logo

యువతి అదృశ్యం

పీఎంపాలెం ప్రాంతంలో ఓ యువతి అదృశ్యంపై బుధవారం కేసు నమోదు చేసినట్లు సీఐ వై.రామకృష్ణ తెలిపారు. క్రికెట్ స్టేడియం ఎదురు కాలనీకి చెందిన యువతి హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పని చేస్తోంది.

Published : 18 Apr 2024 04:37 IST

పీఎంపాలెం: పీఎంపాలెం ప్రాంతంలో ఓ యువతి అదృశ్యంపై బుధవారం కేసు నమోదు చేసినట్లు సీఐ వై.రామకృష్ణ తెలిపారు. క్రికెట్ స్టేడియం ఎదురు కాలనీకి చెందిన యువతి హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పని చేస్తోంది. ప్రస్తుతం ఇంటి వద్ద ఉంటూ ఆన్‌లైన్‌లో విధులు నిర్వహిస్తోంది. మంగళవారం ఉదయం యువతి తల్లిదండ్రులు పనిమీద విజయనగరం వెళ్లి తిరిగి సాయంత్రం వచ్చే సరికి కుమార్తె ఇంట్లో కనిపించలేదు. తనకోసం వెతకవద్దని కుమార్తె రాసిన లేఖ ఇంట్లో లభ్యమైంది. పలుచోట్ల వెదికినా ఆచూకీ లభించక పోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు