ఈత కారాదు గుండెకోత
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విభిన్న వాతావరణానికి పెట్టింది పేరు. ఇక్కడ వర్షాలు, చలి, ఎండ.. అన్నీ ఎక్కువే. మార్చిలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటుతున్నాయి.
న్యూస్టుడే, ఆదిలాబాద్ క్రీడావిభాగం
సొనాల మండలంలోని గొల్లాపూర్ చెరువులో ఈత కొడుతున్న యువకులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విభిన్న వాతావరణానికి పెట్టింది పేరు. ఇక్కడ వర్షాలు, చలి, ఎండ.. అన్నీ ఎక్కువే. మార్చిలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటుతున్నాయి. ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం చిన్నారులు, యువకులు, పెద్దలు ఈత కొట్టేందుకు వ్యవసాయ బావులు, చెరువులు, కాలువలు, కుంటలను ఆశ్రయిస్తుంటారు. నీటిలోతు తెలియక మునిగి తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా హోలీ పండగ రోజు అయిదుగురు ఈత రాక మృత్యువాతపడ్డారు. రాబోయేది వేసవి కాలం, పైగా విద్యార్థులకు సెలవులు. ఈ నేపథ్యంలో ఈతకు వెళ్లే సందర్భాల్లో తీసుకోవాల్సిన చిన్నపాటి జాగ్రత్తలను వివరిస్తూ ‘న్యూస్టుడే’ కథనం.
పాటించాల్సిన జాగ్రత్తలు..
- ఈత శిక్షకుల వద్ద నేర్చుకోవాలి.
- కొత్తగా నేర్చుకునేవారు 3 లేదా 4 అడుగుల నీటి లోతు వరకు మాత్రమే వెళ్లాలి.
- బావులు, కాలువలు, చెరువుల్లో ఈత కొట్టే ముందు వాటి లోతును పరిశీలించాలి.
- ఈత రానివారు ట్యూబులు, బెండులను వినియోగించాలి. వాటిని ఎప్పటికప్పుడు గమనించి సరి చేసుకోవాలి.
- తక్కువ నీరు ఉన్న ప్రదేశంలోనే వెళ్లాలి.
- ఈత కొట్టే సమయంలో సరదాలు, పందేలు, అత్యుత్సాహం వద్దు. అవి ప్రాణాలకే ముప్పు అవుతుంది.
- ఈత బాగా వచ్చిన పెద్దల సమక్షంలో చెరువులు, కుంటలు, బావుల్లో దిగాలి.
- కాలువల్లో ఈత నేర్చుకునేవారు అప్రమత్తంగా ఉండాలి. నీటి ప్రవాహం నిరంతరంగా, వేగంగా ఉంటుంది. కొన్ని చోట్ల సుడులు ఉంటాయి. తూము ఉన్న ప్రదేశంలో దిగి ప్రమాదం తెచ్చుకోవద్దు.
- ఈత కొలనులో ఈత నేర్చుకునేందుకు పిల్లలను పంపించే ముందు తల్లిదండ్రులు అక్కడ అనుభవజ్ఞులైన శిక్షకులు ఉన్నారా, రక్షణ చర్యలు ఉన్నాయా, లైఫ్గార్డ్లు అందుబాటులో ఉంటారా వంటి విషయాలు తెలుసుకోవాలి.
- ఈత నేర్చుకునే వారు తప్పనిసరి హెడ్క్యాప్, ఇయర్ప్లగ్స్ వాడాలి. అవి వెంట్రుకలు, చెవులకు రక్షణ ఇస్తాయి.
- మత్తు పదార్థాలు, మద్యం తీసుకుని ఈత కొట్టరాదు.
హోలీ రోజు మృత్యు ఘంటికలు..
- గతడిచిన అయిదేళ్లలో ఉమ్మడి జిల్లాలో 68 మంది ఈత రాక నీటిలో మునిగి మృతి చెందారు.
- ఈ హోలీ రోజున ఆదిలాబాద్కు చెందిన సాత్విక్(14) భీంసరి వాగులో స్నానం చేస్తుండగా మృత్యువాత పడ్డారు. కౌటాల మండలం నదీమాబాద్ తాటిపల్లి గ్రామం వద్ద పెన్గంగా నదిలో స్నానానికి దిగిన ఆలం సాయి(23), ఉప్పుల సంతోష్(23), ఎల్ములే ప్రవీణ్(24), పనస కమలాకర్(24) ఈత రాక మృతి చెందారు.
శిక్షకుల సమక్షంలో నేర్చుకోవాలి
- కొమ్ము కృష్ణ, ఈత శిక్షకుడు
కొత్తవారు, సాధకులు తప్పనిసరి ఈత శిక్షకులు, నిపుణుల పర్యవేక్షణలో నీటిలోకి దిగాలి. వారి సమక్షంలో ఈత నేర్చుకోవాలి. ఆత్మవిశ్వాసం ఉంటేనే 8 అడుగుల నీటి లోతులో దిగి ఈత కొట్టాలి. భయం, గాబరా పడితే ఎప్పటికీ ఈత రాదు. ధైర్యం ఉన్నవారే ఈతలో రాణించగలుగుతారు. పూర్తిగా తర్ఫీదు పొందిన తర్వాతే ఒంటరిగా ఈత కొట్టేందుకు వెళ్లాలి.
మంచి వ్యాయామం
- డా.క్రాంతికుమార్, ఎం.డి.జనరల్ ఫిజీషియన్
ఈత ఆరోగ్యానికి మంచిదే. రోజూ గంటపాటు ఈత కొడితే శరీరానికి కావాల్సిన వ్యాయామం లభిస్తుంది. ముందుగా వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. తమ ఆరోగ్య చరిత్ర వివరించాలి. వైద్యులు సిఫార్సు చేస్తేనే ఈత నేర్చుకోవాలి. ఆస్తమా, హృద్రోగులు, మూర్ఛ వ్యాధి ఉన్నవారు నీటిలోకి దిగొద్దు. కొత్తగా ఈత నేర్చుకునేటప్పుడు వారి తల్లిదండ్రులు దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉండాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా ఓడితేనే ఆదివాసుల మనుగడ
[ 28-04-2024]
కేంద్రంలో భాజపా సర్కారును ఓడిస్తేనే దేశంలో ఆదివాసుల మనుగడ సుసాధ్యమవుతుందని ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కోసం సచిన్ అన్నారు. -
భాజపా ఆధ్వర్యంలో ఇటింటి ప్రచారం
[ 28-04-2024]
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం తాంసి (బి) లో ఆదివారం భాజపా నాయకులు, కార్యకర్తలు కరపత్రాలు పంపిణీ చేస్తూ ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కళలకు నిలయం బాలకేంద్రం
[ 28-04-2024]
వివిధ భారతీయ కళలకు నిలయంగా బాలకేంద్రం నిలుస్తుందని జిల్లా విద్యాశాఖ కార్యాలయం సిబ్బంది ఉదయశ్రీ అన్నారు. -
ఉత్సాహంగా జిల్లా స్థాయి క్రికెట్ ఎంపిక పోటీలు
[ 28-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో ఆదివారం హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
[ 28-04-2024]
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఆదిలాబాద్ పట్టణ సమీపంలోని మావల వద్ద 44వ జాతీయ రహదారిపై జరిగింది. -
కార్మికుల్లో సామాజిక స్పృహ అభినందనీయం
[ 28-04-2024]
కార్మికుల్లో సామాజిక స్పృహ ఉండటం అభినందనీయమని డీఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్ పేర్కొన్నారు. -
అక్రమాలకే ప్రా‘ధాన్యం’?
[ 28-04-2024]
ఎక్కడ ముడిసరకు లభ్యమవుతుందో సాధారణంగా అక్కడే పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ధాన్యం ఆశించిన రీతిలో పండకున్నా ఇక్కడ ఏకంగా తొమ్మిది రైస్ మిల్లులు ఏర్పాటయ్యాయి. -
భాజపా బలగాల మోహరింపు
[ 28-04-2024]
ఉమ్మడి జిల్లా పరిధిలోకి వచ్చే ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకునేలా భాజపా కార్యాచరణ చేపట్టింది. -
మండుటెండల్లో అంటుకుంటున్న అడవులు
[ 28-04-2024]
జిల్లాలో గతంకంటే ఈ ఏడాది ఎండల తీవ్రత అత్యధికంగా ఉండి ఉదయం పది గంటలకే ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. -
వంద ఎకరాలు కొట్టేసే పన్నాగం
[ 28-04-2024]
‘వడ్డించే వాడు మనవాడైతే చివర్లో కూర్చున్నా కంచంలోకి అన్నీ వచ్చి చేరుతాయి’ అన్న చందంగా అధికారులు, నేతలు కుమ్మక్కై వంద ఎకరాల భూమిని ఆక్రమించే ప్రయత్నం సాగుతోంది. -
నిధులు రాక.. నిర్వహణ లేక
[ 28-04-2024]
రైతులకు పండ్ల తోటల పెంపకంపై శిక్షణ ఇవ్వడం, మొక్కల ఉత్పత్తి కోసం ఏర్పాటు చేసిన ఉద్యానవన నర్సరీ, రైతు శిక్షణ కేంద్రాలు నిర్వహణ లోపంతో మూతపడే దశకు చేరుకున్నాయి. -
ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
[ 28-04-2024]
కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజలకు వివరించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క కార్యకర్తలకు సూచించారు. -
నేర ప్రవృత్తి మార్చుకోవాలి : ఎస్పీ
[ 28-04-2024]
జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు జిల్లా ఎస్పీ కె.సురేష్కుమార్ తెలిపారు. -
ఓటర్లు @ 15,96,430
[ 28-04-2024]
మంచిర్యాల విద్యావిభాగం, న్యూస్టుడే: ప్రస్తుత లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా కొలిక్కివచ్చింది. -
సిబ్బంది కొరత.. వసతుల లేమి
[ 28-04-2024]
జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో సిబ్బంది కొరత, వసతుల లేమితో సరైన సేవలు అందక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ను గెలిపించాలి
[ 28-04-2024]
మనిషికి చేతులు ఎంతముఖ్యమో.. దేశానికి చేతిగుర్తు పార్టీ అవసరం అంతే ఉందని కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ కోరారు. -
అవగాహన లేక.. అనుమతి పొందక..!
[ 28-04-2024]
పెళ్లి.. రిసెప్షన్.. పుట్టినరోజు.. ఇలా వేడుకేదైనా చాలామంది ఎంతో ఆర్భాటంగా నిర్వహించాలనుకుంటున్నారు. -
నీతి ఆయోగ్ పథకం.. అమలైతే అభివృద్ధి యోగం
[ 28-04-2024]
మారుమూల గిరిజన ప్రాంతమైన పెంబి మండలం అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. కనీస వసతులు, రవాణా సౌకర్యాలు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు అనేకం. -
గుంపులున్న చోటుపై గురి..
[ 28-04-2024]
ఎన్నికల ప్రచారానికి మరో 14 రోజులు మాత్రమే గడువుంది. లోక్సభ పరిధిలో రెండు వేలకు పైగా గ్రామాలు, 380కి పైగా గూడేలు, తండాలు ఉన్నాయి. -
పెద్దపల్లిలో స్థానికేతరులకే పెద్దపీట
[ 28-04-2024]
పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి ఎంపీలుగా ఎన్నికైనవారిలో ఇప్పటి వరకు స్థానికులెవరూ విజయం సాధించలేకపోయారు. -
మండే ఎండతో జాగ్రత్త..
[ 28-04-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆరెంజ్ జోన్లో ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. -
తూర్పున ఎంపీ.. పశ్చిమాన అభ్యర్థి
[ 28-04-2024]
జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామం మరోసారి తెరపైకి వచ్చింది. -
వేసవి తాపం.. కొబ్బరినీరే ఉపశమనం
[ 28-04-2024]
రామకృష్ణాపూర్లోని ఆర్కేపీ ఓసీ, సీహెచ్పీ, సింగరేణి ఏరియా ఆసుపత్రితో పాటు కాలనీల్లో భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..