Apple CEO: ‘వారైతేనే బాగుంటుంది’.. యాపిల్ నెక్ట్స్ సీఈఓపై టిమ్ కుక్
యాపిల్ తదుపరి సీఈఓగా ఎవరైతే బాగుంటుందనే దానిపై యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తన మనసులో మాటను బయటపెట్టారు. యాపిల్ కంపెనీలోనే ఒకరైతే బాగుంటుందని చెప్పారు.
Tim cook on Apple CEO | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్కు సీఈఓ తదుపరి ఎవరు అనే అంశంపై ప్రస్తుత సీఈఓ టిమ్ కుక్ (Tim cook) తన మనసులో మాటను బయటపెట్టారు. దాదాపు 12 ఏళ్లుగా యాపిల్ సీఈఓగా వ్యవహరిస్తున్న ఆయన.. కంపెనీకి తన వారసుడిగా ఎవరైతే బాగుంటుందో చెప్పారు. యాపిల్ కంపెనీలో పనిచేస్తున్న ఒకరే ఆ బాధ్యతలు చేపడితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
బీబీసీ నిర్వహించిన ఓ పాడ్కాస్ట్లో టిమ్ కుక్ తాజాగా పాల్గొన్నారు. పాప్ సింగర్ దువా లిపా అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. యాపిల్ నుంచి ఒకరు సీఈఓ అయితే బాగుంటుందని టిమ్ కుక్ చెప్పారు. పేరు చెప్పేందుకు మాత్రం నిరాకరించారు. ‘‘సీఈఓగా ఎవరైతే బాగుంటుందనేది పేరు నేను చెప్పను. నా వారసుడిగా పనిచేయగల సమర్థత కలిగిన వ్యక్తులను తయారు చేయడం మాత్రమే నా పని. సీఈఓ ఎంపికలో కంపెనీకి సమగ్ర ప్రణాళిక ఉంది. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం’’ అని కుక్ అన్నారు.
1998లో యాపిల్లో చేరిన టిమ్ కుక్.. వివిధ స్థాయిల్లో పనిచేశారు. సీఓఓగానూ వ్యవహరించారు. స్టీవ్ జాబ్స్ మరణానికి కొన్ని రోజుల ముందు 2011లో సీఈఓగా బాధ్యతలు అందుకున్నారు. దాదాపు 12 ఏళ్లుగా ఆ బాధ్యతల్లో కొనసాగుతున్నారు. 10 ఏళ్లకు మించి తాను ఆ పదవిలో ఉండకపోవచ్చని రెండేళ్ల క్రితం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో టిమ్ కుక్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 329 పాయింట్ల లాభంతో 74,059 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 22,505 దగ్గర కొనసాగుతోంది. -
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు
-
భర్త మద్దతుగా మాట్లాడలేదని వివాహిత ఆత్మహత్య
-
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక