Cyber Crime: కొండాకోనల్లో మొబైల్ కాల్ సెంటర్లు!
నిరుద్యోగం.. చాలీచాలని సంపాదనతో ఇబ్బంది పడుతున్న నగరవాసులు కొందరు ఆన్లైన్లో ఉద్యోగ ప్రకటన కనిపించగానే నమ్మేస్తున్నారు. రూ.లక్షల వేతనం తీసుకుంటున్న ఐటీ నిపుణులు సైతం అదనపు ఆదాయం కోసం ఆశపడుతున్నారు.
అంతర్రాష్ట్ర సైబర్ మాయగాళ్ల దందా
కొత్త ఎత్తులతో పోలీసులకు మస్కా
ఈనాడు, హైదరాబాద్: నిరుద్యోగం.. చాలీచాలని సంపాదనతో ఇబ్బంది పడుతున్న నగరవాసులు కొందరు ఆన్లైన్లో ఉద్యోగ ప్రకటన కనిపించగానే నమ్మేస్తున్నారు. రూ.లక్షల వేతనం తీసుకుంటున్న ఐటీ నిపుణులు సైతం అదనపు ఆదాయం కోసం ఆశపడుతున్నారు. ఇదే అనువుగా కేటుగాళ్లు (Cyber Crime) రెచ్చిపోతున్నారు. మారుమూల పల్లెల్లో కూర్చొని.. పార్ట్టైమ్ ఉద్యోగాలు, పెట్టుబడులు, బహుమతులు, విదేశీ సంబంధాల పేరిట ఉన్నత విద్యావంతులను బురిడీ కొట్టిస్తూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం, ఆయా రాష్ట్రాల పోలీసుల సహకారంతో సైబర్క్రైమ్ పోలీసులు.. మాయగాళ్ల ఆట కట్టిస్తుండటంతో కొత్త మార్గాలు ఎంచుకుంటున్నాయి. తమ ఆనవాళ్లు బయటపడకుండా.. చాకచక్యంగా తప్పించుకుంటున్నట్లు ఇటీవల సైబర్క్రైమ్ పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.
కారులో చక్కర్లు.. ఫోన్తో గారడీలు
రాజస్థాన్, గుజరాత్, హరియాణా, పశ్చిమబెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో వందలాది సైబర్ ముఠాలు ఉన్నాయి. గతంలో ఈ ముఠాలు నకిలీ కాల్సెంటర్లు ఏర్పాటు చేసి.. సేకరించిన డేటా ఆధారంగా ఫోన్లు చేస్తూ మోసాలకు పాల్పడేవారు. సెల్ఫోన్ సిగ్నళ్లు, అంతర్జాలం ఐపీ అడ్రస్ ఆధారంగా పోలీసులకు తమ ఆనవాళ్లు తెలుస్తున్నాయనే ఉద్దేశంతో వాటిని మూసివేశారు. కార్లు, డీసీఎంలను కొనుగోలు చేసి వాటినే ‘మొబైల్ కాల్సెంటర్లు’గా మార్చుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వేర్వేరు ప్రాంతాల్లో తిరుగుతూ ఫోన్లకు లింకులు పంపుతున్నారు. స్పందించిన వారితో కార్పొరేట్ సంస్థలు, కాల్సెంటర్ల నుంచి మాట్లాడుతున్నట్లు నమ్మించి.. అందినంత సొమ్ము ఖాతాల్లో జమ చేయించుకుంటున్నారు. బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టినా.. వివిధ ప్రాంతాల టవర్ లొకేషన్, ఐపీ అడ్రసులు పోలీసులు అయోమయానికి గురవుతున్నారు.
టెలీగ్రామ్ లింకులతోనే..
ఈ ఏడాది ఇప్పటి వరకూ నగర సైబర్క్రైమ్ పోలీసులు 3000 కేసులు నమోదు చేశారు. వీటిలో అధికశాతం పార్ట్టైమ్ కొలువులు, పెట్టుబడి మోసాలు ఉన్నాయి. విద్యుత్బిల్లులు, కస్టమర్కేర్ కేంద్రాలు, బహుమతులు వంటివి రెండో స్థానంలో నిలిచాయి. గతంలో మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపటం, ఫోన్ చేయటం ద్వారా మస్కా కొట్టేవారు. ప్రస్తుతం టెలీగ్రామ్ యాప్ వేదికగా మోసాలకు పాల్పడుతున్నారు. టెలిగ్రామ్ నిర్వాహకులకు నోటీసులిచ్చినా, సరైన స్పందన రావడం లేదని సమాచారం. గుర్తు తెలియని వ్యక్తుల ప్రకటనలకు స్పందించక పోవటమే ఉత్తమ మార్గమని సైబర్క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.
ఉదాహరణలివిగో..
టోలిచౌకిలో ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ జీతం ఏడాదికి రూ.20 లక్షలు. ప్రస్తుతం ఇంటి వద్ద నుంచే పని చేస్తుంది. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకునే ఉద్దేశంతో పార్ట్టైమ్ జాబ్ లింకు క్లిక్ చేసింది. కేవలం గంట సమయం కేటాయిస్తే, రోజూ రూ.2000.. ఎలా చూసినా నెలకు రూ.60 వేలు పక్కా అనుకొని... రూ.12 లక్షలు పోగొట్టుకుంది.
నారాయణగూడకు చెందిన ప్రైవేటు ఉద్యోగి. నిర్వాణ డిజిటల్ పేరుతో టెలీగ్రామ్ లింక్తో పెట్టుబడి పెడితే.. లాభాలంటూ మొదట రూ.10,000 కట్టించుకున్నారు. టాస్క్లు ఇస్తూ.. విజేతగా నిలిచారంటూ కొంత నగదు ఖాతాలో జమ చేసి నమ్మకం కలిగించారు. ఇంకా.. ఇంకా అంటూ రూ.5 లక్షలు కాజేసి టెలీగ్రామ్ ఖాతా బ్లాక్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
[ 28-04-2024]
హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. -
భువనేశ్వర్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
[ 28-04-2024]
తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఒడిశా రాజధాని భువనేశ్వర్లో పర్యటిస్తున్నారు. -
రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు
[ 28-04-2024]
రిజర్వేషన్ల అంశంపై ఆర్ఎస్ఎస్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ (Mohan Bhagwat) కీలక వ్యాఖ్యలు చేశారు. -
కాలేయానికి అధిక కొవ్వు ముప్పు.. వర్క్ ఫ్రం హోం తర్వాత పెరిగిన కేసులు
[ 28-04-2024]
నగరంలో కాలేయ కొవ్వు (ఫ్యాటీ లివర్) సమస్యతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. కొవిడ్ తర్వాత చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం పెట్టగా.. ఇప్పటికీ కొన్ని కొనసాగిస్తున్నాయి. -
అన్నకు నచ్చని తమ్ముడి పెళ్లి.. యువతి అమ్మమ్మ ఇంటికి నిప్పుపెట్టిన ప్రబుద్ధుడు
[ 28-04-2024]
వద్దని చెప్పినా వినకుండా తనకు నచ్చని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తమ్ముడిపై కోపం పెంచుకున్న అన్న.. తమ్ముడి భార్య అమ్మమ్మ ఇంటికి నిప్పంటించిన ఘటన నగరంలో ఐదో ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. -
ఒక్క ఫోటో .. నాలుగేళ్ల కష్టం
[ 28-04-2024]
ఈ చిత్రం చూశారా.. ఓయూ ఆర్ట్స్ కళాశాల అనుకుంటున్నారా.. అయితే మీరు పొరబడినట్లే. ఇది కైరోలోని ఈజిప్ట్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్. దీని ఆర్కిటెక్ట్ మొనేసర్ ఎర్నెస్ట్ జాస్పర్. -
తెలంగాణ బరిలో తమిళ పార్టీ
[ 28-04-2024]
తెలంగాణలో తొలిసారిగా ఓ తమిళపార్టీ లోక్సభ ఎన్నికల్లో పోటీచేస్తోంది. తమిళనాడు కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తున్న విడుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) పార్టీ తరఫున హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్సభ స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులుగా జె.పద్మజ, పగిడిపల్లి శ్యామ్లు నామినేషన్లు దాఖలు చేశారు. -
ఎండకు తాళలేం.. ఎన్నికల విధులకు వెళ్లలేం
[ 28-04-2024]
ఎన్నికల విధుల పట్ల కొందరు ఉద్యోగులు ఆసక్తి చూపట్లేదు. రకరకాల కారణాలు చెప్పి మినహాయింపు కోరుతున్నారు. నిత్యం సుమారు వంద నుంచి 200ల మంది ఉద్యోగులు లేఖలు ఇస్తుండటమే అందుకు నిదర్శనం. -
సాధించేందుకు పట్టు.. తెలిసిందే లోగుట్టు
[ 28-04-2024]
మొన్నటి వరకు ఆ ముగ్గురు నేతలు భారాసలో కీలకంగా ఉన్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్కు రాజకీయంగా సన్నిహితంగా మెలిగినవారే. ఇప్పుడు అదే నేతలు కాంగ్రెస్లో చేరి రాజధాని పరిధిలోని మూడు లోక్సభ స్థానాల్లో అభ్యర్థులుగా బరిలో నిలిచారు. -
నాలుగు స్థానాలు.. బరిలో 168 మంది
[ 28-04-2024]
హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి ఎంపీ స్థానాల్లో నామినేషన్ల పరిశీలన ముగిసింది. మల్కాజిగిరిలో ఏకంగా 114మంది నామపత్రాలు సమర్పించడంతో శుక్రవారం అర్ధరాత్రి వరకూ పరిశీలన కొనసాగింది. -
బెట్టింగ్ కోసం వృద్ధురాలిని హతమార్చిన యువకుడు
[ 28-04-2024]
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్కి పాల్పడిన యువకుడు.. వృద్ధురాలిని హతమార్చి పరారయ్యాడు. చివరికి చిక్కి కటకటాల పాలయ్యాడు. ఈ సంఘటన ఆదిభట్ల ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. -
గంజాయి తాగొచ్చి వేధిస్తున్నాడని తమ్ముడి హత్య
[ 28-04-2024]
మద్యం, గంజాయికి బానిసయ్యాడు. మత్తులో ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను వేధించడం, ఇంట్లోని డబ్బు, వస్తువులు తీసుకెళ్తున్న తమ్మున్ని అన్న హత్య చేశాడు. -
నాలా.. సాఫీగా సాగేలా
[ 28-04-2024]
నాలా పూడికతీత పనుల్లో జీహెచ్ఎంసీ వేగం పెంచింది. బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో గుత్తేదారులు పనులు ఆపేయగా.. కమిషనర్ రోనాల్డ్రాస్ భరోసా ఇవ్వడంతో నెలరోజులుగా పనులు ఊపందుకున్నాయి. -
ప్రత్యర్థుల లోపాలను ఎత్తిచూపుతూ..
[ 28-04-2024]
నగరంలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రచారం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. నామినేషన్ల దాఖలు పూర్తికావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు పూర్తిస్థాయిలో ప్రచారంపై దృష్టిపెట్టారు. -
యువ వాటరూ.. నీదే జోరు
[ 28-04-2024]
యువ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటే గెలుపు తథ్యమని భావిస్తున్న నాయకులు వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాల్లో దాదాపు సగం మంది ఓటర్లు 18 నుంచి 39 ఏళ్లలోపు వారే ఉండటంతో వీరిని తమవైపు తిప్పుకొంటే గెలుపు ఖాయమనే ధీమాలో నేతలున్నారు. -
అసత్య ప్రచారాలకు ‘మిత్ వర్సెస్ రియాలిటీ’తో చెక్
[ 28-04-2024]
అసత్య ప్రచారాలపై నియంత్రణ లేకుండా పోతోంది.. ఫలితంగా వాస్తవ సమాచారం దారి తప్పుతోంది. సామాజిక మాధ్యమాలు వేదికగా నిత్యం వివిధ అంశాలపై కోకొల్లలుగా వార్తలు, వదంతులు పుట్టుకొస్తున్నాయి. -
ఆలిన్లో అదుపులోకి అగ్నికీలలు
[ 28-04-2024]
ఆలిన్ ఫార్మా పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో మంటలు చల్లారక పోవడంతో భారీ నష్టం వాటిల్లింది. 24 గంటలు దాటినా మంటలు పూర్తిస్థాయిలో అదుపులోకి రాకపోవడంతో అటుగా ఉండే పరిశ్రమలు, కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. -
డార్మెటరీలో దోస్తీ.. చోరీలతో మస్తీ
[ 28-04-2024]
ఎంజీబీఎస్ వద్ద ఉన్న డార్మెటరీలో పరిచయమై సెల్ఫోన్, ద్విచక్రవాహనాలను దొంగలిస్తూ జల్సాలు చేస్తున్న ఇద్దరు నిందితులను నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. -
నగరవాసి.. నీటికి అల్లాడి
[ 28-04-2024]
వేసవికి భూగర్భ జలాలు అడుగంటడంతో పాటు, జలమండలి సరఫరా చేసే నీటి పరిమాణం సైతం తగ్గుతోంది. అవసరాలకు సరిపడా నీరు లభించక అల్లాడుతున్న జనాన్ని ప్రైవేటు ట్యాంకర్ల నిర్వాహకులు అందినకాడికి దోచుకుంటున్నారు. -
బామ్మర్దికి వీడియోకాల్.. ఆపై బలవన్మరణం
[ 28-04-2024]
బామ్మర్దికి వీడియోకాల్ చేసి ఓ వ్యక్తి ఉరి వేసుకున్న ఘటన శనివారం కీసర మండలం చీర్యాలలో జరిగింది. సీఐ వెంకటయ్య వివరాల ప్రకారం. బీబీనగర్ మండలం అన్నంపట్ల గ్రామానికి చెందిన పర్వతం మహేశ్యాదవ్(38)కు 12 ఏళ్ల క్రితం కీసర శివాజీ నగర్ కాలనీకి చెందిన భవానీతో వివాహమైంది. -
తుది జాబితాపై కసరత్తు పూర్తి
[ 28-04-2024]
పాలమూరులో ఓటర్ల తుది జాబితాపై కసరత్తు పూర్తయ్యింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్ఎస్ఆర్-2024కు అదనంగా కొత్త ఓటర్లను జత చేసి తుది జాబితాను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. -
గెలుపు బాధ్యత మీదే!
[ 28-04-2024]
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ నేతలు ఎన్నికల ప్రచారానికి మరింత పదును పెడుతున్నారు. ఉదయం మొదలు రాత్రి వరకు తమ పర్యటనలను కొనసాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులపై స్థానిక నాయకులను అడిగి తెలుసుకుంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్