logo

Hyderabad News: నగరంలో మరో రెండు రోజులు గిజగిజే

నగరంలో చలి తీవ్రత కొనసాగుతోంది. జీహెచ్‌ఎంసీలోని 15 సర్కిళ్లలో సోమవారం 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated : 01 Feb 2022 07:13 IST

 

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: నగరంలో చలి తీవ్రత కొనసాగుతోంది. జీహెచ్‌ఎంసీలోని 15 సర్కిళ్లలో సోమవారం 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా శేరిలింగంపల్లిలో 8.8 డిగ్రీలు, రాజేంద్రనగర్‌లో 9.9 డిగ్రీలు రికార్డయింది. మిగిలిన 13 సర్కిళ్లలో 10-15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. రానున్న రెండ్రోజులూ ఇదే పరిస్థితి ఉండనుంది. మూడో రోజు నుంచి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగి చలి తగ్గుతుందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు