India Corona : 2500 దిగువకు కొత్త కేసులు..

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా

Published : 15 May 2022 10:14 IST

క్రమంగా తగ్గుతోన్న క్రియాశీల కేసులు..

దిల్లీ : దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా మూడు వేల లోపే నమోదువుతున్న కొత్తకేసులు తాజాగా 2500 దిగువకు చేరాయి. మరోవైపు క్రియాశీల కేసులు కూడా తగ్గుతుండటం సానుకూలాంశం. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

* నిన్న 4,05,156 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,487 కేసులు వెలుగులోకి వచ్చాయి.

* శనివారం కరోనాతో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 5,24,214కు చేరింది.

* నిన్న 2878 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.25 కోట్లు  (98.74%) దాటింది.

* ఇక గత కొన్ని రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉంటుండటంతో.. క్రియాశీల కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 17,692 (0.04%)కు చేరాయి.

* ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న 15,58,119 మంది టీకాలు తీసుకోగా.. ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 191.32 కోట్లు దాటింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని