మిల్లర్లపై చర్యలకు రంగం సిద్ధం
గడువు ముగిసినా సీఎంఆర్ (కస్టం మిల్లింగ్ రైస్)ను ప్రభుత్వానికి ఇవ్వని మిల్లర్లపై ప్రభుత్వం కొరడా ఝులిపించడానికి సిద్ధమవుతోంది. వనపర్తి జిల్లా మొత్తం 139 రా మిల్లులు, 12 బాయిల్డ్ మిల్లులు ఉన్నాయి.
జిల్లాలోని ఓ బియ్యం మిల్లులో సీఎంఆర్ ధాన్యం
పెబ్బేరు, న్యూస్టుడే : గడువు ముగిసినా సీఎంఆర్ (కస్టం మిల్లింగ్ రైస్)ను ప్రభుత్వానికి ఇవ్వని మిల్లర్లపై ప్రభుత్వం కొరడా ఝులిపించడానికి సిద్ధమవుతోంది. వనపర్తి జిల్లా మొత్తం 139 రా మిల్లులు, 12 బాయిల్డ్ మిల్లులు ఉన్నాయి. వీటిలో నాలుగేళ్లుగా ప్రభుత్వానికి సీఎంఆర్ బియ్యం ఇవ్వకుండా మిలర్ల యజమానులు ఏవో కారణాలు చెబుతూ సీఎంఆర్ ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ పలుమార్లు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇటీవల రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు పలు మిల్లులపై దాడులు నిర్వహించగా సుమారు 5 లక్షల ధాన్యం బస్తాలు మాయమైనట్లు తేల్చారు. జిల్లాలో 80 బియ్యం మిల్లులను డిఫాల్ట్ కిందకు చేర్చి రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. సీఎంఆర్ బియ్యం ఇచ్చేందు కోసం ఎన్నో సార్లు గడువు పెంచి అవకాశాలు కల్పించినా మిల్లర్ల యజమానులు పట్టించుకోలేదు. వారిలో చలనం లేకపోవడంతో రాష్ట్ర పౌరసరఫరాలశాఖ చర్యలకు సిద్ధమవుతోంది.
ఇవ్వాల్సిన సీఎంఆర్ ఇలా..
వనపర్తి జిల్లాలో 2020 నుంచి నేటి వరకు సీఎంఆర్ ధాన్యం ఇవ్వలేదు. సీజన్ల వారీగా ఇలా.. 2020-21 యాసంగికి సంబంధించి సీఎంఆర్ బియ్యం 3,672 మెట్రిక్ టన్నులు ఇవ్వాలి. 2021- 22 వానాకాలం 5,064 మెట్రిక్ టన్నులు, అదే ఏడాది యాసంగిలో 4,722 మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి ఉంది. 2022-23 వానాకాలానికి సంబంధించి 65,069 మెట్రిక్ టన్నులు ఇవ్వాలి. అదే ఏడాది యాసంగికి సంబంధించి హైదరాబాద్ పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో టెండర్లు పిలిచి రాష్ట్రంలోని పలు మిల్లులకు ధాన్యం కేటాయించారు. ఈ ఏడాది వానాకాలంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని పలు మిల్లులకు 1,91,394 మెట్రిక్ టన్నులు కేటాయించారు. మిల్లర్లు మర ఆడించి క్వింటా ధాన్యంకు 67 శాతం బియ్యం ఇవ్వాలి. కేటాయించిన ధాన్యంలో 1,28,234 మెట్రిక్ టన్నులు ఇవ్వాలి. ఇప్పటి వరకు కేవలం 5,684 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే ఇచ్చారు.
ధాన్యం కేటాయించడం లేదు
- బాలు నాయక్, ఇన్ఛార్జి డీఎం, పౌరసరఫరాల సంస్థ, వనపర్తి
జిల్లాలో గడువులోగా సీఎంఆర్ బియ్యం ఇవ్వని 80 బియ్యం మిల్లులను డిఫాల్ట్ చేశాం. వీటికి ధాన్యం కేటాయించడం లేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ రికవరీ చట్టం కింద చర్యలు తీసుకుంటాం. నూటికి 125 శాతం వసూలు చేస్తాం. అలా ఇవ్వని వారి ఆస్తులను జప్తు చేస్తాం. డిఫాల్ట్ అయిన మిల్లుకు జామీను ఇచ్చిన ఇద్దరు మిల్లులపై కూడా చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేద్దాం
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం భాజపా అలంపూర్ నియోజకవర్గంలో చేపట్టిన విజయ సంకల్ప యాత్ర జయప్రదం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకు వేసవి చదువుల పండుగ
[ 29-04-2024]
విద్యార్థులు వేసవి సెలవులు సద్వినియోగం చేసుకునేలా.. వారిలో అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకు ఎంవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేసవి చదువుల పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఫౌండేషన్ మండల సమన్వయకర్త హన్మిరెడ్డి అన్నారు. -
వైభవంగా కలశ స్థాపన మహోత్సవం
[ 29-04-2024]
తుంగభద్ర నదిలో నీరు పూర్తిగా తగ్గడంతో బయటకు తేలిన రాజోలి శివారులోని శ్రీ రామేశ్వర స్వామి ఆలయంలో కలశ స్థాపన మహోత్సవం వైభవంగా నిర్వహించారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
[ 29-04-2024]
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదం ఉండవల్లి మండల పరిధిలోని అలంపూర్ చౌరస్తా ఫ్లైఓవర్పై జరిగింది. -
ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
[ 29-04-2024]
నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ప్రచండ ఎండ!
[ 29-04-2024]
పాలమూరులో భానుడు విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఏప్రిల్లోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో చెరువులు, నదులు, వాగులు, బావులు, చెక్డ్యాంలు, నీటికుంటలు ఎండిపోతున్నాయి. -
వలస ఓటర్లపై ఆశలు!
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని వలస ఓటర్లపై ప్రధాన పార్టీల అభ్యర్థులు దృష్టి పెట్టారు. ముంబయి, పుణె, భీమండిలో ఈ ప్రాంతానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన వేలాది మంది ఉపాధి కోసం హైదరాబాద్లో స్థిరపడ్డారు. -
వానాకాలం సాగు ప్రణాళిక సిద్ధం
[ 29-04-2024]
వచ్చే వానాకాలంలో పంటల సాగుకు అనుకూల పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ తెలపటంతో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువుల నిల్వలపై ముందస్తు అంచనాలు తయారు చేశారు. -
దుందుభి.. దుఃఖిస్తోంది!
[ 29-04-2024]
దుందుభి వాగులో ఇష్టానుసారంగా ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. రాత్రిళ్లు ఇసుక మాఫియా వాగును ఖాళీ చేస్తుండటంతో మండలంలోని కొత్తూర్, వెలుగొముల, రెడ్డిగూడ, చిల్వేరు, అయ్యవారిపల్లి, కొత్తపల్లి, వాడ్యాల గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
నేటి నుంచి రాష్ట్రస్థాయి సంస్కృత శిక్షణ శిబిరం
[ 29-04-2024]
మహబూబ్నగర్ - జడ్చర్ల రోడ్డులోని మయూరి పార్కు సమీప కేశవరెడ్డి ఉన్నత పాఠశాలలో సోమవారం నుంచి మే 5 వరకు రాష్ట్రస్థాయి సంస్కృత శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు సంస్కృత భారతి, రామకృష్ణ సేవా సమితి ప్రతినిధులు యాదయ్య, వెంకట్రెడ్డి, రాజ్మల్లేశ్ వెల్లడించారు. -
ఈవీఎంల వయసు 35 ఏళ్లు
[ 29-04-2024]
ప్రస్తుతం ఎన్నికల్లో పోలింగ్ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంలను వినియోగిస్తోంది. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈవీఎంలను తొలిసారి ఎప్పుడు వినియోగించారు? దాని పుట్టు పూర్వోత్తరాలను ఒకసారి పరిశీలిద్దాం. -
ఐదేళ్లకు ఓ పూట
[ 29-04-2024]
సినిమా అంటే క్యూలో నిలుచొని టిక్కెట్లు తీసుకుని మూడుగంటలు వెచ్చిస్తారు... స్నేహితులతో ముచ్చట్లు చెప్పడానికి ఎంతో సమయం తీసుకుంటారు... సామాజిక మాధ్యమాల్లో విహరించడానికి మరెంతో టైం ఖర్చవుతుంది... -
భారాస, భాజపా మాటలు నమ్మొద్దు : మంత్రి జూపల్లి
[ 29-04-2024]
భారాస, భాజపా నాయకుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన మండలంలోని పలు గ్రామాల్లో కార్యకర్తలతో సమావేశమయ్యారు. -
దోచుకున్న సొమ్ముతో దుబాయ్లో పెట్టుబడులు : వంశీచంద్రెడ్డి
[ 29-04-2024]
కేసీఆర్ కుటుంబం తెలంగాణలో పదేళ్ల పాటు దోచుకున్న సొమ్మంతా దుబాయ్లోని మాల్స్లో పెట్టుబడులు పెట్టిందని, అక్కడ అకాల వర్షాలతో మాల్స్ కొట్టుకుపోతే వారిలో అలజడి మొదలైందని మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి ఆరోపించారు. -
ముగిసిన శిర్సనగండ్ల రాములోరి బ్రహ్మోత్సవాలు
[ 29-04-2024]
రెండో భద్రాదిగా పేరొందిన చారకొండ మండలం శిర్సనగండ్ల శ్రీసీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం సాయంత్రం వైభవంగా ముగిసాయి. -
అలంపూర్ బేనీషా.. ప్రియం
[ 29-04-2024]
ప్రఖ్యాతి గాంచిన అలంపూర్ బేనీషా ఈ ఏడాది దొరకడం గగనమే. అత్యంత రుచికరమైన ఈ పండుకు మంచి గిరాకీ ఉంటుంది. ఈసారి వాతావరణ పరిస్థితులు అనుకూలించక తోటల్లో సగానికన్నా తక్కువ కాత కన్పిస్తోంది. -
ఎలుకా కొరకకే!
[ 29-04-2024]
నారాయణపేటలోని చిన్నపిల్లల ఆస్పత్రిలో రోగులకు ఎలుకలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వచ్చిన చిన్న పిల్లలు, కుటుంబికులు ఆందోళన చెందుతున్నారు. -
అందని ద్రాక్షగా.. టీ ఫైబర్ సేవలు
[ 29-04-2024]
గ్రామాలకు డిజిటల్ సేవలు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన టీ ఫైబర్ సేవల పథకం పడకేసింది. రెండేళ్లుగా అమలును విస్మరించడంతో గ్రామీణులకు డిజిటల్ సేవలు అందనిద్రాక్షగా మారాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం
-
సొంతగడ్డపై చెలరేగిన కోల్కతా.. దిల్లీపై ఘన విజయం
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM