అన్నీ.. వట్టిమాటలేనా జగన్!
ఒక్క అవకాశం ఇవ్వండి.. అధికారంలోకి వచ్చాక సమస్యలన్నీ పరిష్కరిస్తా. అంటూ గత ఎన్నికలకు ముందు ప్రజాసంకల్ప పాదయాత్రలో ఎడాపెడా హామీలు గుప్పించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి వాటిని నెరవేర్చలేకపోయారు.
అమలుకు నోచుకోని పాదయాత్ర హామీలు
వెంటాడుతున్న తాగునీటి సమస్య
వీరవాసరం, నరసాపురం గ్రామీణ, భీమవరం గ్రామీణ, మొగల్తూరు, న్యూస్టుడే
వీరవాసరంలో సమస్య వివరిస్తున్న మహిళ (పాత చిత్రం)
ఒక్క అవకాశం ఇవ్వండి.. అధికారంలోకి వచ్చాక సమస్యలన్నీ పరిష్కరిస్తా. అంటూ గత ఎన్నికలకు ముందు ప్రజాసంకల్ప పాదయాత్రలో ఎడాపెడా హామీలు గుప్పించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి వాటిని నెరవేర్చలేకపోయారు. అప్పట్లో ఆయన భీమవరం, వీరవాసరం, నరసాపురం, మొగల్తూరు, కాళ్ల, ఆకివీడు మండలాల్లో పర్యటించారు. వీరవాసరం, బొబ్బనపల్లి, మెంటేపూడి, నరసాపురం పట్టణం, నరసాపురం, మొగల్తూరు మండలాల్లో ముత్యాలపల్లి, వారతిప్ప, శేరేపాలెం, కొత్తపాలెం, తూర్పుతాళ్లు, పీచుపాలెం, కాళ్ల మండలం సీసలి, ఆకివీడు మండలం చినకాపవరం, పెదకాపవరం, తరటావ, కోళ్లపర్రు గ్రామాల్లో ప్రజలు తాగునీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సీసాలతో నీటిని తీసుకువచ్చి సమస్య పరిష్కరించాలని కోరారు. దీనిపై స్పందించిన జగన్ అధికారంలోకి రాగానే డెల్టాలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. అయిదేళ్లు గడిచినా పరిస్థితిలో ఎలాంటి మార్పులేదు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్ధమవుతున్న వేళ జిల్లాకు వస్తున్న జగన్ ప్రజలకు ఏం సమాధానం చెబుతారో.
నరసాపురం 15వ వార్డు పరిధి చల్లాలమ్మ గుడి ప్రాంతంలో ట్యాంకర్ల వద్ద మహిళలు
ఇదీ పరిస్థితి
జిల్లాలో భీమవరం, నరసాపురం పట్టణాల్లో శివారు ప్రాంతాల ప్రజలకు నిత్యం తాగునీటి ఇక్కట్లు తప్పడం లేదు. శివారు ప్రాంతాలకు పైపులైన్ల విస్తరణ జరగకపోవడం, పైపులైన్లు ఉన్నా తగినంత నీరు సరఫరా కాకపోవడమే దీనికి కారణం. ఇలాంటి ప్రాంతాల వాసులకు ట్యాంకర్ల నీరే ఆధారం. పలు గ్రామాల్లో తాగునీటి చెరువులను అభివృద్ధి చేయాల్సి ఉన్నా ముందడుగు పడలేదు. గత తెదేపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన తాగునీటి పథకాలకు వైకాపా సర్కారు నిధులు నిలిపేయడంతో ఓహెచ్ఎస్ఆర్ల నిర్మాణాలు నాలుగున్నరేళ్లుగా నిలిచిపోయాయి. జల్జీవన్ మిషన్లో సమస్య పరిష్కరించాలని భావించినా గుత్తేదారులకు సకాలంలో బిల్లులు మంజూరు కాకపోవడంతో కొత్తగా పనులు చేపట్టేందుకు ఎవరూ ముందుకురాని పరిస్థితి.
ముత్యాలపల్లి వద్ద ఉప్పుటేరులో నీటిని తెచ్చుకుంటున్న యువకుడు
భీమవరం మండలం లోసరి పంచాయతీ తాగునీటి చెరువు ఇది. ఈ పంచాయతీ పరిధిలో గరవళ్లదిబ్బ, బర్రెవానిపేట గ్రామాలున్నాయి. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందక ఈ చెరువు గట్టున ఉన్న ఆర్వో కేంద్రం నుంచి నీటిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో పాటు దొంగపిండి, తోకతిప్ప, నాగిడిపాలెం, దెయ్యాలతిప్ప, కొత్తపూసలమూరు గ్రామాల ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జల్జీవన్ మిషన్లో జిల్లా వ్యాప్తంగా రూ. 424 కోట్లతో 1,473 పనులు చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు రూ. 61.13 కోట్ల విలువైన 427 పనులు పూర్తి చేశారు. ఈ పథకంలో గ్రామీణ ప్రాంతాల్లో పైపులైన్ల విస్తరణ, ఓహెచ్ఎస్ఆర్లు, ఫిల్టర్బెడ్లు, సంపుల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో జలధార పథకంలో చేపట్టిన పనులను గాలికి వదిలేశారు.
మాపై ఎందుకింత కక్ష
మేం వృద్ధాప్యంలో ఉన్నాం. దూరప్రాంతం నుంచి నీటిని మోసుకు వచ్చే ఓపిక లేదు. మా ఇంటివరకు పైపులైను వేసేందుకు రెండు నెలల కిందట తవ్వారు. కానీ పైపులు వేయలేదు. వైకాపా నాయకులకు మాపై ఎందుకింత కక్షో తెలియడంలేదు.
బందన దుర్గమ్మ, బందనవారిమెరక
కొనుగోలు చేయాల్సిందే..
మా గ్రామానికి కుళాయి నీరు సక్రమంగా రావడంలేదు. పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు తెలియజేసినా సమస్య పరిష్కరించడంలేదు. ఆర్వో ప్లాంట్ల నుంచి నిత్యం తాగునీటి డబ్బాలు కొనుగోలు చేసుకుంటున్నాం.
పితాని వెంకటలక్ష్మి, కట్టావారిమెరక
అంతా అస్తవ్యస్తం
మా ప్రాంతంలో నీటి సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. తూర్పుతాళ్లులో తాగునీటి పథకం నిర్వహణ సక్రమంగా లేదు. కళాయిల ద్వారా నీరు పూర్తిస్థాయిలో అందడంలేదు.
చామకూరి సుబ్రహ్మణ్యం, తూర్పుతాళ్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదేళ్లు జగన్.. గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా?: షర్మిల
[ 29-04-2024]
రైతులను అన్యాయం చేసిన వ్యక్తి సీఎం జగన్ అని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. -
జూదం క్లబ్బులు కావాలా...? డీఎస్సీ నోటిఫికేషన్ కావాలా?: పవన్
[ 29-04-2024]
వైకాపా ఓటమి తథ్యమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జూదం ఆడుకునే క్లబ్బులు కావాలా? డీఎస్సీ నోటిఫికేషన్ కావాలా? అని ప్రజలను ప్రశ్నించారు. -
జనసేనలో చేరనున్న వైకాపా నాయకులు
[ 29-04-2024]
వైకాపాకు ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పలువురు రాజీనామా చేశారు. ఈ నెల 30 న కొయ్యలగూడెంలో పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు. -
జగనన్న బీమాయాజాలం
[ 29-04-2024]
అనుకోని విపత్తులో మృత్యువు కబళించినా..కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కు ప్రాణం విడిచినా..నేనున్నానంటూ ధీమానిచ్చే ప్రభుత్వ బీమాను వైకాపా సర్కారు నిర్వీర్యం చేసింది. -
నేటి నుంచి పవన్ ప్రచార భేరి
[ 29-04-2024]
ఉమ్మడి పశ్చిమలో జనసేనాని పవన్కల్యాణ్ ప్రచార భేరి మోగించనున్నారు. ఎన్నికల నేపథ్యంలో నిర్వహిస్తున్న వారాహి విజయభేరి కార్యక్రమంలో భాగంగా సోమ, మంగళవారాల్లో జిల్లాలో పర్యటించనున్నారు. -
హామీలపై దగా.. ప్రశ్నించినందుకు పగ!
[ 29-04-2024]
‘దేవుని దయతో మన ప్రభుత్వం వచ్చిన వారంరోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తా.. ఉపాధ్యాయుల సమస్యలన్నీ పరిష్కరిస్తా’ అంటూ హామీలు గుప్పించి నమ్మించిన జగన్మోహన్రెడ్డి చివరకు మొండి చేయి చూపారు. -
ఆదుకోమంటే బాదేశారు
[ 29-04-2024]
పన్నుల బాదుడుతో రవాణా రంగాన్ని జగన్ ప్రభుత్వం కుదేలు చేసింది. ఫలితంగా ఈ రంగంపై ఆధారపడిన లక్షల మంది ఉపాధిపై తీవ్ర ప్రభావం పడింది. -
ప్రలోభాల బటన్ నొక్కేశారు!
[ 29-04-2024]
ప్రతి కుటుంబానికి పథకాల లబ్ధిని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం.. ఇంటింటికీ సంక్షేమాన్ని చేరువ చేశాం.. ఆ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయంటూ నిన్నమొన్నటి వరకు బీరాలు పలికిన అధికార వైకాపా నాయకులు.. -
ఎన్నికల వేళ.. ఇసుకాసురుల తెగింపు
[ 29-04-2024]
ఎన్నికల వేళ ఇసుక ర్యాంపులు తెరుచుకుంటున్నాయి. కరుగోరుమిల్లి ర్యాంపు నుంచి ఆదివారం రవాణా మొదలైంది. గతంలో గ్రామస్థులు ర్యాంపునకు గండి కొట్టగా, నిర్వాహకులు దానిని మళ్లీ పూడ్చి బాట నిర్మించారు. -
వివాదాలకు అవకాశం ఇవ్వొద్దు: కలెక్టర్
[ 29-04-2024]
నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగుతుందని కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు. -
కొల్లేరుపై అన్నీ కోతలే
[ 29-04-2024]
దేశంలో అతి పెద్ద మంచినీటి సరస్సు.. ప్రపంచంలోనే మరెక్కడా లేనన్ని పక్షి జాతులు.. అరుదైన మత్స్యజాతికి ఆలవాలం.. ఎన్నో సంస్కృతుల సమాహారం.. ద్వీపాలు, ద్వీపఖండాల మనోహరం కొల్లేరు. -
జె-బ్రాండ్లతో ప్రజారోగ్యం గుల్ల
[ 29-04-2024]
రాష్ట్రంలో జె-బ్రాండ్ల మద్యం తాగి 30 వేల మంది కిడ్నీ, లివర్ వ్యాధుల బారిన పడ్డారు.. అనారోగ్యాలు బయటపడని వారు ఎంతమంది ఉన్నారో అంచనాలకు అందని పరిస్థితి ఉందని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణ రాజు పేర్కొన్నారు. -
‘వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నాశనం’
[ 29-04-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నీ సర్వనాశనం అయ్యాయని నరసాపురం పార్లమెంట్ భాజపా అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. -
ఉపాధి పనుల్లో పశువులు!
[ 29-04-2024]
‘ఉపాధి’ పని చేస్తున్న కూలీల చిత్రం ఉండాల్సిన చోట గేదెల చిత్రం అప్లోడ్ చేశారు.. జీలుగుమిల్లి మండల ఉపాధి ఉద్యోగులు. -
ఏటా కొలువులన్నావ్.. కన్నీటినే మిగిల్చావ్..!
[ 29-04-2024]
జగన్మోహన్రెడ్డి మాయమాటలు నమ్మిన నిరుద్యోగ యువత నిలువునా మోసపోయింది. అయిదేళ్లుగా సర్కారు కొలువుల కోసం వారికి నిరీక్షణ తప్పలేదు. -
ఇంటింటికీ ప్రచార వాహనం....
[ 29-04-2024]
వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంటింటికీ రేషన్ పేరిట వైకాపా నాయకులు, అనుచరులకు ఎండీయూ వాహనాలను కట్టబెట్టిన విషయం తెలిసిందే. -
వైఎస్సార్ కుటుంబం అవినీతితో ఎదిగింది : జోగయ్య
[ 29-04-2024]
వైఎస్సార్ కుటుంబమంతా అవినీతిలోనే ఎదిగిందని మాజీ మంత్రి చేగొండి హరరామజోగయ్య అన్నారు. -
కొత్త ఓటర్లు 24,599 మంది
[ 29-04-2024]
ప్రస్తుత ఎన్నికలకు సంబంధించి, ఓటు హక్కు లేనివారికి ఎన్నికల సంఘం చివరి అవకాశంగా ఏప్రిల్ 15 వరకూ గడువిచ్చింది. -
నేడు కొయ్యలగూడెంలో షర్మిల పర్యటన
[ 29-04-2024]
రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన న్యాయయాత్ర సోమవారం కొయ్యలగూడెం చేరుకోనుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజనాల రామ్మోహనరావు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
సొంతగడ్డపై చెలరేగిన కోల్కతా.. దిల్లీపై ఘన విజయం
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!