logo

Hyderabad News: కుమార్తె మాట వినడం లేదని తల్లి ఆత్మహత్య

కుమార్తె.. చెప్పిన మాట వినడం లేదని తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. నారాయణగూడ సీఐ భూపతి గట్టుమల్లు తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్‌గూడ

Published : 22 Apr 2022 08:14 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: కుమార్తె.. చెప్పిన మాట వినడం లేదని తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. నారాయణగూడ సీఐ భూపతి గట్టుమల్లు తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్‌గూడ ముత్యాలబాగ్‌, ఆర్టీసీ గెస్ట్‌ హౌస్‌ సమీపంలో నివసిస్తున్న దంపతుల కుమార్తె డిగ్రీ చదువుతోంది. కొన్నాళ్లుగా తల్లిదండ్రులు చెప్పిన మాట వినడం లేదు. చదువు పక్కనపెట్టి స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తోందని తెలిసి తల్లి(38) చాలా సార్లు మందలించింది. అయినా వినిపించుకోవడం లేదని మనస్తాపం చెందిన ఆమె ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు