Nitin gadkari: ఐదేళ్లలో అమెరికా తరహా రహదారులు: గడ్కరీ
Nitin gadkari on Roads: ఐదేళ్లలో భారత రహదారులు అమెరికాను తలపించనున్నాయని కేంద్రమంత్రి గడ్కరీ అన్నారు. ప్రయాణ సమయాన్ని, ప్రమాదాలను తగ్గించడమే తమ ఉద్దేశమని చెప్పారు.
Nitin gadkari | తిరువనంతపురం: దేశంలో రహదారులను మరింత మెరుగుపరచనున్నామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin gadkari) అన్నారు. రాబోయే ఐదేళ్లలో అమెరికా తరహా రోడ్లు భారత్లో దర్శనమివ్వనున్నాయని చెప్పారు. ప్రయాణ సమయాన్ని తగ్గించడం తమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో రహదారుల నిర్మాణానికి రూ.50 లక్షల కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. ఫలానా కాంట్రాక్ట్ మంజూరు చేయాలని ఏ ఒక్క గుత్తేదారూ తమ వద్దకు రావాల్సిన పనిలేదని, పనుల విషయంలో తాము పారదర్శకంగా ఉంటామని గడ్కరీ చెప్పారు. రహదారి మంత్రిత్వశాఖ, కాంట్రాక్టర్లు, బ్యాంకర్లు ఒక కుటుంబంలా తాము భావిస్తామని పేర్కొన్నారు. అందుకే ఏడు ప్రపంచ రికార్డులు సాధించగలిగామని చెప్పారు. ఈ మేరకు మనోరమ ఇయర్బుక్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు పేర్కొన్నారు.
‘‘రాబోయే ఐదేళ్లలో దేశ రహదారుల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. అమెరికా రహదారులను తలపించనున్నాయి’’ అని గడ్కరీ చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పన ద్వారానే దేశ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం సాధ్యమవుతుందన్నారు. తద్వారా పేదరికాన్ని, నిరుద్యోగాన్ని పారదోలడం వీలు పడుతుందన్నారు. ఆటోమొబైల్ సెక్టార్ మరింత విస్తరిస్తోందని గడ్కరీ చెప్పారు. ఇటీవలే జపాన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీని భారత్ అధిగమించి మూడో స్థానానికి చేరిందన్నారు. ప్రస్తుతం ఆటోమొబైల్ పరిశ్రమ రూ.7.5 లక్షల కోట్లకు చేరిందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యధిక జీఎస్టీ ఈ సెక్టార్ నుంచే వస్తోందన్నారు. ఈ రంగంలో 4.5 కోట్ల ఉద్యోగాల సృష్టి జరిగిందన్నారు. రాబోయే ఐదేళ్లలో ఈ రంగం రూ.15 లక్షల కోట్లకు చేరాలన్నదే తన ఆకాంక్ష అని వివరించారు. అన్ని రంగాల్లో భారత్ రాణిస్తోందని, భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోందని చెప్పారు.
మ్యూచువల్ ఫండ్స్లో జమ చేస్తున్నారా? నామినీలను చేర్చేందుకు ఇంకొన్ని రోజులే గడువు!
ప్రస్తుత శిలాజ ఇంధనాల స్థానంలో ఎలక్ట్రిక్, ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు రావాల్సిన అవసరం ఉందని గడ్కరీ అన్నారు. అప్పుడే రూ.16 లక్షల కోట్లుగా ఉన్న దిగుమతుల బిల్లు తగ్గుతుందన్నారు. ఇప్పటికే పెట్రోల్తో కాకుండా ఇథనాల్తో నడిచే వాహనాలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ఇథనాల్ వినియోగడం వల్ల రైతుల ఆదాయం పెరుగుతుందని చెప్పారు. రోడ్డు ప్రమాద మరణాలను 50 శాతం తగ్గించాలన్న లక్ష్యాన్ని నెరవేర్చలేకపోయామన్నారు. రహదారుల డిజైన్లలో లోపం, అవగాహనా లోపం, చట్టాలను ప్రజలు గౌరవించకపోవడం వంటివి ఇందుకు కారణమని గడ్కరీ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
Warren Buffett: భారత మార్కెట్లో ఉన్న అవకాశాలను భవిష్యత్తులో అందిపుచ్చుకునేందుకు తమ కంపెనీ బెర్క్షైర్ హాత్వే సిద్ధంగా ఉందని వారెన్ బఫెల్ తెలిపారు. -
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
IPO: రూ.6,400 కోట్ల సమీకరణ లక్ష్యంతో వచ్చేవారంలో మూడు కంపెనీలు ఐపీఓకు వస్తున్నాయి. 2004 నుంచి సాధారణ ఎన్నికల సమయంలో మే నెలలో ఐపీఓలు ఉండడం ఇదే తొలిసారి. -
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ రియాక్షన్ ఇదే..
యాపిల్ వాచ్ ఓ మహిళ ప్రాణాల్ని కాపాడింది. అసలు ఒక స్మార్ట్ గడియారం ఆమెను ఎలా రక్షించగలిగిందంటే. -
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
USA: అమెరికా టెక్ పరిశ్రమలో భారతీయులది కీలక పాత్ర అని సిలికాన్ వ్యాలీ సెంట్రల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ సీఈఓ హర్బీర్ కె భాటియా తెలిపారు. వారు లేనిదే ఆ పరిశ్రమ మనుగడ సాగించలేదని అభిప్రాయపడ్డారు. -
ఆరోగ్య బీమా మరింత భారం
పెరుగుతున్న ఆసుపత్రి ఖర్చులను తట్టుకునేందుకు ఆరోగ్య బీమా తప్పనిసరిగా మారింది. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఇటీవలి కాలంలో ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు చేసింది. -
కేకేఆర్ చేతికి హెల్తియమ్ మెడ్టెక్
సర్జికల్ సూదుల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న బెంగళూరు సంస్థ హెల్తియమ్ మెడ్టెక్లో మెజార్టీ వాటాను, అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల సంస్థ కేకేఆర్ రూ.7,000 కోట్ల (840 మిలియన్ డాలర్ల)కు కొనుగోలు చేయనుందని తెలిసింది. -
సైబర్ దాడులు.. మనపై ఎక్కువే
అమెరికా, బ్రిటన్ తర్వాత అంతర్జాతీయంగా ‘ఫిషింగ్’ దాడులను అత్యధికంగా ఎదుర్కొంటున్నది మన దేశమే. భారత దేశంపై జరిగిన సైబర్ దాడుల్లో 33% టెక్నాలజీ రంగంపైనే కనిపించాయని స్కేలర్ అనే సైబర్ భద్రతా సంస్థ తన నివేదికలో పేర్కొంది. -
ప్రయాణ - పర్యాటకంలో 5.82 కోట్ల ఉద్యోగాలు!
దేశీయంగా పర్యాటకానికి గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, ఆ రంగంతో పాటు ప్రయాణ రంగంలోనూ ఉపాధికి భారీ అవకాశాలు కలగనున్నాయి. -
ఎయిరిండియా క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితి తగ్గింపు
దేశీయ మార్గాల్లో క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితిని ఈనెల 2 నుంచి తగ్గించినట్లు ఎయిరిండియా తెలిపింది. తక్కువ ధర ఉండే ఎకానమీ తరగతి ప్రయాణికులు ఇకపై 15 కిలోలే ఉచితంగా క్యాబిన్ లగేజీగా తీసుకెళ్లొచ్చని వెల్లడించింది. -
కోటక్ బ్యాంక్ లాభం రూ.5,302 కోట్లు
ప్రైవేటు రంగ కోటక్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.5,302 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభంతో పోలిస్తే ఇది 25% అధికం. -
రెండేళ్లలో మళ్లీ చిన్న కార్ల హవా
దేశీయ విపణిలో చిన్న కార్ల విభాగం 2026 చివరికల్లా లేదా 2027 నాటికి పుంజుకునే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ఇండియా అంచనా వేస్తోంది. -
రూ.15,000 కోట్ల రుణాల కోసం వొడాఫోన్ ఐడియా యత్నాలు!
ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకులతో పాటు ప్రైవేటు రంగ బ్యాంకుల నుంచీ రూ.15,000 కోట్ల (1.8 బిలియన్ డాలర్ల) రుణాలు తీసుకునేందుకు వొడాఫోన్ ఐడియా చర్చలు సాగిస్తోందని సమాచారం. -
మన ఎగుమతులకు అంతర్జాతీయ అనిశ్చితులే బెంగ
అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండటం వల్ల, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయ ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని ఎగుమతిదార్ల సంఘం ఫియో అంచనా వేస్తోంది. -
పేటీఎం సీఓఓ భవీశ్ గుప్తా రాజీనామా
పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ అధికారి (సీఓఓ) భవీశ్ గుప్తా రాజీనామా చేశారు. పేటీఎంలో రుణ వ్యాపారం, ఆన్లైన్, ఆఫ్లైన్ చెల్లింపులు, కాంప్లియెన్సెస్ తదితర విభాగాలను భవీశ్ నడిపించేవారు. -
సంక్షిప్త వార్తలు
డీమార్ట్ సూపర్మార్కెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్, మార్చి త్రైమాసికంలో రూ.563 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.460 కోట్లతో పోలిస్తే, ఇది 22.39% అధికం. -
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
layoffs: ప్రపంచవ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్ నెలలోనే 20 వేల మందిని సాగనంపాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!
-
లఖ్నవూ చిత్తు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లిన కోల్కతా
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
‘మాకు పిల్లలు లేరు’.. వారి భవిష్యత్తు కోసమే మా తపన: మోదీ
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్