నియామకాల బూటకం.. నకిలీల నాటకం
రోగులకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందజేస్తున్నామని చెబుతున్న వైకాపా సర్కారుకు క్షేత్రస్థాయి పరిస్థితులు కనిపించడం లేదు. రాజమహేంద్రవరానికి నూతన వైద్య కళాశాలను తీసుకొచ్చి 150 ఎంబీబీఎస్ సీట్లతో పాటు బోలెడన్నీ ఉద్యోగ నియామకాలు చేపట్టా మంటున్నా.
రాజమహేంద్రవరం వైద్య కళాశాల దుస్థితి
న్యూస్టుడే, రాజమహేంద్రవరం వైద్యం
రోగులకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందజేస్తున్నామని చెబుతున్న వైకాపా సర్కారుకు క్షేత్రస్థాయి పరిస్థితులు కనిపించడం లేదు. రాజమహేంద్రవరానికి నూతన వైద్య కళాశాలను తీసుకొచ్చి 150 ఎంబీబీఎస్ సీట్లతో పాటు బోలెడన్నీ ఉద్యోగ నియామకాలు చేపట్టా మంటున్నా.. పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఈ కళాశాలకు సంబంధించి కొన్ని పోస్టుల్లో నకిలీలు కొనసాగు తున్నారన్న అంశం.. గతేడాది నవంబరులో విడుదల చేసిన 77 పోస్టుల నియామకాల్లో జాప్యం జరుగుతుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. నకిలీ ఉద్యోగులను తొలగించడంతో పాటు గతేడాది విడుదల చేసిన నియామక ప్రకటనకు సంబంధించి ప్రకియను కొలిక్కి తీసుకురావాలని అంతా కోరుతున్నారు.
వివరణ కోసం ఇంకెన్ని నెలలు..
జీజీహెచ్, వైద్యకళాశాల పరిధిలోని 77 పోస్టులకు గత నవంబరులో నోటిఫికేషన్ విడుదల చేసినా నేటికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. 2023 డిసెంబర్ 20 నాటికే పోస్టింగులు ఇచ్చేస్తామని ప్రకటించినా ఇప్పటికీ అతీగతీ లేదు. ఈ నియామకాలకు సంబంధించి మధ్యవర్తులు, రాజకీయ జోక్యం కారణంగా అర్హులకు అన్యాయం జరుగుతుందనే ఆరోపణలు వినిపించాయి. వాటి జాబితా కోసం 7,115 మంది ఎదురు చూస్తున్నా నిరాశ తప్పడం లేదు. మానసిక విభాగానికి సంబంధించి ఓ పోస్టుకు విద్యార్హతకు అభ్యర్థులు అభ్యంతరాలు తెలపడంతో దాని వివరణ కోసం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ)కి లేఖ రాశామని, అక్కడ తాత్సారం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఒక్కపోస్టు విద్యార్హత వివరణ కోసం మొత్తం నోటిఫికేషన్ను అయిదు నెలల నుంచి నిలిపివేయడం దారుణమని వాపోతున్నారు.
ప్రాణాలతో చెలగాటమే..
వ్యాధి నిర్ధారణ వంటి కీలక విభాగాల్లో నైపుణ్యంలేని వారు విధుల్లో ఉంటే ప్రాణాలతో చెలగాటమే. రాజమహేంద్రవరం వైద్య కళాశాల ఏర్పాటైనప్పుడు 2022లో కాకినాడ డీఎంహెచ్వో ఆధ్వర్యంలో కంబైన్డ్ నోటిఫికేషన్ విడుదల చేసి నియామకాలు చేపట్టారు. ఇందులో భాగంగా మొత్తం 12 మంది ల్యాబ్టెక్నీషియన్లు ఇక్కడికి వచ్చారు. వీరిలో అయిదుగురు తగిన అర్హత, పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్, దాని రెన్యువల్ పత్రాలు లేకుండానే ఉద్యోగాలు పొందినట్లు తెలుస్తోంది. వీరంతా ఒకేషనల్ ఎంఎల్టీ చేసిన వారే కావడం గమనార్హం. వీరు కచ్చితంగా ఏదైనా 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో క్లినికల్ శిక్షణ తీసుకుని దాని ఆధారంగా పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్లు చేయించుకోవాల్సి ఉంది. కొందరు శిక్షణ తీసుకోకపోవడం, మరికొందరు ధ్రువపత్రాలు సరిగా లేకపోవడం తదితర కారణంగా ప్రస్తుతం అవి రెన్యువల్ అవ్వడం లేదు. వీరంతా ప్రస్తుతం జీజీహెచ్లోని ల్యాబ్లో రోగులకు పరీక్షలు చేసేస్తున్నారు. ఏడాదిన్నర నుంచి వేతనాలు తీసేసుకుంటున్నారు. వారి కాంట్రాక్టు బాండు రెన్యువల్ సైతం తీసుకుంటున్నారు.
నకిలీలుంటే చర్యలు చేపడతాం..
- డాక్టర్ సౌభాగ్యలక్ష్మి, ప్రిన్సిపల్, రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల
వైద్య కళాశాలకు సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్లలో నకిలీలు ఉంటే పరిశీలించి చర్యలు చేపడతాం. వారి విద్యార్హత, బోర్డు రిజిస్ట్రేషన్, రెన్యువల్ పత్రాలను తనిఖీ చేస్తాం. నకిలీ అని తేలితే చర్యలు చేపట్టడంతో పాటు వారి వేతనాలు రికవరీ చేసేలా అథారిటీకి లేఖ రాస్తాం. నోటిఫికేషన్కు సంబంధించి వైద్య విద్య సంచాలకుని కార్యాలయ ఉన్నతాధికారులతో చర్చించాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగే జరిగింది. త్వరలోనే తుది జాబితా ప్రచురించి ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందజేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల వేళ.. కోనసీమ జిల్లాలో భారీగా బంగారం స్వాధీనం
[ 29-04-2024]
ఎన్నికల నేపథ్యంలో కోనసీమ జిల్లాలో చేపట్టిన తనిఖీల్లో భారీగా బంగారం పట్టుపడింది. -
హోటలలో ఆహార భద్రత అధికారులు తనిఖీలు
[ 29-04-2024]
భువనగిరి పట్టణంలోని పలు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డాక్టర్ ఎం. సుమన్ కల్యాణ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ స్వాతి సోమవారం సాయంత్రం ఆకస్మికంగా దాడులు జరిపారు. -
కలిసికట్టుగా పనిచేసి అత్యధిక మెజారిటీని సాధిద్దాం
[ 29-04-2024]
కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేసి భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి కోరారు. -
బటన్నోక్కే వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపాలి
[ 29-04-2024]
బటన్ నొక్కే వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలంతా సాగనంపాలని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీరంతా ఓటు వేయాలని సీనియర్ తెదేపా నాయకుడు పెండ్యాల అచ్చిబాబు తెలిపారు. -
పింఛన్దారులను మండుటెండలో తిప్పడమే వైకాపా పనిగా పెట్టుకుంది
[ 29-04-2024]
మండుటెండలో పింఛన్దారులను అటూ ఇటూ తిప్పడమే వైకాపా పనిగా పెట్టుకుందని ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు ఆరోపించారు. -
వైకాపా ఫ్యాన్ రెక్కలు ఊడిపోయాయి.. కూటమిదే విజయం: పవన్కల్యాణ్
[ 29-04-2024]
వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వనని ముందు నుంచే చెబుతున్నానని జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. -
కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
[ 29-04-2024]
కోనసీమ జిల్లా అమలాపురం గ్రామీణ మండలం భట్నవిల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
కాటన్ దొర కట్టారు.. జగన్ చెడగొట్టారు
[ 29-04-2024]
సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ.. ఉభయ గోదావరి జిల్లాల కర్షకుల ఆశా దీపం. ఎక్కడి నుంచో వచ్చిన విదేశీయుడు ఈ ప్రాంత ప్రజలు, రైతుల కోసం అంతలా ఆలోచించి ఆనకట్ట కట్టారు. -
మార్పు కోరితే.. కూటమికి ఓటెయ్యండి
[ 29-04-2024]
ఉపాధి కావాలన్నా.. కష్టాలున్నా.. నేను వచ్చి మాట్లాడుతా.. నాకు లంచాలు అవసరం లేదు. రైతు కన్నీళ్లు తుడవగలిగితే.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే నాకు ఆనందం..రాష్ట్రంలో 30వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైతే ఒక్కరు మాట్లాడరు. -
ఆదర్శంగా తీర్చిదిద్దడమంటే ‘ఇదేనా ఎంపీ గారు..’
[ 29-04-2024]
‘‘కడియం మండలంలోని పొట్టిలంక గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నా. జాతీయస్థాయిలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా’’ ఇదీ రాజమహేంద్రవరం ఎంపీగా మార్గాని భరత్రామ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రకటన. -
వైకాపా అండ.. అక్రమ దందా
[ 29-04-2024]
అధికార పార్టీ నాయకులు అండదండలు, జిల్లా, స్థానిక అధికారులు ఆశీస్సులు ఉంటే ఎన్ని అక్రమాలు చేసినా.. అవినీతికి పాల్పడినా పట్టించుకోరన్న ధైర్యం స్థానిక వైకాపా నాయకుల్లో ఉంది.. -
మే 18 నుంచి సత్యదేవుని కల్యాణోత్సవాలు
[ 29-04-2024]
అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. మే 18 నుంచి 24 వరకు జరగనున్న స్వామివారి కల్యాణోత్సవాలకు ఏర్పాట్లపై పెద్దాపురం ఆర్డీవో సీతారామారావు అధ్యక్షతన సమీక్ష సమావేశం ఆదివారం జరిగింది. -
వైకాపాకు ఓటేస్తే.. మీ ఆస్తులన్నీ తాకట్టే
[ 29-04-2024]
రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. అన్ని వర్గాలకూ న్యాయం చేస్తుందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హామీ ఇచ్చారు. -
మూగబోయిన జీవితాలు
[ 29-04-2024]
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కాపవరం శివారు హైవేపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. -
బ్రాహ్మణ సమాజం ఏకం కావాలి: నాగబాబు
[ 29-04-2024]
బ్రాహ్మణ సమాజ అభ్యున్నతికి బ్రాహ్మణులంతా ఏకం కావాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు పిలుపునిచ్చారు. ఆదివారం పిఠాపురంలో బ్రహ్మణ సంఘాలు నాగబాబును కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. -
పిఠాపురం.. కొరకరాని కొయ్య
[ 29-04-2024]
పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కల్యాణ్ను ఎదుర్కొనేందుకు అధికార వైకాపా చేయని కుటిల ప్రయత్నాలు లేవు. పోలింగ్కు పక్షం రోజుల ముందు నుంచే ఓటర్లను మచ్చిక చేసుకోడానికి నగదు ఎరవేస్తోంది. -
హోం ఓటింగ్కు 69 బృందాలు
[ 29-04-2024]
పోలింగ్ కేంద్రాల వరకు రావాల్సిన అవసరం లేకుండా ఇంటివద్దే ఓటుహక్కు వినియోగించుకునేలా 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40 శాతం వైకల్యంతో ఉన్న దివ్యాంగ ఓటర్లకు ఎన్నికల కమిషన్ హోం ఓటింగ్ అవకాశాన్ని కల్పించడంతో దీనికోసం మొత్తం 400 మంది ఎన్నికల సిబ్బందితో 69 బృందాలను ఏర్పాటు చేశారు. -
రారండోయ్ వేడుక చేద్దాం.. ఓట్లు దండుకుందాం
[ 29-04-2024]
అధికార పార్టీ నేతలు నాలుగేళ్లుగా లేనిది ఈ ఏడాది ఇప్పుడే పుట్టినరోజులు, పెళ్లిరోజులు చేసుకుంటున్నారు. గతంలో పదిమందితో కలిసి వేడుక చేసుకునే వాళ్లు ఇప్పుడు 100మందిని పిలుస్తున్నారు. అంతా ఎన్నికల మహత్యం మరి!. -
ఆంధ్రాలో మార్పు కోసమే కూటమి
[ 29-04-2024]
ఆంధ్రాలో అరాచక పాలన అంతమొందించేందుకే తెదేపా, జనసేన, భాజపా కూటమిగా ప్రజల ముందుకు వచ్చాయని, ఈ ఎన్నికల్లో వైకాపాను ఇంటికి పంపేందుకు ప్రజలంతా ‘సిద్ధం’గా ఉన్నారని రాజమహేంద్రవరం ఎన్డీయే కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. -
డబ్బు.. బిర్యానీ చూపి జనానికి ఎర
[ 29-04-2024]
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం పరిధిలోని అంబాజీపేటలో సోమవారం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సభ నిర్వహించనున్నారు. -
నేతలను ప్రసన్నం చేసుకోవాలని.. ప్రలోభాలతో వైకాపా కుటిలయత్నాలు
[ 29-04-2024]
పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కల్యాణ్ను ఎదుర్కొనేందుకు అధికార వైకాపా చేయని కుటిల ప్రయత్నాలు లేవు. పోలింగ్కు పక్షం రోజుల ముందు నుంచే ఓటర్లను మచ్చిక చేసుకోడానికి నగదు ఎరవేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం
-
సొంతగడ్డపై చెలరేగిన కోల్కతా.. దిల్లీపై ఘన విజయం
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM