logo

కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్‌ ఆత్మహత్య

కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్‌ ఆత్మహత్య చేసుకున్నారు. జీడిమెట్ల ఎస్సై నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్‌ వెంకటేశ్వర కాలనీలో నివాసముండే గుంటి శ్రీనివాస్‌(38) గతంలో ఆర్మీలో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందారు

Published : 18 Apr 2024 04:23 IST

జీడిమెట్ల, న్యూస్‌టుడే: కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్‌ ఆత్మహత్య చేసుకున్నారు. జీడిమెట్ల ఎస్సై నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్‌ వెంకటేశ్వర కాలనీలో నివాసముండే గుంటి శ్రీనివాస్‌(38) గతంలో ఆర్మీలో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందారు. తర్వాత స్పెషల్‌ పోలీస్‌ ఆఫీ‡సర్‌(ఎస్‌పీవో)గా పోలీసు విభాగంలో చేరి సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఇంట్లో భార్య భార్గవితో కుటుంబ విషయాలపై శ్రీనివాస్‌ గొడవపడ్డారు. దీంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. బుధవారం తెల్లవారుజామున భార్య, పిల్లలు పడక గదిలో ఉన్నప్పుడు బయట నుంచి గడియపెట్టారు. హాల్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు పక్కింటి వారికి ఫోన్‌ చేసి చెప్పడంతో వారు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వచ్చారు. అప్పటికే అతను మృతి చెందినట్లు భార్గవి పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని