కోట్ల మంది భక్తులొస్తున్నా..కాటేజీలు లేవు..!
దుర్గగుడికి దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు ఒక్క రోజు ఆలయ ప్రాంగణంలో నిద్రించాలన్నా సరైన సౌకర్యాలు లేవు.
గతంలో ఉన్నవీ ప్రస్తుతం లేకుండా చేశారు
సౌకర్యాలు కల్పిస్తే దుర్గగుడికి భారీగా ఆదాయం
ఈనాడు, అమరావతి
దుర్గగుడికి దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు ఒక్క రోజు ఆలయ ప్రాంగణంలో నిద్రించాలన్నా సరైన సౌకర్యాలు లేవు. ప్రధానంగా ఆలయానికి సమీపంలో ఒక్క కాటేజీ కూడా లేదు. గతంలో ఉన్న ఒకటో అరో కాటేజీలను కూడా ఇతర అవసరాల కోసం ప్రస్తుతం వినియోగిస్తున్నారు. తిరుపతి, సింహాచలం, శ్రీశైలం, ద్వారకా తిరుమల, అన్నవరం సహా రాష్ట్రంలోని ఏ పెద్ద ఆలయాన్ని చూసినా వచ్చే భక్తుల కోసం భారీ సంఖ్యలో కాటేజీలున్నాయి. ఏటా రూ.కోట్లలో ఆదాయం ఈ కాటేజీలపైనే ఆ ఆలయాలకు వస్తోంది. ఈ దేవస్థానాలకు వచ్చే భక్తులు కూడా కనీసం ఒకటి రెండు రోజులు అక్కడే ఉండేలా ప్రణాళికలు వేసుకుంటారు. దీనికి ప్రధాన కారణం అక్కడ అన్ని సౌకర్యాలతో కూడిన కాటేజీలు అందుబాటులో ఉండడమే. దుర్గగుడిలో కాటేజీలు లేకపోవడంతో వచ్చే భక్తులు ఇలా వచ్చి అలా దర్శనం చేసుకుని కొండ దిగి వెళ్లిపోతుంటారు. విజయవాడలోని ప్రైవేటు హోటళ్లలో ఉండడం ఇష్టం లేక, దర్శనం చేసుకున్న వెంటనే రైళ్లు, బస్సుల్లో సొంతూళ్లకు 90 శాతం మంది వెళ్లిపోతున్నారు. ఎంత మంది ఈవోలు, పాలక మండళ్లు మారుతున్నా దుర్గగుడిలో భక్తులకు అవసరమైన కాటేజీలపై కనీస దృష్టి కూడా సారించడం లేదు.
రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద దేవాలయమైన విజయవాడ దుర్గగుడికి ఏటా కోటిన్నర మందికి పైగా భక్తులు, రూ.100 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. కానీ ఆలయానికి అనుబంధంగా సాధారణ భక్తుల కోసం సరైన కాటేజీ ఒక్కటి కూడా లేదు. పదేళ్ల క్రితం వరకూ సాధారణ భక్తులకు అందుబాటులో కొండ దిగువనే అరండల్ సత్రం, ఇంద్రకీలాద్రి అతిథి గృహం, మాడపాటి సత్రం ఉండేవి. ఈ మూడింటిలో ఉన్న గదులన్నీ కలిపినా వంద లోపే ఉన్నా సాధారణ భక్తులకు అందుబాటులో ఉండేవి. కానీ వాటిని అధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా.. కొన్నాళ్లు కార్యాలయాలు, ఇతర అవసరాల కోసం వినియోగించడం, మళ్లీ భక్తులకు కేటాయించడం.. ఇలా మారుస్తూ వస్తున్నారు.
ఏటేటా
తగ్గిపోతూ..రాష్ట్రంలోని ఇతర ఆలయాల్లో ఏటా సౌకర్యాలు పెరుగుతూ ఉంటే దుర్గగుడిలో తగ్గుతూ వస్తున్నాయి. ఒకప్పుడు కొండపైనే అన్నదాన భవనం విశాలంగా ఉండేది. అమ్మవారి దర్శనం చేసుకున్న వెంటనే భక్తులు లైన్లలో వెళ్లి అన్నదానం స్వీకరించి సంతృప్తిగా వెళ్లేవారు. ప్రస్తుతం తాత్కాలికంగా మహామండపంలో అన్నదానం పెడుతున్నారు. భక్తులు అష్టకష్టాలు పడుతూ అక్కడికి వెళ్లాల్సి వస్తోంది. ఏటా ఆదాయం పెరుగుతుంటే సౌకర్యాలను తగ్గించుకుంటూ రావడంపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా కాటేజీల విషయంలో భక్తుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రైల్వేస్టేషన్కు సమీపంలో సి.వి.రెడ్డి ఛారిటీస్ స్థలంలో ఎందుకు కట్టారో, ఎలా వినియోగించాలో కూడా తెలియక.. నాలుగు షెడ్డులను వేసి వాటిని డార్మెటరీలుగా అందుబాటులో ఉంచారు. అక్కడ భక్తులకు మంచాలను అద్దెకు ఇస్తున్నారు. కనీసం ఈ స్థలంలో భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా కాటేజీలను నిర్మించినా భారీగా ఆదాయం వస్తుంది. దుర్గగుడిలో కాటేజీలు ఉండవు.. అని భక్తులు మానసికంగా నిర్ణయించుకోవడం వల్లే ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారు. ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయనే నమ్మకం వారికి కల్పిస్తే.. ప్రస్తుతం ఉన్న ఆదాయం కంటే రెట్టింపు వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
కనీసం ఈ మూడింటినీ ఉంచినా..
కొండను ఆనుకుని ఉండే అరండల్ సత్రాన్ని పూర్తిగా కేశఖండనశాలగా మార్చేశారు. బ్రాహ్మణవీధిలో గతంలో భక్తులకు అందుబాటులో ఉండే జమ్మిదొడ్డి ఇంద్రకీలాద్రి అతిథి గృహంలోని గదులన్నింటినీ పడగొట్టి మూడేసి కలిపి ఒక్కో గదిగా మార్చారు. ఆ తర్వాత ఈ గదులను కొన్నాళ్లు కార్యాలయాలుగా వినియోగించారు. ప్రస్తుతం ఈవో, ఈఈ, ఏఈవోలు అందరి కార్యాలయాలు మహామండపంలోని నాలుగో అంతస్తులోకి మార్చారు. కానీ ఈ గదులను మాత్రం ఇంకా వినియోగించడం లేదు. వీటిలో మళ్లీ పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. జమ్మిదొడ్డిలో ఒకటో అంతస్తులో మంత్రి కార్యాలయం ఉంది. రెండు, మూడో అంతస్తుల్లోని గదుల్లో బాత్రూంలు, కిటికీలు, మంచాలు సహా సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. ఇక మాడపాటి సత్రంలో ఉన్నవే 18 గదులు. వీటిలో ఐదు స్యూట్రూంలు, 13 సాధారణ గదులు. ప్రస్తుతం భక్తులకు వీటిని అందుబాటులో ఉంచారు. కానీ ఈ విషయం భక్తులకు పెద్దగా తెలియదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధికారం నీడలో.. అరాచక లాఠీ!
[ 29-04-2024]
ప్రజాస్వామ్యమంటే గౌరవం లేదు. ప్రజలు కట్టిన పన్నుల నుంచే జీతభత్యాలు పొందుతున్నామన్న ధ్యాస లేదు. చట్టాన్ని త్రికరణశుద్ధిగా అమలు చేస్తామని, బాధితులకు బాసటగా నిలుస్తామని చేసిన ప్రమాణాలనే తూచ్ అనేశామన్న బాధే లేదు. -
పట్టాల పేరుతో కోట్లు కొట్టేశారు!
[ 29-04-2024]
జగన్ జమానాలో అవినీతి, అక్రమాల ఆక్టోపస్లు దశదిశలా వేళ్లూనుకుపోయాయి. నేతలు.. కొంతమంది అధికారులు కుమ్మక్కై ప్రజాధనాన్ని నిలువునా దోచేశారు. సెంటు పట్టా పేరుతో భారీ కుంభకోణానికి తెర తీసి రూ. కోట్లు వెనకేసుకున్నారు. -
బ్యాంకు ఖాతాలకే పింఛను సొమ్ము జమ
[ 29-04-2024]
ఏప్రిల్ నెలకు సంబంధించిన సామాజిక పింఛన్ల నగదు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకే జమ చేయనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. -
6న అవనిగడ్డకు పవన్ కల్యాణ్
[ 29-04-2024]
ఎంపీ వల్లభనేని బాలశౌరి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్తో కలిసి ఆదివారం వేకనూరు వంతెన కూడలిలోని అభయాంజనేయస్వామిని దర్శించుకొని పూజలు చేశారు. -
భారీగా బంగారం.. వెండి పట్టివేత
[ 29-04-2024]
సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీగా బంగారం, వెండి దొరికిన సంఘటన కంచికచర్ల మండలం పేరకలపాడు సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. -
బుద్ధవిహార్కు వైకాపా గ్రహణం
[ 29-04-2024]
ప్రాచీన చరిత్ర కలిగిన ఘంటసాలలో ఏపీ పర్యాటక శాఖ ద్వారా 2017లో బుద్ధ విహార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పటి కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మొదటి విడతగా రూ.1.5 కోట్లు మంజూరు చేయగా రెండంగస్తుల భవన నిర్మాణం చేపట్టారు. -
కూడూరులో కాగితకు మద్దతు
[ 29-04-2024]
వైకాపా అభ్యర్థి ఉప్పాల రమేష్(రాము) సొంత పంచాయతీ కూడూరులో తెదేపా అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. -
అభివృద్ధే ఆకాంక్ష..ఆశీర్వదించండి: కొల్లు
[ 29-04-2024]
బందరు అభివృద్ధే తమ ఆకాంక్ష అని..నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు. నగరంలోని 4, 5 డివిజన్లతో పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. -
ఏకోపాధ్యాయులతో ఎదిగేదెట్టా?
