logo

బస్సులో సీఎం... ఎండలో జనం

సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న ‘సిద్ధం’ బస్సుయాత్ర ప్రజలకు చుక్కలు చూపించింది. మంగళవారం పీఎం పాలెం స్టేడియం వద్దకు సీఎం వచ్చి మాట్లాడతారని వైకాపా నేతలు జనాన్ని ఆటోల్లో తరలించారు.

Updated : 24 Apr 2024 09:13 IST

సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న ‘సిద్ధం’ బస్సుయాత్ర ప్రజలకు చుక్కలు చూపించింది. మంగళవారం పీఎం పాలెం స్టేడియం వద్దకు సీఎం వచ్చి మాట్లాడతారని వైకాపా నేతలు జనాన్ని ఆటోల్లో తరలించారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి వేచి చూసినా..సీఎం 11 గంటలకు రావడంతో జనం ఎండలో అల్లాడిపోయారు. కొందరు సమీప దుకాణాల్లోకి, వాహనాల చెంతకు, చెట్లకిందికి వెళ్లారు(చిత్రాల్లో). మరికొందరు వెనక్కి వెళ్లిపోయారు. జాతీయ రహదారిపై వాహనాలను కూడా పోలీసులు నిలిపివేయడంతో ట్రాఫిక్‌ నిలిచి పాట్లు పడ్డారు.

న్యూస్‌టుడే, పీఎంపాలెం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని