అభివృద్ధి గమనం..జూన్ గమ్యం
రాజధానిలో అభివృద్ధిని పరుగులు పెట్టించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది జులై నాటికి ముఖ్యమైన పనులన్నింటినీ పూర్తి చేయాలని గడువు విధించింది.
నగరంలో కీలక పనుల పూర్తికి ప్రణాళిక
రాజధానిలో అభివృద్ధిని పరుగులు పెట్టించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది జులై నాటికి ముఖ్యమైన పనులన్నింటినీ పూర్తి చేయాలని గడువు విధించింది. ఈ క్రమంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఎంఎంటీఎస్ రెండోదశ ప్రాజెక్టును రెండు నెలల్లో ప్రారంభించబోతున్నారు. మార్చి తర్వాత నుంచి దాదాపు 75 వేల రెండు పడకల గదుల ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికల ఏడాదిగా సర్కార్ భావిస్తోంది. ఇందులో భాగంగానే మహానగరం అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిసారించింది.
నగరంలో రూ.వేల కోట్ల విలువైన పనులు కొనసాగుతున్నాయి. ఏడాదిగా కొన్ని పనులు పూర్తి చేయడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. మరికొన్నింటికి నిధుల కొరత ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ నగర అభివృద్ధి పనులపై నెలరోజులుగా వరుస సమీక్షలు చేస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతి పనికి కార్యాచరణ రూపొందించి నిర్ణీత గడువు విధించారు. నిధుల విడుదలకూ చర్యలు తీసుకుంటున్నారు.
మార్చి నుంచి ఇళ్ల పంపిణీ
అయిదేళ్ల కిందటే లక్ష రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాన్ని సర్కార్ మొదలుపెట్టింది. ఇప్పటి వరకు రూ.5,500 కోట్లు ఖర్చు చేయగా ఇంకా రూ.3,457 కోట్లు అవసరం. ఇప్పటికే పదివేలకు పైగా ఇళ్లను లబ్ధిదారులకు అందించగా ప్రస్తుతం 75 వేల ఇళ్ల నిర్మాణం తుది దశలో ఉంది. వెంటనే పూర్తి చేసి మార్చి నుంచి పంపిణీ చేయాలన్న నిర్ణయానికి వచ్చి లబ్ధిదారుల ఎంపిక మొదలుపెట్టింది.
ఎస్ఆర్డీపీ పనులపై దృష్టిట్రాఫిక్ ఇబ్బందులు పరిష్కరించేందుకు చేపట్టిన ఎస్ఆర్డీపీ ప్రాజెక్టు మొదటి దశ పనులన్నింటిని వచ్చే ఆగస్టు నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు. మొత్తం ప్రాజెక్టు విలువ రూ.6,763 కోట్లు కాగా ఇందులో రూ.3,854 కోట్ల విలువైన పనులను పూర్తి చేయాల్సి ఉంది. ప్రాధాన్య క్రమంలో రెండో దశ పనులు వచ్చే జూన్ నుంచి మొదలుపెట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఎంఎంటీఎస్ రెండో దశ
ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టు మరో రెండు నెలల్లో ప్రారంభం కాబోతోంది. 95 కిలోమీటర్ల పొడవున రూ.816 కోట్లతో 2014లో ఈ ప్రాజెక్టును మొదలు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వకపోడంతో ప్రాజెక్టు పనులు పూర్తయినా రైళ్ల పరుగు మొదలు కాలేదు. రూ.200 కోట్లు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసినట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించడంతో మొదలుపెట్టడానికి రైల్వే అధికారులు సిద్ధమవుతున్నారు.
మూసీ మీద వంతెనలు
మూసీపై మొదటి దశ కింద 15 చోట్ల రూ.595 కోట్లతో వంతెనలు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రెండు రోజుల కిందట దీనిపై సమీక్షించిన మంత్రి కేటీఆర్ పారిస్లో ఉన్న తరహాలో వారధులు నిర్మించాలని ఆదేశించారు.
వచ్చే ఏడాది వరద ఉండకూడదంతే
రాజధానిలో వరద సమస్య అధిగమించేందుకు 56 నాలాల పనులను రూ.983.46 కోట్లతో చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఏడాదిగా ఈ పనులన్నీ నత్తనడకగా నడుస్తున్నాయి. ఇటీవల మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు వచ్చే వేసవి ముగిసే నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి పనికి గడువు విధించారు. నిర్లక్ష్యంగా ఉండే అధికారులను అక్కడి నుంచి తప్పించబోతున్నారు.
మెట్రో విస్తరణకు మార్గం సుగమం
రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణకు సర్కార్ పచ్చజెండా ఊపింది. రూ.6,500 కోట్లతో ఈ పనులు చేపట్టడానికి సిద్ధమైంది. దీంతోపాటు పాతబస్తీకి కూడా మెట్రో అడుగులు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగానే పదవులు: కేసీ వేణుగోపాల్
[ 07-05-2024]
ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగానే పదవులు ఉంటాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. -
సర్వం తానై.. సమరానికి సై
[ 07-05-2024]
రాజధాని పరిధిలో మూడు లోక్సభ స్థానాలను దక్కించుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. మహానగరంలో కీలకమైన కాంగ్రెస్ నేతలతో వారం రోజులుగా ఆయన మాట్లాడుతున్నారు. -
హైదరాబాద్లో ఆ ఏడు ప్రాంతాలు హీట్ ఐలాండ్లు
[ 07-05-2024]
చెట్ల నరికివేత, పట్టణీకరణతో నగరం కాంక్రీటు వనంలా మారి నిప్పు కుంపటిని తలపిస్తోందని హైదరాబాద్ అర్బన్ ల్యాబ్ సంస్థ తాజాగా విడుదల చేసిన పరిశోధన నివేదిక స్పష్టం చేస్తోంది. -
ఒక క్లిక్తో.. పోలింగ్ కేంద్రం ప్రత్యక్షం
[ 07-05-2024]
‘పోల్ క్యూ రూట్’ యాప్ను ఈసారి మరింత మెరుగ్గా అందుబాటులోకి తెస్తామని జీహెచ్ఎంసీ చెబుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ యాప్ను దాదాపు 1.5 లక్షల మంది ఉపయోగించారు. -
ప్రశాంత ఎన్నికలకు సత్వర చర్యలు
[ 07-05-2024]
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. -
నిరంత విద్యుత్తుకు.. కమాండ్ కంట్రల్ సెంటర్
[ 07-05-2024]
నగరంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది. అగ్నిమాపక కమాండ్ కంట్రోల్ సెంటర్ సైతం సిద్ధమవుతోంది. -
ఈవీఎంలు సిద్ధం.. స్ట్రాంగ్ రూముల్లో భద్రం
[ 07-05-2024]
ఎన్నికలకు ఈవీఎంలు సిద్ధమయ్యాయి. రెండ్రోజుల క్రితం చేపట్టిన కమిషనింగ్ ప్రక్రియ దాదాపు పూర్తయిందని, మంగళవారంతో అన్ని స్ట్రాంగ్ రూముల్లో ముగుస్తుందని ఇంజినీర్లు సోమవారం వెల్లడించారు. -
చేయి చేయి కలిపి.. చెయ్యెత్తి కదిలి
[ 07-05-2024]
అడుగడుగున హారతులు.. బతుకమ్మ ఆటలు.. లంబాడీ నృత్యాలు.. సీఎం రేవంత్రెడ్డి రోడ్షోలో ఎటుచూసినా జనసందోహమే. సోమవారం రాత్రి కంటోన్మెంట్, అంబర్పేట, ఉప్పల్ పరిధిలో ఆయన రోడ్షోలు, కార్నర్ మీటింగ్లు నిర్వహించారు. -
మలక్పేట శ్రేణులకు దక్కని లోక్సభ
[ 07-05-2024]
మలక్పేట వాసులకు లోక్సభ స్థానం నుంచి ఒక్కసారి కూడా విజయం దక్కలేదు. మలక్పేట నియోజకవర్గం 2009 వరకు నల్గొండ లోక్సభ పరిధిలో ఉండేది. అనంతరం హైదరాబాద్ లోక్సభలోకి మారింది. -
ఐసీఎస్ఈ ఫలితాల్లో రమాదేవి పబ్లిక్ స్కూల్ ప్రభంజనం
[ 07-05-2024]
ఐసీఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో రమాదేవి పబ్లిక్ స్కూల్ ప్రభంజనం సృష్టించింది. సోమవారం వెలువడిన ఫలితాల్లో పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. వరుసగా 17వ ఏటా శత శాతం ఉత్తీర్ణతతో రికార్డు నెలకొల్పింది. -
అసెంబ్లీకి ఓటేసి.. లోక్సభకు ముఖం చాటేసి
[ 07-05-2024]
పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నిక ఏదైనా.. అటు దేశం.. ఇటు రాష్ట్రం, నియోజకవర్గం బాగుపడాలంటే మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంటుంది. రెండు ఎన్నికలకున్న ప్రాధాన్యం ఒకటే. -
ప్రియుడితో భర్తను హత్య చేయించిన భార్య
[ 07-05-2024]
ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన సంఘటన కడ్తాల్ ఠాణా పరిధిలోని మక్తమాదారంలో చోటు చేసుకుంది. ఈ ఘాతుకానికి పాల్పడిన ముగ్గురినీ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. -
ఆ నాలుగు పార్టీలు నా గెలుపును అడ్డుకోలేవు
[ 07-05-2024]
‘పాతబస్తీలో నివసిస్తున్న ముస్లింలకు తామే రక్షకులమంటూ మజ్లిస్ పార్టీ చెప్పుకుంటోంది. వాస్తవానికి ఇక్కడ వెనుకబాటుతనానికి వారే కారణం. ముస్లింల పేర్లు చెప్పుకొని పాతబస్తీలో భూ కబ్జాలు చేస్తున్నారు. చివరికి శ్మశానాలూ వదల్లేదు. -
గాంధీభవన్లో కాంగ్రెస్ నేతల పరస్పర దాడులు
[ 07-05-2024]
గాంధీభవన్లో కార్వాన్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పరస్పరం దాడి చేసుకున్నారు. సోమవారం పార్టీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మహ్మద్ వలీవుల్లా సమీర్ను నియోజకవర్గంలో ప్రచారానికి ఆహ్వానించేందుకు కార్వాన్ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఉస్మాన్బిన్ అల్హాద్రీ, ఇతర నాయకులు గాంధీభవన్కు వచ్చారు. -
మల్కాజిగిరికి ప్రత్యేక మ్యానిఫెస్టో
[ 07-05-2024]
‘మల్కాజిగిరిలో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలుస్తుంది. మహిళా ఓటర్లు నా వెనకే ఉన్నారు. మల్కాజిగిరి మినీ భారత్.. అన్ని ప్రాంతాల వారుంటున్నారు. -
కాసానిని ఆశీర్వదించండి: కేటీఆర్
[ 07-05-2024]
చేవెళ్ల లోక్సభ నియోజకవర్గానికి గత 20 ఏళ్లలో ఏ పార్టీ బీసీ అభ్యర్థిని నిలపలేదని, అలాంటిది భారాస అధినేత కేసీఆర్ 93 బీసీ కులాలను ఏకం చేసిన కాసాని జ్ఞానేశ్వర్ను బరిలో ఉంచారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
పాలమూరు... ప్రచార హోరు
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ‘మహబూబ్నగర్ (పాలమూరు)’ బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారంహోరెత్తిస్తున్నారు. గెలుపు తమదేనంటూ ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
ఓటు సద్వినియోగానికి సౌకర్యాల కల్పన
[ 07-05-2024]
జిల్లాలోని దివ్యాంగులకు (మూగ, చెవిటి, అంధ) లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవడానికి అవసరమైన సౌకర్యాలను కల్పించామని జిల్లా స్వీప్ నోడల్ అధికారి మహ్మద్ అబ్దుల్ సత్తార్ తెలిపారు. -
కేంద్రాలు దూరం.. సాయం అవసరం
[ 07-05-2024]
పార్లమెంట్ ఎన్నికల తేదీ (ఈనెల 13) దగ్గరకొచ్చేస్తోంది.అయితే జిల్లాలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద సదుపాయాల కల్పన ఇంకా కొలిక్కి రాలేదు. అసలే ఎండలు మండుతున్నాయి. -
మూడోసారీ మోదీయే ప్రధాని: కొండా
[ 07-05-2024]
ప్రధాని మోదీతోనే దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని, మూడోసారీ మోదీయే ప్రధాని అవుతారని చేవెళ్ల భాజపా ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగాలి
[ 07-05-2024]
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. -
అత్యధిక ఎంపీ స్థానాలు భాజపా కైవసం: గీతామూర్తి
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలను భాజపా కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యురాలు, మహిళా మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు గీతామూర్తి ధీమా వ్యక్తం చేశారు. -
మధ్యంతర దరఖాస్తులను పరిష్కరించకుండా తుదితీర్పు చెల్లదు: హైకోర్టు
[ 07-05-2024]
పైగా భూమి దస్తావేజుల రద్దుకు సంబంధించిన వివాదంలో ఇరుపక్షాలు సమర్పించిన ఆధారాలను, మధ్యంతర పిటిషన్లను పరిష్కరించకుండా కింది కోర్టు తుది తీర్పు వెలువరించడం చెల్లదంటూ హైకోర్టు పేర్కొంది. -
మహిళ మెడలోని గొలుసు లాక్కుని పరారీ
[ 07-05-2024]
మహిళ మెడలోని గొలుసును ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు లాక్కుని పరారయ్యారు. వీరిలో ఒకరు యువతి కావడం గమనార్హం. -
‘టెక్ మహీంద్ర’ సహకారంతో.. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ
[ 07-05-2024]
టెక్ మహీంద్ర ఫౌండేషన్ సహకారంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నిరుద్యోగ యువతీ, యువకులకు 4 నెలల పాటు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నట్లు క్యాడర్ సంస్థ ప్రతినిధి నాగరాజు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!