[ 29-04-2024]
ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా చేస్తానని, ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులుండేలా చర్యలు తీసుకుంటానని జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సంకల్పయాత్రలో హామీ ఇచ్చారు. -
కదిలితే కేసు.. మెదిలితే నోటీసు
[ 29-04-2024]
ఇలా పదే పదే గొప్పలు చెప్పిన వారి మాటలు సత్యదూరాలే అన్న విషయం కళ్లెదుటే కన్పిస్తోంది. వైకాపా ప్రభుత్వం వచ్చాక గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను అక్రమ కేసులతో అణిచివేసే విష సంస్కృతికి తెరతీశారన్న ఆరోపణలకు ఎన్నో ఉదాహరణలున్నాయి. -
వీరి గోడు పట్టించుకునేదెవరు..?
[ 29-04-2024]
నగరంలోని ఏ డివిజన్కు వెళ్లినా సమస్యలే కనిపిస్తున్నాయి. బందరుకోట ప్రధాన డ్రెయిన్ గుర్రపుడెక్కతో మేట వేసుకుపోవడంతో స్థానికులతో పాటు వివిధ డివిజన్లకు చెందిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. -
‘జగన్ వస్తే అవస్థలు తప్పవు..’
[ 29-04-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అవస్థలు తప్పవని, ప్రజలంతా కూటమిని గెలిపించాలని నిర్ణయం తీసేసుకున్నారని పెడన తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. -
తెదేపాలో చేరిన వైకాపా నాయకులు
[ 29-04-2024]
పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని తెదేపా మండల అధ్యక్షుడు పోతన లక్ష్మీనరసింహస్వామి అన్నారు. మండల పరిధిలోని పోసినవారిపాలెం గ్రామానికి చెందిన వైకాపా నాయకులు పలువురు ఆదివారం తెదేపాలో చేరారు. -
అమ్మకు కష్టం.. అందని వైద్యం
[ 29-04-2024]
వైద్యరంగాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి పర్చామని, గ్రామీణులకు కార్పొరేట్ వైద్యం అందేలా చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయని వైకాపా ప్రభుత్వం చేస్తోన్న ప్రచారానికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన కన్పించడం లేదు. -
అడుగేస్తే నిర్భంధం.. ప్రశ్నిస్తే కేసులు
[ 29-04-2024]
గుడివాడ, అవనిగడ్డ నియోజకవర్గాల్లో అయిదేళ్లుగా అధికార పార్టీ ఆగడాలకు అంతులేకుండా పోయింది. కళ్లముందే జరిగిన అన్యాయాన్ని ఎదిరించాలన్నా, ప్రశ్నించాలన్నా తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందోనని ప్రజలు భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. -
కార్మికుల కడుపుకొట్టి.. గుత్తేదార్లకు దోచిపెట్టి
[ 29-04-2024]
కార్మికులకు అండగా ఉంటానంటూ ఆశలు రేకెత్తించి గద్దె నెక్కిన జగన్ నదుల్లోని ఇసుకను యంత్రాలతో ఎగుమతికి ప్రోత్సహించి మూడున్నరేళ్లుగా వేలాది మంది కార్మికుల పొట్టగొట్టి గుత్తేదారులకు రూ.కోట్లు దోచిపెట్టారని లంకపల్లి, శ్రీకాకుళం, తోట్లవల్లూరు, శ్రీకాకుళం తదితర ఇసుక రేవుల్లో పనిచేసే కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వైకాపా మాటలు నమ్మి మోసపోవద్దు : వర్ల
[ 29-04-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆయన మాటలు నమ్మి మరోసారి ఎవరూ మోసపోవద్దని తెదేపా కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
అభివృద్ధికి బాటలు వేద్దాం రండి
[ 29-04-2024]
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని కాలనీలను అభివృద్ధి పరిచేందుకు బాటలు వేద్దామని, అందరూ కలిసి రావాలని కూటమి విజయవాడ ఎంపీ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థులు కేశినేని శివనాథ్, సుజనా చౌదరిలు ప్రజలకు పిలుపునిచ్చారు. -
నాణ్యమైన విద్యకు భరోసా ఏది జగన్?
[ 29-04-2024]
సంస్కరణల్లో భాగంగా ఏకోపాధ్యాయ పాఠశాలలంటూ చిన్నారుల జీవితాలతో జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది.