ఐఫోన్‌ కోసం కన్నబిడ్డను అమ్మేశారు.. రీల్స్‌ మోజుతో తల్లిదండ్రుల అమానవీయం

సామాజిక మాధ్యమాల్లో రీల్స్‌ చేయడానికి ఐఫోన్‌ కొనాలనుకున్న దంపతులు డబ్బుల కోసం కన్నబిడ్డనే అమ్మేశారు.

Updated : 28 Jul 2023 08:02 IST

సామాజిక మాధ్యమాల్లో రీల్స్‌ చేయడానికి ఐఫోన్‌ కొనాలనుకున్న దంపతులు డబ్బుల కోసం కన్నబిడ్డనే అమ్మేశారు. ఈ దిగ్భ్రాంతికర ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. ఉత్తర 24 పరగణాల జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పానిహతిలోని గాంధీనగర్‌కు చెందిన జయదేవ్‌, సాథి దంపతులకు ఏడేళ్ల కుమార్తె, 8 నెలల కుమారుడు ఉన్నారు. కొద్దిరోజులుగా వారి కుమారుడు కనిపించకపోవడంపై స్థానికులకు అనుమానం వచ్చింది. దీనికితోడు ఆ దంపతులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి రీల్స్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడం గుర్తించారు. పసికందు గురించి స్థానికులు ప్రశ్నించగా.. అమ్మేసినట్లు జయదేవ్‌, సాథి తెలిపారు. ఆ డబ్బుతో ఐఫోన్‌ కొన్నట్లు చెప్పారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించడంతో భార్యాభర్తలను అదుపులోకి తీసుకుని విచారించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని