తొలిరోజు తప్పించుకున్నా.. రెండో రోజు చిక్కాడు
నారాయణరెడ్డి హత్య కేసులో పక్కాగా రెక్కీ
కేపీహెచ్బీకాలనీ, న్యూస్టుడే: గతనెల 27న హత్యకు గురైన సాఫ్ట్వేర్ ఇంజినీర్ నారాయణరెడ్డి హత్య కేసులో నిందితులు చాలారోజులుగా రెక్కీ నిర్వహించి పథకాన్ని పక్కాగా అమలు చేశారు. హతుడికి నిందితులు తెలిసినవారే కావడంతో అతను పూర్తిగా నమ్మడం ప్రణాళిక అమలు సునాయాసమైంది. అతన్ని హత్య చేసేందుకు ఒకరోజు తీసుకెళ్లినా పథకం పారలేదు. ఆరోజు తప్పించుకున్నా రెండోరోజు నిందితులు సఫలీకృతులయ్యారు. వివరాలివీ.. తన కూతురు రవళిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని మామ నారాయణరెడ్ఢి. తమ బంధువు, దిల్సుఖ్నగర్లో ఐస్క్రీం పార్లర్లో పనిచేసే శ్రీనివాసరెడ్డితో తన ప్రణాళిక గురించి వివరించాడు. అడ్డు తొలగించేందుకు రూ.4.50 లక్షలతో బేరం కుదిరింది.
గతనెల 26న.. రాత్రి శ్రీనివాస్రెడ్డి అతని మిత్రులతో నారాయణరెడ్డి గదికి వెళ్లి విందు చేసుకుందామని తీసుకెళ్లాడు. శ్రీనివాసరెడ్డి తనకూ పరిచయం ఉండటంతో నారాయణరెడ్డి వారితో వెళ్లాడు. పార్టీ మధ్యలో ఉండగా నారాయణరెడ్ఢి. తన గదిలో ఉన్న బావకు ఫోన్ చేసి తనను పికప్ చేసుకోవాలని కోరాడు. దీంతో కంగు తిన్న శ్రీనివాస్రెడ్ఢి. పథకాన్ని అమలు చేస్తే దొరికిపోతామని భావించి తామే గది వద్ద దింపుతామంటూ నారాయణరెడ్డితో చెప్పారు. అన్నట్లుగానే అతన్ని ఆరోజు రాత్రి దింపేసి వెళ్లిపోయారు.
మరుసటి రోజు.. సాయంత్రం 6.30 గంటల సమయంలో శ్రీనివాస్రెడ్డి తన మిత్రులతో కలిసి నారాయణరెడ్డి గదికి వెళ్లి కారులో ఎక్కించుకుని మళ్లీ విందుకంటూ తీసుకెళ్లారు. అయితే కొంతసేపటికి గది నుంచి మిత్రులు ఫోన్ చేయడంతో ముందురోజు వచ్చిన శ్రీనివాస్రెడ్డి, అతని మిత్రులతోనే ఉన్నానని చెప్పిన నారాయణరెడ్డి తర్వాత అందుబాటులో లేకుండా పోయాడు. తర్వాత నారాయణరెడ్డిని మట్టుబెట్టడం, జిన్నారం అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని దహనం చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. నారాయణరెడ్డి గది వద్ధ. జిన్నారం అటవీ ప్రాంతంలో పగడ్బందీగా రెక్కీ నిర్వహించకుంటే ఇలా పక్కాగా చేయగలిగేవారు కాదని పోలీసులు భావిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Andhra news: కుర్చీ ఆమెది.. పెత్తనం ‘ఆయన’ది
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09/08/2022)
-
World News
Zaporizhzhia: ఆ ప్లాంట్ పరిసరాలను సైనికరహిత ప్రాంతంగా ప్రకటించాలి: ఉక్రెయిన్
-
India News
Internet shutdowns: ఇంటర్నెట్ సేవల నిలిపివేతలు భారత్లోనే ఎక్కువ.. కాంగ్రెస్ ఎంపీ
-
Sports News
Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్ప్రీత్ కౌర్
-
Crime News
Crime news: వాటర్ బాటిల్ కోసం వివాదం.. వ్యక్తిని రైళ్లోనుంచి తోసేసిన సిబ్బంది!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra news: నడిరోడ్డుపై వెంటాడి కానిస్టేబుల్ హత్య
- Sita Ramam: బాలీవుడ్, టాలీవుడ్లో నాకు ఆ పరిస్థితే ఎదురైంది: రష్మిక
- Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్ప్రీత్ కౌర్
- దంపతుల మాయాజాలం.. తక్కువ ధరకే విమానం టిక్కెట్లు, ఐఫోన్లంటూ..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09/08/2022)
- Asia Cup 2022: ఆసియా కప్ టోర్నీకి బుమ్రా దూరం.. టీమ్ఇండియా జట్టు ఇదే!
- Aaditya Thackeray: ఆ ఇద్దరిలో నిజమైన ముఖ్యమంత్రి ఎవరు?.. ఆదిత్య ఠాక్రే
- Crime news: వాటర్ బాటిల్ కోసం వివాదం.. వ్యక్తిని రైళ్లోనుంచి తోసేసిన సిబ్బంది!
- CWG 2022: కొవిడ్ అని తేలినా ఫైనల్ మ్యాచ్ ఆడిన ఆసీస్ స్టార్..ఎలా!
- Solar Cycle: సూర్యుడి ఉగ్రరూపం! అసలేం జరుగుతోంది..?