White Paint: తెల్లరంగుతో ఉష్ణోగ్రతలకు కళ్లెం
హిమమయంగా ఉండే టండ్రా నేలలు, మంచు పర్వతాలు, ఆకాశంలో స్వేచ్ఛగా విహరించే మేఘాలు..
భవనాల్లో 5 డిగ్రీల సెల్సియస్ వరకూ తగ్గించొచ్చు
కొత్త పెయింట్ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు
హిమమయంగా ఉండే టండ్రా నేలలు, మంచు పర్వతాలు, ఆకాశంలో స్వేచ్ఛగా విహరించే మేఘాలు.. ఇలా భూమిపై శ్వేతవర్ణం ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. అయితే కేవలం పుడమికి శోభను తెచ్చే సప్త వర్ణాల్లో ఒకటిగా ఇది మిగిలిపోవడంలేదు. ఇది ధరణి వేడిని చల్లార్చే అత్యంత ముఖ్యమైన రంగు. భూమిని తాకే సూర్యకాంతిని పరావర్తనం చెందించి, ఉష్ణోగ్రతలను తగ్గించే సహజసిద్ధ సాధనం. ఈ సూత్రాన్ని అనుకరించడం ద్వారా నగరాల్లో వేడిని తగ్గించే ఆలోచనను శాస్త్రవేత్తలు చేస్తున్నారు. భూమి మొత్తం మహాసముద్రాలతోనే నిండిపోయి, శ్వేత వర్ణపు ప్రాంతాలనేవే లేకుంటే సరాసరి ఉపరితల ఉష్ణోగ్రత దాదాపు 30 డిగ్రీల సెల్సియస్కు చేరే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం ఇది 15 డిగ్రీలుగా ఉంది. అయితే భూమి మీద ప్రస్తుతం మంచు విస్తృతి తగ్గిపోవడం, మానవ చర్యల వల్ల చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పుల వంటి కారణాల వల్ల ఉపరితల ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతోంది. 2050 నాటికి భూమిపై కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు గణనీయంగా తగ్గకుంటే.. 2100 సంవత్సరం నాటికి పుడమి ఉష్ణోగ్రత.. ఇప్పటితో పోలిస్తే 1.5 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగే ప్రమాదం ఉంది. భూమి పరావర్తన సామర్థ్యం తగ్గడం కూడా ఇందుకు కారణమవుతోంది. అందువల్ల మన భవితను నిర్దేశించడంలో శ్వేత వర్ణానిది కీలక పాత్ర.
బేరియం సల్ఫేట్తో..
గ్రీస్లోని శాంటోరిని దీవుల్లోని ప్రఖ్యాత శ్వేత భవనాలు.. ఏదో ఆకర్షణకు ఉద్దేశించినవి కావు. వేడిని పరావర్తనం చెందించేలా చూడటం వీటి లక్ష్యం. ఈ సామర్థ్యం తెల్ల రంగుకు ఉందన్న విషయంపై మానవుడికి శతాబ్దాల కిందటే అవగాహన ఉంది. సంప్రదాయబద్ధంగా భవనాలకు జిప్సమ్ అనే ఒకరకం తెల్ల రంగును ఉపయోగిస్తుంటారు. అందులో క్యాల్షియం సల్ఫేట్ ఉంటుంది. అయితే వేడిని తగ్గించడంలో బేరియం సల్ఫేట్ ఇంకా సమర్థంగా పనిచేస్తుందని తాజా పరిశోధన తేల్చింది. ఈ పదార్థంతో తయారయ్యే పెయింట్లు భవనాలను తాకే సౌర రేడియోధార్మికతను మరింత మెరుగ్గా అంతరిక్షంలోకి పరావర్తనం చెందిస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అందులోని నానో రేణువులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా పరారుణ తరంగదైర్ఘ్యాలను ఇది సమర్థంగా తిప్పికొడుతోంది. అలా పరావర్తనం చెందిన సౌర శక్తి.. భూ వాతావరణంలో చిక్కుకుపోయి, భూతాపాన్ని పెంచడానికి బదులు అంతరిక్షంలోకి వెళ్లిపోతుంది.
వేడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ రకం పెయింట్ను వేయడం వల్ల భవనాలను చల్లగా ఉంచొచ్చు. నిజానికి పట్టణాల్లో వేడిని నియంత్రించడం పెను సవాలే. అక్కడ భవనాలు, జనసాంద్రత వల్ల ఉష్ణోగ్రతలు భరించలేని స్థాయికి పెరుగుతుంటాయి. ముఖ్యంగా వేసవి నెలల్లో వేడి మరీ పెరుగుతుంది. బేరియం సల్ఫేట్ పెయింట్ వేసిన భవనాల్లో ఉష్ణోగ్రతలు 4.5 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. అందువల్ల ఏసీలపై ఆధారపడటం తగ్గుతుంది. ఫలితంగా విద్యుత్ ఖర్చులు ఆదా అవుతాయి.
బేరియం సల్ఫేట్ను ముడి బేరైట్ ఖనిజం నుంచి సేకరించాల్సి ఉంటుంది. ఇందుకోసం భారీగా విద్యుత్ అవసరం. ఇది ఈ పెయింట్కు ఒకింత ప్రతికూలాంశంగా మారింది.
ప్రకృతి నుంచీ..
భవనాల పరావర్తన సామర్థ్యాన్ని పెంచడానికి బేరియం సల్ఫేట్ ఒక్కటే మార్గం కాదు. ఇందుకోసం ప్రకృతి నుంచీ పాఠాలు నేర్చుకోవచ్చు. ఈ దిశగా.. తెల్లగా ఉండే జంతువుల ఉపరితలాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగించారు. జంతువుల కేశాలు, ఈకలు, సీతాకోకచిలుకల రెక్కలపై పరిశోధనల ద్వారా.. ఒక ఆకృతిలో వేడిని ప్రకృతి ఎలా నియంత్రిస్తుందన్నది తెలుసుకోవచ్చు. లెపిడియోటా స్టిగ్మా అనే ఒక రకం శ్వేత వర్ణపు బీటిల్స్ రెక్కలు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాయి. వాటిపై ఉన్న నానో ఆకృతులే ఇందుకు కారణం. అవి కాంతిని మెరుగ్గా పరావర్తనం చెందిస్తాయి. ఇలాంటి కిటుకులను అనుకరించడం ద్వారా నగరాలను చౌకలో చల్లగా ఉంచే మరిన్ని పరిజ్ఞానాలను అభివృద్ధి చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు వ్యక్తుల కోసం సుప్రీంకు రాష్ట్ర ప్రభుత్వమా?
సందేశ్ఖాలీ ఆగడాలపై దర్యాప్తు విషయంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వ వైఖరిని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ప్రైౖవేటు వ్యక్తుల ప్రయోజనాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఎలా ఆశ్రయిస్తుందని జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం సోమవారం ప్రశ్నించింది. -
బెయిల్ కోసం విచారణ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
తన అరెస్టు, కస్టడీని సవాల్ చేస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఈ కేసులో బెయిల్ కోసం విచారణ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారా? అని సీఎం తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని ధర్మాసనం ప్రశ్నించింది. -
సంక్షిప్త వార్తలు
ఉన్నత విద్యాసంస్థలు విద్యార్థులను భవిష్యత్తుకు తగినట్లు తీర్చిదిద్దాలని ఏఐసీటీఈ వైస్ ఛైర్మన్ డాక్టర్ అభయ్ జెరె సూచించారు. -
ఆసుపత్రుల్లో రుసుముల నిర్ధారణపై మీ వైఖరేంటి?
ఆసుపత్రుల్లో వైద్యసేవల రుసుములను నిర్ధారించే అంశంపై సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వ స్పందన కోరింది. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (సెంట్రల్ గవర్నమెంట్) రూల్స్-2012లోని 9వ నిబంధనను అమలు చేయరాదన్న పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ మేరకు పేర్కొంది. -
పత్రికాస్వేచ్ఛ అణచివేత ధోరణి తగదు
పత్రికాస్వేచ్ఛ విషయంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న అణచివేత ధోరణులు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్కు లేఖ రాసింది. -
భోజ్శాల సర్వేకు మరో 8వారాల గడువు
భోజ్శాల ఆలయం-కమల్ మౌలా మసీదు కాంప్లెక్స్పై శాస్త్రీయ సర్వే పూర్తి చేయడానికి భారత పురావస్తు విభాగాని(ఏఎస్ఐ)కి మధ్యప్రదేశ్ హైకోర్టులోని ఇందౌర్ బెంచీ మరో 8 వారాల గడువు ఇచ్చింది. -
ఇక ఏటా పాఠ్యపుస్తకాల సవరణ
దేశవ్యాప్తంగా విద్యార్థులకు పంపిణీచేసే పాఠ్యపుస్తకాల విషయంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ)కి కేంద్ర విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల విద్యా భత్యం పరిమితికి సవరణ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల విద్యా భత్యం, హాస్టల్ రాయితీల పరిమితులను కేంద్రం సోమవారం సవరించింది. కరవు భత్యం పెరిగిన జనవరి 1, 2024 నుంచి పాటు ఈ సవరణ అమల్లోకి వచ్చింది. -
యూజీసీ నెట్ తేదీలో మార్పు
యూజీసీ నెట్ పరీక్ష తేదీ మారింది. ఈ పరీక్షను జూన్ 18న నిర్వహించనున్నట్లు యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ సోమవారం ప్రకటించారు. వాస్తవానికి దాన్ని జూన్ 16న నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. -
ఖలిస్థానీ తీవ్రవాదులను ఉపేక్షించడంపై కెనడాకు భారత్ తీవ్ర నిరసన
భారత్ వ్యతిరేక కార్యకలాపాలను బాహాటంగా నిర్వహిస్తున్న ఖలిస్థానీ వేర్పాటువాదులు, తీవ్రవాదులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా వారికి సహకరిస్తున్న కెనడా తీరుపై మన విదేశీ వ్యవహారాల శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. దిల్లీలోని కెనడా డిప్యూటీ హై కమిషనర్ స్టీవార్ట్ వీలర్ను సోమవారం పిలిపించుకుని తీవ్ర నిరసన తెలిపింది. -
కేజ్రీవాల్, ఆతిశీలపై పరువు నష్టం దావా
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మంత్రి ఆతిశీలపై సోమవారం దిల్లీ కోర్టులో పరువు నష్టం దావా దాఖలైంది. వారిద్దరూ భాజపా, ఆ పార్టీ సభ్యుల గౌరవానికి భంగం కలిగిస్తున్నారంటూ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ తాన్యా బామనీయాల్ ఎదుట కాషాయ పార్టీ దిల్లీ శాఖ మీడియా ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ ఫిర్యాదు దాఖలు చేశారు. -
శ్రీలంక సీతమ్మగుడికి సరయూ జలాలు
శ్రీలంకలో సీతమ్మ ఆలయ ప్రాణప్రతిష్ఠకు భారత్ నుంచి సరయూనదీ జలాలు వెళుతున్నాయి. సంప్రోక్షణ కార్యక్రమంలో వినియోగించేందుకు అయోధ్యలోని సరయూ జలాలను పంపమని శ్రీలంక ప్రతినిధులు లేఖలో కోరారు. -
చంద్రయాన్-3 ప్రయోగంలో 4 సెకన్ల జాప్యం
చందమామ దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన భారత వ్యోమనౌక చంద్రయాన్-3.. ప్రయోగ సమయంలో అంతరిక్ష వ్యర్థాలను ఢీ కొట్టే పరిస్థితిని తప్పించుకోవడానికి 4 సెకన్లపాటు ఆలస్యంగా బయలుదేరింది. -
బాలిక గర్భవిచ్ఛిత్తిపై సుప్రీం ఆదేశాలు వెనక్కి
అత్యాచారానికి గురైన 14 ఏళ్ల బాలిక 30 వారాల గర్భాన్ని వైద్యపరంగా విచ్ఛిత్తి చేసేందుకు అనుమతిస్తూ ఈ నెల 22న జారీచేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు వెనక్కి తీసుకుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం మధ్యాహ్నం సీజేఐ ఛాంబర్లో విచారణ జరిపి ఈ నిర్ణయం తీసుకుంది. -
నీట్-పీజీ ఇంటర్న్షిప్ కటాఫ్ పొడిగింపు సాధ్యంకాదు: సుప్రీం
ఈ ఏడాది జూన్ 23న జరిగే నీట్-పీజీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల ఇంటర్న్షిప్ కటాఫ్ను పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారణకు తీసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. -
కొలీజియం రద్దుకు పిటిషన్.. లిస్టింగ్పై పరిశీలనకు సుప్రీం నిరాకరణ
ఉన్నత న్యాయవ్యవస్థలో జడ్జీల నియామకం కోసం అమలవుతున్న కొలీజియం విధానం రద్దుకు దాఖలైన పిటిషన్ను లిస్టింగ్ చేసే అంశాన్ని పరిశీలించడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. మాథ్యూస్ నెడుంపారా అనే న్యాయవాది దీన్ని దాఖలుచేశారు. -
సీఏ పరీక్షల వాయిదాకు ‘పిల్’
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. మే నెలలో జరగాల్సిన చార్టర్డ్ ఎకౌంటెన్సీకి సంబంధించిన కొన్ని పరీక్షలను వాయిదా వేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యా (పిల్)న్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. -
దేవుళ్లు, ఆలయాల పేరుతో ఓట్లు.. మోదీపై పిటిషన్
దేవుళ్లు, ఆలయాల పేరుతో ప్రధాని మోదీ ఓట్లు అడుగుతున్నారని, ఎన్నికల్లో పోటీచేయకుండా ఆయనపై ఆరేళ్ల నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సోమవారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చేపట్టిన చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగాన్ని ముందుగా అనుకున్న సమయానికంటే 4 సెకన్లు ఆలస్యంగా చేపట్టినట్లు ఇస్రో తాజా నివేదికలో వెల్లడించింది. -
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
పెళ్లి పత్రికలో ప్రధాని మోదీ పేరును ప్రస్తావించడం ఓ నవ వరుడిని చిక్కుల్లో పడేసింది.