
Farmers: ముగిసిన సుదీర్ఘ నిరసనలు.. ఇంటికి పయనమైన రైతన్నలు
దిల్లీ: సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దాదాపు 15 నెలల పాటు రైతన్నలు చేపట్టిన సుదీర్ఘ నిరసలు ముగిశాయి. రెండు రోజుల క్రితం చెప్పినట్టుగానే.. శనివారం ఉదయం నుంచి వారు దిల్లీ సరిహద్దులోని నిరసన వేదికల్ని ఖాళీ చేసి, ఇంటికి పయనమయ్యారు. తమ ఆందోళనలు కొనసాగించేందుకు ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణాలను తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది. వారు ఉపయోగించిన దుప్పట్లు, దిండ్లు, పీవీసీ షీట్లు, దోమ తెరలు వంటి వాటిని చుట్టుపక్కల గ్రామాల్లోని పేద ప్రజలకు పంచిపెట్టారు. అనంతరం రంగురంగుల లైట్లతో అలంకరించిన ట్రాక్టర్లు సొంత గ్రామాలకు పయనమయ్యాయి. ఈ క్రమంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. గాజిపూర్ సరిహద్దు ప్రాంతంలో బయలుదేరిన ట్రాక్టర్లను రైతు సంఘం నేత రాకేశ్ టికాయిత్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ రోజు ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘రేపు ఉదయం ఎనిమిది గంటలకు పెద్ద సంఖ్యలో రైతులు ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సి ఉంది. ఇప్పటికే కొందరు ఇళ్లకు వెళ్లడం ప్రారంభించారు. ఈ ప్రక్రియకు 4-5 రోజులు పడుతుంది. ఈ రోజు సమావేశంలో మేమంతా మాట్లాడుకుంటాం. ప్రార్థనలు జరుపుతాం. మాకు సహకరించిన వారిని కలుస్తాం. నేను ఈ 15వ తేదీన ఈ ప్రాంతాన్ని వీడతాను. ప్రభుత్వం తన హామీలను నేరవేర్చకపోతే.. మళ్లీ తిరిగి వస్తాం’ అని టికాయిత్ వెల్లడించారు.
గత ఏడాది కేంద్రం తీసుకువచ్చిన సాగుచట్టాలను వ్యతిరేకిస్తూ.. అన్నదాతలు చేపట్టిన నిరసనలకు ప్రభుత్వం దిగొచ్చింది. ఆ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సాగు చట్టాల రద్దు బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. అలాగే రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణకు అంగీకరించడం, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత వంటి తదితర డిమాండ్లపై చర్చించేందుకు కమిటీ ఏర్పాటుకు ముందుకురావడంతో రైతులు నిరసన వేదికలను వీడేందుకు అంగీకరించారు. దానిలో భాగంగా వారు ఏడాది తర్వాత ఇంటికి వెళ్తున్నారు. విజయంతో తిరిగి వస్తోన్న రైతులకు ఘన స్వాగతం పలికేందుకు స్వగ్రామాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయని కొందరు వెల్లడించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)
-
India News
Mamata Banerjee: మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. దీదీ జోస్యం
-
Viral-videos News
Viral video: రియల్ హీరో.. కరెంటు షాక్తో విలవిల్లాడుతున్న ఆవును రక్షించిన యువకుడు
-
India News
Sidhu Moose Wala: సిద్ధూ మూసేవాల కేసులో షార్ప్షూటర్ అరెస్టు
-
Sports News
IND vs ENG: శ్రేయస్ను తెలివిగా బుట్టలో వేసిన ఇంగ్లాండ్.. వీడియో చూడండి
-
Movies News
Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- Kaali: ‘కాళీ’ డాక్యుమెంటరీ పోస్టర్ వివాదాస్పదం.. దర్శకురాలిపై మండిపడుతోన్న నెటిజన్లు
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- America: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి
- IND vs ENG: నాలుగో రోజు ముగిసిన ఆట.. భారత్ గెలవాలంటే 7 వికెట్లు తీయాల్సిందే!
- Mamata Banerjee: మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. దీదీ జోస్యం
- Viral video: రియల్ హీరో.. కరెంటు షాక్తో విలవిల్లాడుతున్న ఆవును రక్షించిన యువకుడు
- మొత్తం మారిపోయింది
- Tamil Nadu: తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి.. సంచలన వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎంపీ