logo

అచ్చెన్నాయుడి కుటుంబం తెదేపాకు అంకితం

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పార్టీలో సుదీర్ఘకాలం పనిచేస్తున్నారని, శ్రీకాకుళం జిల్లాలోనే కాక, మొత్తం రాష్ట్రంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని, పార్టీకి విధేయుడిగా పనిచేస్తున్నారని కర్నూలు పార్లమెంట్‌ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

Published : 27 Mar 2023 03:07 IST

ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేస్తున్న నాయకులు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పార్టీలో సుదీర్ఘకాలం పనిచేస్తున్నారని, శ్రీకాకుళం జిల్లాలోనే కాక, మొత్తం రాష్ట్రంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని, పార్టీకి విధేయుడిగా పనిచేస్తున్నారని కర్నూలు పార్లమెంట్‌ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలను ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో సోమిశెట్టి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేకు కోసి సంబరాలు చేసుకున్నారు. అచ్చెన్నాయుడి కుటుంబం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో పనిచేస్తోందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న అచ్చెన్నాయుడు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అసెంబ్లీలో నిలదీశారన్నారు. అరెస్టు చేయించినా బెదరక ప్రజాసేవలో వెనుకడుగు వేయలేదన్నారు. రానున్న రోజుల్లో 2024లో అచ్చెన్నాయుడు గెలుపొంది చంద్రబాబు సూచనలతో రాజకీయంగా మరింత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నాగేంద్రకుమార్‌, సోమిశెట్టి నవీన్‌, తిరుపాల్‌బాబు, మహేష్‌గౌడ్‌, రాజు యాదవ్‌, పరమేష్‌, సంజీవలక్ష్మి, హనుమంతరావు చౌదరి, అబ్బాస్‌, బజారన్న తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని