MALTA : దయ్యాల కోసం ఆ దేశంలో రెండు గడియారాలు పెడుతున్నారు!
మాల్టా (Malta).. దక్షిణ ఐరోపాలోని ద్వీప దేశం. మొత్తం జనాభా సంఖ్య 5.2 లక్షలు. ప్రపంచంలోని అతి చిన్న దేశాల్లో ఒకటైన మాల్టాలో సుమారు 360 దాకా చర్చిలున్నాయి (Churches). అక్కడి ప్రతి చర్చి ఎదుట రెండు గడియారాలు (Clocks) కన్పిస్తాయి. అవి వేర్వేరు సమయాలను తెలుపుతుంటాయి. దాని వెనకున్న కథేంటో తెలుసుకోండి.
విదేశీ విహార యాత్రలు చేసే వారెవరైనా ఒక సారి మాల్టా (Malta) వెళితే తికమక పడిపోతారు. ఎందుకంటే అక్కడున్న ప్రతి చర్చిపై (Church) రెండు గడియారాలు కన్పిస్తుంటాయి. వాటిలో వేర్వేరు సమయాలుంటాయి (Time). అది పొరపాటా? ప్రాంకా? ఉద్దేశపూర్వకంగానే అలా పెట్టారా? అనే విషయం స్థానికులు చెబితే తప్ప గందరగోళం నుంచి బయటపడలేరు. ఇంతకీ ఆ గడియారాల వెనుకున్న గమ్మత్తు ఏంటో తెలుసుకుందాం పదండి.
ప్రచారంలో ఎన్నో వాదనలు
రెండు గడియారాలు ఎందుకు పెడుతున్నారనే విషయంపై భిన్న వాదనలున్నాయి. ఏది సరైన వాదన అనే విషయంపై చరిత్రకారులు ఇంకా అధ్యయనం చేస్తూనే ఉన్నారు. ప్రజలు ఎక్కువగా నమ్మే వాదన ఏమిటంటే దయ్యాలను తికమక పెట్టాలని రెండు గడియారాలు పెట్టారట. చర్చిలో సామూహిక ప్రార్థనలు జరుగుతున్నప్పుడు దయ్యాలు వస్తే తొందరగా వచ్చామేమో? ఆలస్యంగా వచ్చామేమో? అని అవి తికమక పడేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు కొందరు చెబుతున్నారు. రెండు గడియారాలు వేర్వేరు సమయాలు చూపిస్తున్నా విశ్వాసులు వాటితో సంబంధం లేకుండా చర్చి గంటలు మోగే శబ్దాన్ని బట్టి ప్రార్థనలకు వెళ్తుంటారు.
మరో వివరణ ప్రకారం.. రెండు గడియారాలను సమాజంలో వివిధ రకాల వ్యక్తుల కోసం ఏర్పాటు చేశారట. ఒక గడియారం రైతులకు ఉపయోగపడుతుంది. అంటే వారు తొందరగా లేచి పొలం పనులకు వెళ్లడానికి సహాయ పడుతుంది. మరోది జాలర్ల కోసం. వీరు సమయాన్ని బట్టి కాకుండా అలల తాకిడి, రుతువుల ఆధారంగా వేటకు వెళ్తుంటారు. దాంతో రెండో గడియారంలో సమయం తప్పుగా ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకో ప్రచారంలో ఒక గడియారం స్థానిక సమయాన్ని, మరో గడియారం రోమ్ సమయాన్ని చూపిస్తుందని అంటారు. రెండు గడియారాలుంటే ఒకటి పని చేయకపోయినా మరొక దాని ద్వారా అసలు సమయం తెలుసుకోవచ్చనే ఆలోచనతో అలా పెట్టి ఉంటారని ఇంకొందరు చెబుతున్నారు.
గ్రామానికి పీడ పట్టిందని..
రెండు గడియారాలను దుష్ట ఆత్మలను పారద్రోలడానికి పెట్టారని స్థానిక జానపద సాహిత్యం చెబుతోంది. దాని ప్రకారం 18వ శతాబ్దంలో ఈ సంప్రదాయం మొదలైంది. అప్పట్లో మాల్టా గ్రామాన్ని దురదృష్టాలు వెంటాడుతుండేవి. పంటలు పండకపోవడం, అంటు వ్యాధులు ప్రబలడం, ఆకస్మిక మరణాలు సంభవించడం వంటి పరిణామాలు వరసగా జరిగాయి. దాంతో తమ గ్రామం శాపానికి గురైందని, పీడ పట్టిందని స్థానికులు నమ్మసాగారు. ఏం చేయాలో పాలుపోక చివరికి గ్రామ మతాధికారిని సంప్రదించారు. ఆయన సలహా మేరకు గ్రామ కూడలిలో రెండు గడియారాలు ఏర్పాటు చేశారు. అందులో ఒకటి సరైన సమయాన్ని సూచిస్తే.. మరోకటి ఐదు నిమిషాలు ముందుండేది. ఈ సమయ వ్యత్యాసం దుష్ట శక్తులను గందరగోళానికి గురి చేస్తుందని ఆయన నమ్మాడు. దాంతో అవి గ్రామం విడిచిపోతాయని భావించాడు. ఊహించినట్లుగానే కొన్ని రోజుల తర్వాత గ్రామంలో మార్పు కనిపించింది. పంటలు సమృద్ధిగా పండాయి. వ్యాధులు, బాధలు దూరమయ్యాయి. అప్పటి నుంచి మాల్టాకు రెండు గడియారాల గ్రామం అనే పేరు వచ్చింది. తమ పూర్వీకుల సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూ ప్రతి చర్చి వద్ద రెండు గడియారాలు అమర్చుతున్నారు. కుడి వైపు అసలు సమయం, ఎడమ వైపు తప్పు సమయం పెడుతున్నారు. దాంతో మాల్టా గడియారాల కథ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
పేటలో ఒకసారి ఓడిన వారికి చోటులేనట్లే!
-
కిమ్ను తలదన్నే జగన్ సర్కారు... కిమ్మనకూడదు జనం నోరు..!
-
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
-
కాలేయానికి అధిక కొవ్వు ముప్పు.. వర్క్ ఫ్రం హోం తర్వాత పెరిగిన కేసులు
-
‘అమ్మో జగన్ బొమ్మా’ళీ.. అడ్డగోలుగా ఫైబర్నెట్ ధరల పెంపు!
-
అన్నకు నచ్చని తమ్ముడి పెళ్లి.. యువతి అమ్మమ్మ ఇంటికి నిప్పుపెట్టిన ప్రబుద్ధుడు