logo

ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయాలని ఆందోళన

రెజ్లర్లను లైంగికంగా వేధించిన ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ను పదవి నుంచి తొలగించి కేసు నమోదు చేసి అరెస్టు చేయాలంటూ జాతీయ కార్మిక, రైతు, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో గురువారం ఆదిలాబాద్‌ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు.

Published : 02 Jun 2023 04:05 IST

నినాదాలు చేస్తున్న వామపక్ష నేతలు

ఎదులాపురం, న్యూస్‌టుడే : రెజ్లర్లను లైంగికంగా వేధించిన ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ను పదవి నుంచి తొలగించి కేసు నమోదు చేసి అరెస్టు చేయాలంటూ జాతీయ కార్మిక, రైతు, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో గురువారం ఆదిలాబాద్‌ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. అనంతరం ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎంపీపై భాజపా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్‌, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొజ్జ ఆశన్న, అన్నమొల్ల కిరణ్‌, ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్ నారాయణ, టీఆర్‌ఎస్‌కేవీ జిల్లా నాయకులు అగ్గిమల్ల స్వామి, ఆయా సంఘాల నాయకులు బి.జగన్‌, చిల్క దేవీదాస్‌, బండి దత్తాత్రి, పూసం సచిన్‌, మెస్రం భాస్కర్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని