రసవత్తరంగా చీరాల రాజకీయం
జిల్లాలోని చీరాల రాజకీయం రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఇక్కడి నుంచి తెదేపా-జనసేన-భాజపా ఆధ్వర్యంలోని కూటమి తరఫున ఎం.ఎం.కొండయ్య, వైకాపా నుంచి కరణం వెంకటేశ్ను ఆ పార్టీలు అభ్యర్థులుగా ప్రకటించాయి.
కాంగ్రెస్లో చేరతానన్న ఆమంచి
త్రిముఖ పోటీ ఉండే అవకాశం
ఈనాడు, బాపట్ల: జిల్లాలోని చీరాల రాజకీయం రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఇక్కడి నుంచి తెదేపా-జనసేన-భాజపా ఆధ్వర్యంలోని కూటమి తరఫున ఎం.ఎం.కొండయ్య, వైకాపా నుంచి కరణం వెంకటేశ్ను ఆ పార్టీలు అభ్యర్థులుగా ప్రకటించాయి. దీంతో వారిద్దరూ గత కొద్ది రోజుల నుంచి ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు వీరిద్దరి మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని భావించారు. కానీ చీరాల వైకాపా అభ్యర్థిత్వం దక్కకపోవటంతో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు. మంగళవారం ఆయన కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల బరిలో నిలవాలని కొంతకాలం నుంచి కృష్ణమోహన్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వైకాపాలోనే ఉంటూ ఆయన చీరాల అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతూ వచ్చారు. అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కరణం బలరాం కృష్ణమూర్తి ఉన్నారు. గత ఎన్నికల్లో ఆ స్థానం నుంచి ఆయన తెదేపా తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం వైకాపాలో చేరి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. దీంతో వైకాపా అధిష్ఠానం ఆయనకు బదులు తనయుడు వెంకటేశ్కు అవకాశం కల్పించింది.
ఆ పార్టీ తరఫున పోటీ..
టిక్కెట్ దక్కక ఆమంచి వైకాపాపై అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఆయన స్వగ్రామం పందిళ్లపల్లిలో కార్యకర్తలు, అభిమానుల సమావేశంలో తాను త్వరలో పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల సమక్షంలో కాంగ్రెస్లో చేరనున్నట్లు స్పష్టత ఇచ్చారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది. చీరాల సీటు మాత్రం పెండింగ్ పెట్టింది. ప్రస్తుతం చీరాల టికెట్ ఆమంచికే వస్తుందనే ఆశతో ఆయన అభిమానులు ఉన్నారు. మంగళవారం జరిగిన అభిమానులు, సన్నిహితుల సమావేశంలో కూడా పలువురు కచ్చితంగా కాంగ్రెస్ నుంచి ఆమంచి పోటీ చేస్తారని తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ నుంచి ఆమంచి రంగంలోకి దిగితే త్రిముఖ పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో కూడా ఆయన ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మరోసారి గెలిచారు. మొత్తంగా చీరాలతో ఆయనకు గట్టి అనుబంధమే ఉంది. గత కొద్దిరోజులుగా చీరాల ప్రజలు తనను ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుతున్నారని ఆమంచి చెబుతున్నారు. ఐదేళ్ల అనంతరం చీరాల రాజకీయాల్లోకి ఆయన ప్రత్యక్షంగా రానుండటంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేసే ముందు ఆలోచించండి: నారా బ్రాహ్మణి
[ 29-04-2024]
స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని నారా లోకేశ్ సతీమణి బ్రాహ్మణి అన్నారు. -
ఒకే కారణంతో రెండుసార్లు సస్పెండ్ చేశారు.. క్యాట్లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ
[ 29-04-2024]
కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్లో ఏబీ వెంకటేశ్వరరావు కేసుపై విచారణ జరిగింది. -
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
[ 29-04-2024]
ఏపీ, తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
[ 29-04-2024]
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
భర్త మద్దతుగా మాట్లాడలేదని వివాహిత ఆత్మహత్య
[ 29-04-2024]
కుటుంబంలో చోటుచేసుకున్న చిన్న గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తాడికొండ మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన చుండ్రు జయశ్రీ, ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు గ్రామానికి చెందిన శివరామకృష్ణకు 10 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
ప్రశ్నిస్తే పగ.. స్వేచ్ఛకు సెగ
[ 29-04-2024]
ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడడానికీ వీల్లేదు. వారి అభిప్రాయాలను బహిరంగంగా పంచుకోవడాన్ని సహించరు. అయిదేళ్ల జగన్ పాలన అక్షరాలా ఇలాగే సాగింది. -
జగన్మోసకారి!
[ 29-04-2024]
బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ -
సమరానికి సైకిల్ యాత్రతో సంసిద్ధం
[ 29-04-2024]
ఎన్నికల సమరానికి సైకిల్ యాత్రతో సంసిద్ధమని గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థి గళ్లా మాధవి తెలిపారు. ‘ -
పదవిని అడ్డు పెట్టుకుని అక్రమ సంపాదన
[ 29-04-2024]
‘ఎమ్మెల్యే పదవి అడ్డుపెట్టుకుని ప్రకృతి సంపదను నాశనం చేసి ఏకంగా 700 ఎకరాల్లో గ్రావెల్ తవ్వి కిలారి రోశయ్య అక్రమ సంపాదన వెనకేసుకున్నారు. -
నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం సోమవారంతో ముగియనుంది. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు రిజిస్టర్ పార్టీలు, -
అర్ధరాత్రి దళిత మహిళల దుకాణాల కూల్చివేత
[ 29-04-2024]
పేద దళిత మహిళల దుకాణాలను శనివారం అర్ధరాత్రి కూలగొట్టించిన వైకాపా కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డిని అరెస్టు చేయాలని దళిత, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. -
‘అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి డిపాజిటర్లకు న్యాయం చేస్తాం’
[ 29-04-2024]
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి డిపాజిటర్లకు న్యాయం చేస్తామని యువనేత, మంగళగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. -
రూపు మారిన ఆస్తి దస్త్రం
[ 29-04-2024]
ఆస్తుల రిజిస్ట్రేషన్కు జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొన్నినెలల క్రితం ‘కార్డు 2.0 ప్రైమ్ విధానం తీసుకొచ్చి ఆందోళనకు గురిచేసింది. -
జగనన్నా.. ఉపాధి ఏదన్నా..?
[ 29-04-2024]
యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన అంశాల్లో సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చెప్పిన మాటలకు, క్షేత్ర స్థాయిలో పని తీరుకు ఏ మాత్రం పొంతన లేదన్న విషయం పారిశ్రామిక శిక్షణ సంస (ఐటీఐ)ల పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. -
డీఎస్సీ వేయలే.. ఒక్క టీచర్ ఉద్యోగమూ ఇవ్వలే!
[ 29-04-2024]
రాష్ట్రంలో 25 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మేం అధికారంలోకి రాగానే వాటన్నింటిని భర్తీ చేస్తాం. -
నా ఎస్సీలంటూనే.. నిలువునా మోసం
[ 29-04-2024]
ఎక్కడ మాట్లాడినా.. నా ఎస్సీలు.. నా ఎస్టీలు.. అంటూ ఎక్కడ లేని ప్రేమను మాటల్లో ఒలకబోసే జగన్.. వాస్తవంలోకి వచ్చేసరికి వారికి రిక్తహస్తాలే చూపారు. -
వారానికోసారే నీరు.. ఇదీ పాలన తీరు..
[ 29-04-2024]
గుంటూరు నగరపాలికలో విలీన గ్రామాలైన గోరంట్ల, రెడ్డిపాలెం, ప్రగతినగర్, మదర్థెరెసా నగర్లలో గుక్కెడు నీటి కోసం జనాలు నానా తంటాలు పడుతున్నారు. -
రూపు మారిన ఆస్తి దస్త్రం
[ 29-04-2024]
ఆస్తుల రిజిస్ట్రేషన్కు జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొన్నినెలల క్రితం ‘కార్డు 2.0 ప్రైమ్ విధానం తీసుకొచ్చి ఆందోళనకు గురిచేసింది. -
గుంటూరు మీదుగా రైళ్లు
[ 29-04-2024]
విజయవాడ- ఖాజీపేట మార్గంలో ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున పలు రైళ్లు గుంటూరు మీదుగా నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు