ఆల్ట్మన్ను తొలగించిన వెంటనే సీఈఓ బాధ్యతలను మిరా మురాటి స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే, ఆమె కూడా ఆల్ట్మన్కు మద్దతు ప్రకటించడంతో తక్షణమే మరో వ్యక్తిని ఆ పదవిలోకి తీసుకురావడం ఓపెన్ఏఐకి అనివార్యమైంది! షియర్ ట్విచ్కు సీఈఓగానూ వ్యవహరించారు. 2014లో ట్విచ్ను అమెజాన్ కొనుగోలు చేసింది.
ఓపెన్ఏఐతో భాగస్వామ్యం ఉంటుంది..
షియర్ నియామకాన్ని నాదెళ్ల సైతం ధ్రువీకరించారు. ఓపెన్ఏఐతో తమ భాగస్వామ్యం కొనసాగుతుందన్నారు. సంస్థతో కలిసి తాము రూపొందించిన ప్రోడక్ట్ రోడ్మ్యాప్ ముందుకు సాగుతుందన్నారు. ఓపెన్ఏఐ కొత్త నాయకత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఓపెన్ఏఐలో మైక్రోసాఫ్ట్ అతిపెద్ద వాటాదారుగా ఉన్న విషయం తెలిసిందే.
ఆల్ట్మన్ షరతులకు బోర్డు నో?
తాజా పరిణామాల నేపథ్యంలో ఓపెన్ఏఐ సీఈఓగా శామ్ ఆల్ట్మన్ (Sam Altman)ను తిరిగి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు స్పష్టమైంది. తిరిగి రావడానికి సిద్ధంగానే ఉన్నానంటూనే.. ఆయన కొన్ని షరతులు విధించినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపిన విషయం విదితమే. దీనికి కొంతమంది బోర్డు సభ్యులు అంగీకరించలేదని.. దీంతో ఆల్ట్మన్ పునరాగమనానికి దారులు మూసుకుపోయినట్లు సమాచారం.
శామ్ ఆల్ట్మన్ (Sam Altman)ను సీఈఓ బాధ్యతల నుంచి తొలగిస్తూ ఓపెన్ఏఐ (OpenAI) సంస్థ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఓపెన్ఏఐ ఆయనను విశ్వసించకపోవడమే కారణమని బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఆయన స్థానంలో తాత్కాలికంగా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మిరా మురాటీ సీఈఓగా వ్యవహరిస్తారని ప్రకటించింది. ఆల్ట్మన్ను బాధ్యతల నుంచి తొలగించిన గంటల వ్యవధిలోనే సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు గ్రెగ్ బ్రాక్మన్ తన పదవికి రాజీనామా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 329 పాయింట్ల లాభంతో 74,059 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 22,505 దగ్గర కొనసాగుతోంది. -
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు
-
భర్త మద్దతుగా మాట్లాడలేదని వివాహిత ఆత్మహత్య
-
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM