logo

కమనీయం ‘శివపార్వతుల కల్యాణం’

నాట్యగురువు రాజేశ్వరి సాయినాథ్‌ బృందం ప్రదర్శించిన ‘శివ పార్వతుల కల్యాణం’ నృత్య రూపకం ఆద్యంతం ఆకట్టుకుంది.

Published : 02 Apr 2023 03:12 IST

కళాకారిణిని సత్కరిస్తున్న   మంత్రులు నిరంజన్‌రెడ్డి, హరీశ్‌రావు, చిత్రంలో వరప్రసాద్‌రెడ్డి

రవీంద్రభార[తి: నాట్యగురువు రాజేశ్వరి సాయినాథ్‌ బృందం ప్రదర్శించిన ‘శివ పార్వతుల కల్యాణం’ నృత్య రూపకం ఆద్యంతం ఆకట్టుకుంది. శనివారం రాత్రి రవీంద్రభారతిలో జరిగిన ప్రదర్శనను రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి, కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి, పద్మశ్రీ నర్రా రవికుమార్‌ వీక్షించారు. శాంతా-వసంతా ట్రస్టు నిర్వాహకులు, శాంతా బయోటెక్‌ అధినేత కె.ఐ.వరప్రసాద్‌రెడ్డి దంపతులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని