logo

జువెనైల్‌ హోం నుంచి తప్పించుకున్న పిల్లలు

బాచుపల్లి జువైనల్‌ హోం నుంచి మంగళవారం కొంత మంది పిల్లలు తప్పించుకుని పారిపోయారు. జువైనల్‌ హోంలో మొత్తం 32 మంది పిల్లలు ఉన్నారు.

Published : 17 Apr 2024 15:13 IST

హైదరాబాద్‌: బాచుపల్లి జువైనల్‌ హోం నుంచి మంగళవారం కొంత మంది పిల్లలు తప్పించుకుని పారిపోయారు. జువైనల్‌ హోంలో మొత్తం 32 మంది పిల్లలు ఉన్నారు. సిబ్బంది తరగతి గదిలో లేకపోవడంతో పక్కనే ఉన్న కిటికీ ఊచలు తీసి 8 మంది పారిపోయారు. జువైనల్‌ హోం కాంపౌండ్‌వాల్‌కు ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయకపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుందని అభిప్రాయపడుతున్నారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఏసీపీ శ్రీనివాస్‌ రెడ్డి, సీఐ వెంకటేష్‌లు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు