హస్తంలో గెలుపు రేఖ అదృశ్యం..!
కాంగ్రెస్.. భారత్లో 130 ఏళ్ల చరిత్రతో ‘ది గ్రాండ్ ఓల్డ్ పార్టీ’గా ఒక వెలుగు వెలిగింది. కానీ, ఇప్పుడా పార్టీ పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోంది. పార్టీలో నెలకొన్న నాయకత్వ
ఆగని ఓటముల పరంపర..!
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
130 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ ‘ది గ్రాండ్ ఓల్డ్ పార్టీ’గా ఒక వెలుగు వెలిగింది. కానీ, ఇప్పుడా పార్టీ పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోంది. పార్టీలో నెలకొన్న నాయకత్వ, వ్యవస్థీకృత లోపాలు వెరసి దానిని ఓటముల ఊబిలోకి నెడుతున్నాయి. అందివచ్చిన యువ నాయకులను.. అనుభవం ఉన్న సీనియర్లనూ చేజేతులారా వదులుకొంటోంది. చాలా చోట్ల ప్రాంతీయ పార్టీలు పొత్తులకు కూడా కాంగ్రెస్ వైపు చూడని పరిస్థితి నెలకొందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా ఆ పార్టీ నాయకుల్లో, కేడర్లో తీవ్ర నిర్వేదం నెలకొంటోంది. దీంతో జెండా మోసే కార్యకర్తలకు దిక్సూచి కరవుతోంది. అన్ని వెరసి తాజా ఎన్నికల తర్వాత కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితం అయింది. మరోవైపు ఒక్క రాష్ట్రంతో అధికార ప్రస్థానం మొదలు పెట్టిన ఆమ్ఆద్మీ పార్టీ పంజాబ్లో విజయంతో రెండో రాష్ట్రాన్ని తన ఖాతాలో వేసుకొంది.
నాయకత్వం చేపట్టరు.. అవకాశం ఇవ్వరు..
కాంగ్రెస్ అగ్ర నాయకత్వం గాంధీల కుటుంబంతో పెనవేసుకుపోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపడితే ఆ కుటుంబం వారే చేపట్టాలనే పరిస్థితి నెలకొంది. 2019 ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని వదులుకొన్నారు. దీంతో తిరిగి ఆ పదవి సోనియాగాంధీ చేతికే వెళ్లింది. కానీ, పార్టీలో రాహుల్ మాట వేదవాక్కుగా చలామణి అవుతోంది. ప్రశాంత్ కిశోర్ వంటి ఎన్నికల వ్యూహకర్తలు ఇటువంటి వ్యవహారశైలిని తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘బలమైన ప్రతిపక్షం ఉండాలంటే కాంగ్రెస్ సిద్ధాంతాలు, ఉనికి చాలా అవసరం. అయితే కాంగ్రెస్ నాయకత్వం ఒక వ్యక్తికి ఉన్న ‘దైవదత్త హక్కు’ ఏమీ కాదు. గత పదేళ్లలో 90 శాతం ఎన్నికలు ఓడిపోయిన దృష్ట్యా ఇలాంటి హక్కు ఉందని భావించలేరు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతిపక్ష నాయకత్వాన్ని నిర్ణయించుకోవాలి’’ అంటూ హితవు పలికారు. ఆ సమయంలో ఆయనపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పించారు. తర్వాత పరిస్థితి షరా మాములే..! ఇక పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరున్న గులాంనబీ ఆజాద్ కూడా గత నెల మాట్లాడుతూ.. ‘‘నాయకుడి తర్వాత నాయకుడు పార్టీని వీడుతున్నారు.. ఇది ఆందోళనకరం’’ అంటూ వ్యాఖ్యానించారు. 2020లో ఏకంగా పార్టీకి చెందిన ఐదుగురు మాజీ ముఖ్యమంత్రులు, నాటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు పార్టీని ఆమూలాగ్రం ప్రక్షాళన చేయాలని లేఖ రాశారు. ఫలితం.. ఆ లేఖరాసిన 23 మందిని జీ-23 పేరిట వేరుగా చూడటం మొదలుపెట్టారు. కొందరికి వర్కింగ్ కమిటీలో సీట్ల గల్లంతయ్యాయి.
పార్టీని వీడుతున్న ప్రజాదరణ ఉన్న నాయకులు..
మంచి వాగ్ధాటి.. ప్రజాదరణ ఉన్న నాయకులు క్రమంగా కాంగ్రెస్ వీడుతున్నారు. ఇటీవల కాలంలో చూస్తే.. రాహుల్ సన్నిహిత వర్గంలోని వ్యక్తిగా పేరున్న జ్యోతిరాదిత్య సింధియా కూడా కమలం కండువా కప్పుకొన్నారు. నాయకత్వం సింధియాను పరిగణనలోకి తీసుకోకుండా.. వృద్ధనేత కమల్నాథ్కు ప్రాధాన్యమివ్వడంతో పాటు సీఎంగా పగ్గాలు అప్పగించడం దీనికి ప్రధాన కారణంగా నిలిచింది. ఇటువంటి ఘటనలు పార్టీ కేడర్కు ఎటువంటి సందేశాన్ని పంపుతాయని హస్తం నాయకత్వం పెద్దగా పట్టించుకొన్నట్లు లేదు.
* ప్రస్తుత అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కూడా 1991-2015 వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన వ్యక్తి. చివరకు పార్టీని వీడి కమలం కండువాకప్పుకొని ఏకంగా అసోం ముఖ్యమంత్రి అయ్యారు.
* మెహువా మొయిత్రి వంటి ప్రతిభావంతురాలు రాహుల్ గాంధీ ప్రాజెక్ట్ ఆమ్ ఆద్మీ సిపాయిలో పనిచేశారు. జేపీ మోర్గాన్ ఛేజ్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలో కీలక పదవిని వీడి రాజకీయాల్లోకి వచ్చిన ప్రతిభావంతురాలామె. కానీ, కాంగ్రెస్లో అవకాశాలు లభించక పార్టీని వీడి తృణముల్లో చేరి తనను తాను నిరూపించుకొన్నారు. ఇప్పుడు లోక్సభలో టీఎంసీ గళం బలంగా వినిపిస్తున్న నేతగా ఆమె నిలిచారు.
* తాజాగా పంజాబ్ ఎన్నికలు దీనికి మంచి ఉదాహరణ. నవజ్యోత్ సింగ్ సిద్ధూలో కాంగ్రెస్ నాయకత్వానికి ఏమి ప్రజాకర్షణ కనిపించిందో ఏమో.. గత ఎన్నికల్లో అన్ని తానై పార్టీని నడిపించిన అమరీందర్ సింగ్ను ఇబ్బందికర పరిస్థితుల్లో బయటకు సాగనంపింది. చన్నీని తీసుకొచ్చి సీఎం పీఠంపై కూర్చొబెట్టింది. సిద్ధూ-చన్నీ పోరు కారణంగా కాంగ్రెస్ అవకాశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరోపక్క పార్టీని వీడిన అమరీందర్ విజయం సాధించలేదు.. అటు కాంగ్రెస్ గెలవలేదు. వాస్తవానికి రైతు ఉద్యమాన్ని వెనుకుండి నడిపించి విజయం సాధించేలా చేసింది అమరీందరే. చివరికి ఆ విజయం ఎవరికీ కాకుండా పోయింది.
* రాజస్థాన్ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించిన సచిన్ పైలట్ను ఫలితాలు వచ్చిన తర్వాత పక్కనపెట్టారు. తిరిగి వృద్ధనేత అశోక్ గహ్లోత్కు అవకాశం ఇచ్చారు. సచిన్ కొన్నాళ్లపాటు పార్టీలో అవమానాలకు గురై చివరికి రాజీనామా వరకు వెళ్లాల్సి వచ్చింది. పరిస్థితి చేజారుతుందని భావించిన అధినాయకత్వం జోక్యం చేసుకోవడంతో ఆయన పార్టీలో కొనసాగుతున్నారు. ఇవన్నీ పార్టీ కోసం శ్రమించే నేతలకు తప్పుడు సంకేతాలు పంపుతాయనే విషయాన్ని మాత్రం హస్తం నేతలు విస్మరించారు.
