ఆసుపత్రుల్లో ఐసొలేషన్ ఖాళీ!
కరోనా మూడో దశలో గ్రేటర్తోపాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో నిత్యం 2 వేల మంది వైరస్ బారిన పడుతున్నా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఐసొలేషన్ కేంద్రాల్లో ఎవరూ చేరడం లేదు. ఒమిక్రాన్ వేరియంట్లో చాలామందిలో స్వల్ప లక్షణాలే ఉంటున్నాయి. ఒకట్రెండు రోజులపాటు జ్వరం, దగ్గు, గొంతులో గరగర, తలనొప్పి లాంటి లక్షణాలు వస్తున్నాయి.
ఈనాడు, హైదరాబాద్
అమీర్పేటలోని నేచర్క్యూర్ ఆసుపత్రి
కరోనా మూడో దశలో గ్రేటర్తోపాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో నిత్యం 2 వేల మంది వైరస్ బారిన పడుతున్నా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఐసొలేషన్ కేంద్రాల్లో ఎవరూ చేరడం లేదు. ఒమిక్రాన్ వేరియంట్లో చాలామందిలో స్వల్ప లక్షణాలే ఉంటున్నాయి. ఒకట్రెండు రోజులపాటు జ్వరం, దగ్గు, గొంతులో గరగర, తలనొప్పి లాంటి లక్షణాలు వస్తున్నాయి. మందుల వాడితే తగ్గిపోతున్నాయి. దీంతో చాలామందికి ఆసుపత్రిలో చేరే అవసరమే ఉండటం లేదు.
సాధారణ ఓపీ సేవలు షురూ
తొలి, రెండో విడతలో ప్రభుత్వ ఐసొలేషన్ కేంద్రాలు రోగులతో కిటకిటలాడాయి. మూడో దశలో పరిస్థితి తీవ్రత తగ్గిపోయింది. ప్రస్తుతం ప్రభుత్వ ఐసొలేషన్ కేంద్రాల్లో చేరే రోగులే లేరు. తాజాగా అమీర్పేటలోని నేచర్క్యూర్ ఆసుపత్రిలో 100 ఐసొలేషన్ పడకలను సిద్ధం చేశారు. ఎర్రగడ్డలోని ఆయుర్వేద ఆసుపత్రిలోనూ ఏర్పాట్లు చేశారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో విరమించుకున్నారు. ప్రస్తుతం సాధారణ ఓపీ ప్రారంభించారు.
ఉస్మానియా కొవిడ్ బాధితులు ‘కింగ్కోఠి’కి..
నారాయణగూడ: ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో రోజురోజుకూ కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అక్కడే రోగులను చేర్చుకొని చికిత్స అందించాలంటే ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ సాధ్యం కాదు. దీంతో ఇక్కడ చికిత్స పొందుతున్నవారికి, శస్త్రచికిత్సలు చేయించుకున్నవారికి కొవిడ్ నిర్ధారణ అయితే.. వారిని కొవిడ్ చికిత్స కేంద్రంగా ఇప్పటికే గుర్తింపు పొందిన వైద్య విధాన పరిషత్(కింగ్కోఠి) జిల్లా ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించారు. నాలుగైదు రోజులుగా కేసులు పంపిస్తూనే ఉన్నారు. దీన్ని నిరంతరం పర్యవేక్షించడానికి ఉస్మానియా జనరల్ ఆసుపత్రి సీఏఎస్-ఆర్ఎంఓ డాక్టర్ రాజ్కుమార్ను నోడల్ అధికారి, సమన్వయకర్తగా నియమిస్తూ గురువారం ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ ఉత్తర్వులు జారీ చేశారు.
మూడు షిఫ్టుల్లో వైద్యులు..
ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించిన సీనియర్ రెసిడెంట్స్(ఎస్ఆర్) డాక్టర్లు మూడు షిఫ్ట్లుగా కింగ్కోఠి ఆసుపత్రిలో పని చేస్తారు. అన్ని విభాగాల వైద్యులు ఉదయం 9 నుంచి 3 వరకు, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 వరకు, రాత్రి 9 నుంచి ఉదయం వరకు ఇలా నిరంతరం 24 గంటల పాటు అందుబాటులో ఉంటారు. జనరల్ మెడిసిన్తో పాటు ఆర్థో, అనస్థీషియా, ఇతర విభాగాల వైద్యులు, పీజీలు కూడా విధుల్లో ఉంటారు. వీరికి కింగ్కోఠి ఆసుపత్రి వైద్యులు, స్టాఫ్నర్సు, సిబ్బంది సహకారాలు అందిస్తారు. ఉస్మానియాలో ఎవరికైనా పాజిటివ్ నిర్ధారణ అయితే వారిని 108 అంబులెన్స్లో కింగ్కోఠి ఆసుపత్రికి పంపించే బాధ్యతను అక్కడి ఆర్ఎంఓకు అప్పగించారు.
అదే వరుస..
నగరంలో జ్వరాలు, దగ్గు లక్షణాలతో లక్షలాది మంది బాధపడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత పరీక్ష కేంద్రాల వద్ద అనుమానితులు ఉదయం నుంచే బారులు తీరుతున్నారు. పీహెచ్సీల్లో నిత్యం 100-150 మందికి, ఏరియా ఆసుపత్రుల్లో 400 మందికి పరీక్షలు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై భారాస ఫిర్యాదు.. 48గంటల్లో వివరణ ఇవ్వాలన్న ఈసీ
[ 10-05-2024]
భారాస అధినేత కేసీఆర్ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివరణ కోరారు. -
జూన్ 4 తర్వాత వారంతా పారిపోక తప్పదు: మోదీ
[ 10-05-2024]
తెలంగాణకు ఉజ్వల భవిష్యత్ ఇచ్చేందుకు భాజపా కట్టుబడి ఉందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. -
భాజపా పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది: ఉత్తమ్
[ 10-05-2024]
గత పదేళ్లలో ఎంపీలకు నిరసన తెలిపే హక్కు కూడా లేదని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. పార్లమెంట్లో విపక్ష ఎంపీలు మాట్లాడితే వెంటనే సస్పెండ్ చేశారని దుయ్యబట్టారు. -
ఓటేసేందుకు బయల్దేరిన నగరవాసులు.. బస్సులు, రైళ్లు కిటకిట
[ 10-05-2024]
ఏపీలో ఈనెల 13న శాసనసభ, లోక్సభ ఎన్నికలు ఉండటంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్లో నివసించే ఏపీ వాసులంతా తమ స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్రావు అరెస్టుకు వారెంట్ జారీ
[ 10-05-2024]
తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘ఫోన్ ట్యాపింగ్ కేసు’లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఎస్బీ మాజీ చీఫ్ ప్రభాకర్రావును అరెస్టు చేసేందుకు నాంపల్లి కోర్టు వారెంట్ జారీ చేసింది. -
ఈత కొలనులో మునిగి చిన్నారి మృతి
[ 10-05-2024]
ఈత కొలనులో మునిగి చిన్నారి మృతి చెందింది. శుక్రవారం మొయినాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకొంది. -
వ్యభిచారం చేయడానికి వచ్చావా? పోలీసులకు పట్టిస్తాం
[ 10-05-2024]
డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన యువతిని కలిసిన వ్యక్తిని దుండగులు భయపెట్టి రూ.60వేలతో పరారైన ఘటన ఫిల్మ్నగర్ ఠాణా పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... -
మల్కాజిగిరి.. విలక్షణమే ప్రతిసారీ
[ 10-05-2024]
అతిపెద్ద లోక్సభ నియోజకవర్గమైన మల్కాజిగిరిలో ప్రజల తీర్పు ప్రతిసారీ విలక్షణంగానే ఉంటోంది. 2009లో ఏర్పాటైన ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో 31,50,303 మంది ఓటర్లు ఉన్నారు. -
జనం పోటెత్తి.. జాతర హోరెత్తి
[ 10-05-2024]
కాంగ్రెస్ కార్యకర్తల కేరింతలు.. నాయకుల హర్షాతిరేకాల నడుమ సరూర్నగర్ స్టేడియంలో గురువారం రాత్రి ఆ పార్టీ నిర్వహించిన జన జాతర సభ విజయవంతమైంది. -
కమలానికి అండగా.. ప్రచారంలో భిన్నంగా
[ 10-05-2024]
రాజధాని పరిధిలో నాలుగు లోక్సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా భాజపా ప్రణాళికను అమలు చేస్తోంది. ముఖ్యంగా సంఘ్ పరివార్ ఇందులో కీలక భూమిక పోషిస్తోంది. ఈ పరివారంలోని సభ్యులు వినూత్న ప్రచారం చేస్తున్నారు. -
ఓటేద్దాం.. ఛాలెంజ్ చేద్దాం
[ 10-05-2024]
ఓటింగ్శాతం పెంచేందుకు కాలనీ సంక్షేమ సంఘాలు ఛాలెంజ్ విసురుతున్నాయి. ‘మీరు ఓటేయండి...మీకు తెలిసిన పది మందికి ఓటేయాలని ఛాలెంజ్ విసరండి’ అంటూ కొత్త నినాదాన్ని తెరపైకి తీసుకొస్తున్నాయి. -
లోక్సభ బరి.. 17 మంది మహిళల గురి
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల్లో నాలుగు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల నుంచి ఇద్దరు మహిళలు మాత్రమే పోటీ చేస్తున్నారు. మిగిలిన వారు రాష్ట్రంలో పెద్దగా ఉనికి లేని పార్టీలు, స్వతంత్రులుగా బరిలో ఉన్నారు. -
మోదీ ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదు: కేటీఆర్
[ 10-05-2024]
తెలంగాణ కోసం తెగించి కోట్లాడేది భారాసేనని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. గురువారం అల్వాల్లో ఏర్పాటు చేసిన యువ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. -
లబ్ధిదారులే గెలిపిస్తారు
[ 10-05-2024]
‘హైదరాబాద్ లోక్సభ స్థానంలో ఓటర్లు అభివృద్ధిని కాంక్షిస్తున్నారు. 40 ఏళ్లుగా ఇక్కడ గెలుస్తున్నామని చెప్పుకుంటున్న నేతలు మౌలిక సదుపాయాల కల్పనను విస్మరించారు. మతం పేరుతో రెచ్చగొట్టి ఓట్లు అడుగుతారే తప్ప.. -
కక్కుర్తి పడొద్దు.. భోజనాలు బాగుండాలి
[ 10-05-2024]
ఎన్నికల నిర్వహణలోని అధికారులు, సిబ్బందికి నాసిరకం భోజనం సరఫరా అవుతోంది. అన్నం, కూరలు సరిగా ఉండట్లేదంటూ కొన్ని రోజులుగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. -
నాడు సందడిగా.. నేడు సైలెంట్గా
[ 10-05-2024]
ఎన్నికల ప్రచారమంటేనే హంగూ, ఆర్భాటం అధికం.. మైకుల గోల, కార్యకర్తల హంగామా మామూలుగా ఉండదు..అసెంబ్లీ ఎన్నికలు జరిగి 5 నెలలే అయినా లోక్సభ ఎన్నికల్లో ఏమాత్రం ఆ సందడి కనిపించడం లేదు. -
మోదీతోనే దేశానికి ప్రత్యేక గుర్తింపు: కొండా
[ 10-05-2024]
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పనితీరుతోనే ప్రపంచంలోనే దేశానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
హామీలు అమలు చేస్తాం: కాంగ్రెస్
[ 10-05-2024]
చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్రెడ్డిని గెలిపించాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ఓటర్లను కోరారు. పట్టణంలోని 2,3,4,5,6,25 వార్డులలో గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు. -
మేం ఓటేస్తాం.. మరి మీరు..