* పార్టీ ట్రబుల్షూటర్లుగా పేరున్న ప్రణబ్ముఖర్జీ, అహ్మద్ పటేల్ వంటి ఉద్ధండుల మరణంతో కాంగ్రెస్లో ఏర్పడ్డ శూన్యం స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రాంతీయ పార్టీలు కూడా దూరం..
ప్రాంతీయ పార్టీలు కూడా కాంగ్రెస్ను ప్రధాన ప్రతిపక్షంగా భావించే పరిస్థితులు మారిపోయాయి. దేశంలోని అతికొద్ది రాష్ట్రాల్లో తప్ప మిగిలిన చోట్ల ప్రధాన ప్రతిపక్షం అన్న పరిస్థితి లేదు. మహారాష్ట్ర ప్రభుత్వంలో కానీ, తమిళనాడు ప్రభుత్వంలో కానీ, కాంగ్రెస్ పాత్రను చూస్తే ఇది అర్థమైపోతుంది. ఇటీవల కాలంలో ప్రాంతీయ పార్టీలు కూడా కాంగ్రెస్ను ప్రధాన శక్తిగా పెట్టుకొని 2024 ఎన్నికలకు వెళ్లేలా ఏమి కనిపించడంలేదు. ఈ సారి యూపీ ఎన్నికలను పరిశీలిస్తే ఈసారి ఎస్పీ, బీఎస్పీ కూడా కాంగ్రెస్తో పొత్తుకు దూరంగా ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు, భాజపా బలపడుతూ.. కాంగ్రెస్ ఓటింగ్ శాతం తగ్గుతోందంటే.. ఏం జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు కేంద్రంలో మతతత్వ పార్టీగా విమర్శల పాలైన భాజపాను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ను నేతృత్వంలో రాజకీయ పార్టీలు పనిచేశాయి. కానీ, ఇప్పుడు మెల్లగా పరిస్థితి మారింది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, స్టాలిన్, కేసీఆర్ వంటి వారు మోదీ-షా ద్వయం ఎత్తులను ఎదుర్కొనేందుకు స్వశక్తినే నమ్ముకొన్నారు. అవసరమైతే వీరంతా జట్టుకట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. వీరితో తాజాగా కేజ్రీవాల్ కూడా కలిసే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టోల్ ఛార్జీలను తప్పించుకునేందుకు.. సీఎం కాన్వాయ్ను ఫాలో అయి..
సీఎం కాన్వాయ్ను అనుసరించి ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. ప్రస్తుతం అతడిపై కేసు నమోదైంది. -
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
రాజస్థాన్లోని జయపురకు చెందిన మాజీ కమాండో హిమ్మత్సింగ్ రాఠోడ్ (40) ఇరవై నాలుగు గంటల్లో 70,679 మెట్లు ఎక్కి ప్రపంచ రికార్డును బద్దలుకొట్టారు. -
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
రాజస్థాన్లో జోధ్పుర్కు చెందిన తల్లీకొడుకులు చంద్రాదేవి (68), మోహన్లాల్ మూడు నెలలు కష్టపడి మధుబని కళను జోడించి ఎంబ్రాయిడరీ డిజైనుతో 8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టారు. -
బాల్యంలో శారీరక శ్రమ లోపిస్తే గుండెకు ముప్పు
చిన్నతనంలో శారీరక శ్రమలోపిస్తే గుండె పరిమాణం పెరిగే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. -
పత్రికలను, ప్రత్యర్థులను మేమెలా అడ్డుకుంటాం!
జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపేందుకు అవసరమైన సదుపాయాలను దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కల్పించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) బుధవారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
ఐఎఫ్ఎస్కు 147 మంది ఎంపిక
యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్ పరీక్ష తుది ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
అంటార్కిటికాలో భారత కొత్త పరిశోధన కేంద్రం!
హిమమయ అంటార్కిటికా ప్రాంతంలో కొత్తగా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భారత్ నిర్ణయించింది. -
2023- సౌర విద్యుత్తులో ప్రపంచంలో మూడోస్థానంలో భారత్
2023లో సౌర విద్యుదుత్పత్తిలో ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది. ఇంతవరకు జపాన్ ఈ స్థానంలో ఉండేది. -
ముడత మంచిదే!
పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించేందుకు శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్) సిబ్బంది ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. -
ఆ దృశ్యాలను 100 మందికి చూపిస్తాం..
పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్పై ఓ మహిళ లైంగిక వేధింపుల అభియోగాలు మోపిన నేపథ్యంలో రాజ్భవన్ కీలక నిర్ణయం తీసుకుంది. -
వ్యాధుల భారానికి అనారోగ్యకర ఆహారమే ప్రధాన కారణం
భారత్లో మొత్తం వ్యాధుల భారంలో 56.4 శాతం అనారోగ్యకర ఆహారం కారణంగా ఉన్నట్లు అంచనాలు పేర్కొంటున్నాయని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) బుధవారం తెలిపింది. -
భద్రతా మండలికి భారత్ 5 లక్షల డాలర్లు
ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఉగ్రవాద నిరోధక ట్రస్ట్ ఫండ్కు భారత్ 5 లక్షల డాలర్లను విరాళంగా ఇచ్చింది. -
శివుడికి నాలుక సమర్పించిన యువకుడు
ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లా థానాడ్ గ్రామంలో బుధవారం రాజేశ్వర్ నిషాద్ (33) అనే యువకుడు చాకుతో నాలుక కోసుకొని శివుడికి సమర్పించుకున్నాడు. -
ఐఐటీ మద్రాస్కు రూ.513 కోట్ల విరాళం
ఐఐటీ మద్రాస్ చరిత్రలో దాతల నుంచి అత్యధిక నిధులు సమకూరాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.513 కోట్లు అందినట్లు ఐఐటీ మద్రాస్ సంచాలకులు ప్రొఫెసర్ వి.కామకోటి బుధవారం ప్రకటించారు. -
ఏఐతో నిఘా వ్యవస్థల రూపకల్పన
కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత నిఘా వ్యవస్థలు, ఇతర ప్రాజెక్టుల అభివృద్ధికి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), భువనేశ్వర్ ఐఐటీలు చేతులు కలిపాయి. -
కోర్టులో రాజకీయాలు వద్దు
కోర్టు వాదనల్లో రాజకీయ అంశాల ప్రస్తావనను అనుమతించబోమని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. -
దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా ఉంటారు
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా, తూర్పు భారతీయులు చైనీయుల మాదిరిగా కనిపిస్తారని ‘ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్’ ఛైర్మన్ శాం పిట్రోడా చేసిన వ్యాఖ్య మరో వివాదానికి తెరలేపింది. -
కేజ్రీవాల్ బెయిల్పై రేపు సుప్రీం ఉత్తర్వులు
మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణల కింద అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తర్వులు ఇవ్వనుంది. -
దక్కని బెయిల్.. కేంద్ర కారాగారానికి రేవణ్ణ
మహిళ కిడ్నాప్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణను పరప్పన అగ్రహార కేంద్ర కారాగారానికి బుధవారం తరలించారు. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ 100 సర్వీసుల రద్దు
టాటా గ్రూప్లోని విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్ప్రెస్కు ఉద్యోగుల సెగ తగిలింది. -
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!
పూంఛ్ వద్ద వాయుసేన కాన్వాయ్పై జరిగిన దాడిలో పాక్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దేశానికి చెందిన మాజీ కమాండో ఈ ఘటనలో నేరుగా పాల్గొన్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి.
తాజా వార్తలు (Latest News)
-
టోల్ ఛార్జీలను తప్పించుకునేందుకు.. సీఎం కాన్వాయ్ను ఫాలో అయి..
-
ఆ విధ్వంసమేంటి? ఫస్ట్ బ్యాటింగ్ చేసుంటే ‘300’ కొట్టేవాళ్లేమో: సచిన్
-
బాచుపల్లిలో గోడ కూలిన ఘటన.. ఆరుగురి అరెస్టు
-
రహస్యంగా ఐపీఓకు.. ఈ కొత్త వ్యూహం వెనక మతలబేంటి?
-
గుడ్న్యూస్ చెప్పిన రష్మిక.. మరో భారీ ప్రాజెక్ట్తో రెడీ
-
మాటలు రావట్లేదు.. అలాంటి బ్యాటింగ్ టీవీల్లోనే చూశాం: కేఎల్ రాహుల్