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరకొచ్చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని మేధావులు, ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని వృద్ధులు, దివ్యాంగుల కోసం ఈసారి ఇంటి వద్దే ఓటింగ్ సౌకర్యాన్ని కల్పించారు. -
బీసీలు ఏకమై కాసానిని గెలిపించాలి
[ 10-05-2024]
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పదేళ్ల పాలన సుభిక్షంగా కొనసాగిందని, ఐదు మాసాల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అస్తవ్యస్థంగా మారిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితారెడ్డి అన్నారు. -
కొత్త వారికి కలిసొస్తుందా..!
[ 10-05-2024]
చేవెళ్ల లోక్సభ నియోజక వర్గానికి ఇప్పటి వరకు జరిగిన రెండు ఎన్నికల్లోనూ భారాస నుంచి కొత్తగా పోటీచేసిన అభ్యర్థులే విజయం సాధించారు. -
పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల దృష్ట్యా రాజధానిలో ఎన్నికల ప్రచారం..ఎక్కువ మంది గుమిగూడడంపై ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు గురువారం వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేశారు. -
మహిళల అభ్యున్నతికి మోదీ ప్రాధాన్యం
[ 10-05-2024]
మహిళల స్వయంసమృద్ధి, ఆత్మగౌరవానికి ప్రధాని మోదీ అధిక ప్రాధాన్యమిస్తున్నారని భాజపా మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు, తమిళనాడు దక్షిణ కోయంబత్తూరు ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ అన్నారు. -
‘యాదాద్రి కట్టినా.. రాజకీయాలకు వాడుకోలేదు’
[ 10-05-2024]
దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. గురువారం తెల్లాపూర్ ఎంఐజీ కాలనీలో మెదక్ భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ప్రచార సభ నిర్వహించారు. -
బాచుపల్లి.. ఘటనలో ఐదుగురి అరెస్టు
[ 10-05-2024]
బాచుపల్లి రేణుకాఎల్లమ్మ కాలనీలో గోడ కూలిన ఘటనపై నమోదైన కేసులో ఐదుగురిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అర్జన్ నిర్మాణ సంస్థకు చెందిన రైజ్ ప్రాజెక్టు వద్ద రక్షణ గోడ కూలడంతో ఏడుగురు వలస కార్మికులు దుర్మరణం -
ప్రధాని రాక.. ట్రాఫిక్ ఆంక్షలు నేడు
[ 10-05-2024]
ఎల్బీ స్టేడియంలో శుక్రవారం భాజపా బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సా.4 గంటల నుంచి రాత్రి 8 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. -
నన్నొదిలేసి వెళ్లిపోతావా బిడ్డా..
[ 10-05-2024]
షాపింగ్కని తల్లిని తీసుకొచ్చిన కుమారుడు వదిలేసి పలాయనం చిత్తగించిన ఘటన కేపీహెచ్బీ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఎస్హెచ్వో వెంకటేశ్వరరావు వివరాల ప్రకారం.. -
నరేంద్రమోదీ నాయకత్వానికి అండగా నిలవాలి: కిషన్రెడ్డి
[ 10-05-2024]
భారత్ కీర్తిప్రతిష్ఠలను ప్రపంచానికి చాటిచెప్పిన నరేంద్రమోదీ నాయకత్వానికి ఈ దఫా ఎన్నికల్లోనూ ప్రజలు అండగా నిలవాలని కేంద్ర మంత్రి, భాజపా సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్రెడ్డి కోరారు. -
కాంగ్రెస్ గ్యారంటీలను ప్రజలు నమ్మరు: కొండా
[ 10-05-2024]
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారంటీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని భాజపా చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాత్రి చేవెళ్ల పట్టణ కేంద్రంలో రోడ్షో నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
తల్లితో కలిసి పిఠాపురానికి రామ్ చరణ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
టాటా మోటార్స్ రయ్రయ్.. లాభం మూడింతలు
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు
-
Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం.. కారణమిదే!