WHO: భారత్లో వారంలోనే 150% పెరిగిన కరోనా కేసులు: డబ్ల్యూహెచ్ఓ
ఆగ్నేయాసియాలో కొవిడ్-19 కేసులు పెరిగేందుకు భారత్ మూలకారణం అని, ఆ దేశంలో వారంలోనే 150 శాతం కేసులు పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది......
జెనీవా: ఆగ్నేయాసియాలో కొవిడ్-19 కేసులు పెరిగేందుకు భారత్ మూలకారణమని, ఆ దేశంలో వారంలోనే 150 శాతం కేసులు పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. గడిచిన వారంలో భారత్లో 15,94,160 కేసులు నమోదయ్యాయని.. అంతకుముందు వారం 6,38,872 కేసులు మాత్రమే వెలుగుచూశాయని డబ్ల్యూహెచ్ఓ ఓ ప్రకటనలో తెలిపింది.
తూర్పు మధ్యధరా ప్రాంతాల్లోనూ గడిచిన వారంలో కొవిడ్ వ్యాప్తి బాగా పెరిగినట్లు ఆరోగ్య సంస్థ పేర్కొంది. మొరాకోలో అత్యధిక సంఖ్యలో కొత్త కేసులు నమోదైనట్లు తెలిపింది. అంతకుముందు వారం 4,610 కేసులు బయటపడితే, గడిచిన వారం 45 శాతం పెరిగిపోయి 31,701 కొత్త కేసులు నిర్ధరణ అయినట్లు వెల్లడించింది. ట్యూనీషియాలో అత్యధికంగా 194 శాతం వృద్ధిచెంది గతవారం 13,416 కొత్త కేసులు బయటపడ్డాయని, లెబనాన్లో 19 శాతం పెరిగి 38,112 కేసులు వెలుగుచూసినట్లు వివరించింది.
తీవ్ర వ్యాప్తిగల ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటివరకు 171 దేశాలకు పాకినట్లు WHO వెల్లడించింది. ఈ వేరియంట్లో తీవ్రమైన వ్యాధి, ఇన్ఫెక్షన్ కారణంగా మరణించే ప్రమాదం తక్కువగానే ఉన్నప్పటికీ.. ఓమిక్రాన్కు సంబంధించిన మొత్తం ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. ‘మునుపటి సార్క్-కోవ్-2 వేరియంట్ల కంటే ఒమిక్రాన్లో తీవ్రమైన వ్యాధి, సంక్రమణ అధికంగా ఉన్నప్పటికీ మరణాల ప్రమాదం తక్కువగా ఉంది. కానీ చాలా వేగంగా వ్యాప్తి చెందే గుణం కారణంగా ఎక్కువమందికి సంక్రమిస్తోంది. చాలా మంది ఆసుపత్రుల్లో చేరారు. అనేక దేశాల్లో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై భారం పడింది’ అని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
ప్రపంచం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది: టెడ్రోస్ అధనామ్
కొవిడ్ మహమ్మారి తీవ్రమైన దశను అంతం చేసేందుకు అన్ని దేశాలు కలిసి పనిచేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ విలేకర్ల సమావేశంలో పేర్కొన్నారు. దీన్ని అంతం చేసేందుకు ఆయా దేశాల వద్ద అన్ని సాధనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ‘కొవిడ్-19 ఇప్పుడు మూడో సంవత్సరంలోకి ప్రవేశిస్తోంది. మనం ఇప్పుడు క్లిష్ట దశలో ఉన్నాం. మహమ్మారి తీవ్రమైన దశను అంతం చేసేందుకు మనం కలిసి పని చేయాలి. కరోనాను ఇలాగే కొనసాగించకూడదు’ అని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Supreme Court: తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో.. రామ్దేవ్బాబాకు సుప్రీంకోర్టు సమన్లు
తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో ధిక్కార పిటిషన్పై సమాధానం ఇవ్వడంలో విఫలమైనందుకు పతంజలి సంస్థపై సుప్రీంకోర్టు(Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. -
Liquor Policy Case: రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటన.. అక్రమంగా ఒక్క రూపాయీ లేదన్న ఆప్
Liquor Policy Case: దిల్లీ మద్యం కుంభకోణంలో భారాస ఎమ్మెల్సీ కవిత తమ నేతలకు రూ.100 కోట్లు చెల్లించడంలో భాగస్వామి అయ్యారని ఈడీ చేసిన ప్రకటనపై ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడింది. ఇదంతా కుట్రలో భాగమేనని ఆరోపించింది. -
Modi: ‘మీవాళ్లు క్షేమంగా ఉన్నారు..త్వరలో తిరిగొస్తారు’: బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై
తమ దేశీయుల్ని రక్షించడంలో భారత నౌకాదళం ప్రదర్శించిన ధైర్యసాహసాలకు బల్గేరియా నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. వీటికి ప్రధాని మోదీ(Modi) స్పందించారు. -
Gadchiroli: గడ్చిరోలిలో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టుల హతం
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. -
సర్కార్ సొమ్ము కోసం అన్నాచెల్లెళ్ల పెళ్లి
ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన సీఎం సామూహిక వివాహ పథకం ద్వారా వచ్చే ప్రయోజనాలను పొందేందుకు అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారు. మహారాజ్గంజ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. -
దుస్తుల్లేని చిన్ననాటి ఫొటోపై అభ్యంతరం.. అకౌంట్ను నిలిపివేసిన గూగుల్
చిన్నప్పటి ఫొటోను డ్రైవ్లోకి అప్లోడ్ చేసిన వ్యక్తికి గూగుల్ షాకిచ్చింది. అతడి అకౌంట్ను నిలిపివేసింది. దీనిపై ఏడాదిగా గూగుల్తో పోరాడుతున్నా ఫలితం లేకపోవడంతో బాధితుడు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. -
ఎన్నికల బాండ్ల సమాచారమంతా వెల్లడించాల్సిందే
ఎన్నికల బాండ్ల అంశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అనుసరిస్తున్న వైఖరిపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపిక చేసుకున్న సమాచారాన్ని మాత్రమే ఇవ్వాలన్న ధోరణిని బ్యాంక్ విడనాడాలని, మొత్తం వివరాలు ఈ నెల 21లోపు బహిర్గతం చేయాలని ఆదేశించింది. -
పశ్చిమ బెంగాల్ డీజీపీపై వేటు
సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ డీజీపీతోపాటు 6 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను తప్పించింది. వారితోపాటు రెండు రాష్ట్రాల్లో సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శులను బదిలీ చేసింది. -
ఆజం ఖాన్కు ఏడేళ్ల జైలుశిక్ష
ఉత్తర్ప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ నేత ఆజం ఖాన్కు స్థానిక కోర్డు ఏడేళ్ల జైలుశిక్షను విధించింది. 2016లో దుంగార్పుర్లో ఒక ఇంటిని బలవంతంగా కూల్చివేసిన కేసులో ఈ శిక్షను ఖరారు చేసింది. -
‘సామాజిక’ ప్రచారం
ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికల ప్రక్రియకు దేశం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఓటర్లను ఆకర్షించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలను ప్రారంభించాయి. ఇందులో భాగంగా వాట్సప్, సామాజిక మాధ్యమాలు, ఇన్ఫ్లుయెన్సర్లకు గిరాకీ పెరిగింది. -
వేడెక్కుతున్న ఉత్తర భారతం
ఉత్తర భారతంలో 1970 నుంచి శీతాకాలం క్రమంగా ఎండా కాలంగా మారిపోతోందని అమెరికన్ శాస్త్రజ్ఞుల బృందం క్లైమేట్ సెంట్రల్ హెచ్చరించింది. ఈ బృందం 1970 నుంచి డిసెంబరు-ఫిబ్రవరి కాలంలో ఉత్తర భారత్లో ఉష్ణోగ్రతల తీరుతెన్నులను విశ్లేషించింది. -
స్నేహమంటే అదే కదా.. నేవీ ఆపరేషన్పై జై శంకర్ స్పందన
సోమాలియా సముద్రపు దొంగల చేతిలో హైజాక్కు గురైన ఓ వాణిజ్య ఓడను భారత నౌకాదళం కాపాడిన విషయం తెలిసిందే. దాంతో మన రక్షణ సిబ్బంది చేసిన ఆపరేషన్పై బల్గేరియా నుంచి కృతజ్ఞతలు వ్యక్తమయ్యాయి. -
మమ్మల్ని దర్యాప్తు సంస్థలా మార్చకండి
గుజరాత్ యూనివర్సిటీలో గత వారాంతంలో విదేశీ విద్యార్థులపై చోటు చేసుకున్న దాడిని సుమోటోగా స్వీకరించాలంటూ ఓ న్యాయవాది దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) ఆ రాష్ట్ర హైకోర్టు సోమవారం తిరస్కరించింది. -
పోలీసు కాల్పుల్లో ఉపాధ్యాయుడి మృతి
ఉత్తర్ప్రదేశ్లోని ముజఫర్నగర్లో చిన్నపాటి ఘర్షణ కారణంగా హెడ్ కానిస్టేబుల్ కాల్పులు జరపడంతో ఓ ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సివిల్ లైన్స్ ప్రాంతంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. -
హిమాచల్ప్రదేశ్ కాంగ్రెస్ రెబల్స్కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట
కాంగ్రెస్ పార్టీ విప్ను ధిక్కరించి ఎమ్మెల్యే పదవికి అనర్హులైన ఆరుగురు రెబల్స్కు సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించలేదు. -
వివక్షతో ఉద్యోగాలు నిరాకరించొద్దు
ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ట్రాన్స్జెండర్లపై వివక్ష ఉండకూడదని, వారికి సమాన అవకాశాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. -
వ్యక్తిగత హోదాలోనే విరాళాలిచ్చాను
ప్రముఖ ఔషధ తయారీ సంస్థ బయోకాన్ లిమిటెడ్.. ఏ పార్టీకీ ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలివ్వలేదని ఆ సంస్థ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా సోమవారం వెల్లడించారు. -
ఈడీ సమన్లను లెక్కచేయని కేజ్రీవాల్
నగదు అక్రమ చలామణి కేసులో ప్రశ్నలకు జవాబివ్వడానికి సోమవారం రావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీచేసిన సమన్లను దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లెక్కచేయలేదు. -
సాంక్రమికేతర వ్యాధులను పెంచుతున్న ఆహారపుటలవాట్లు
భారతీయుల ఆహారంలో మితిమీరిన ఉప్పు వినియోగం, సరిపడా పొటాషియం లేకపోవడం వంటి ఆందోళనకర పోకడలు పెరుగుతున్నాయని తాజా పరిశోధన తేల్చింది. -
భారత నౌకాదళం భేష్: అమెరికా రక్షణ మంత్రి ప్రశంస
హిందూ మహాసాగరంలో సముద్రపు దొంగల ఆటకట్టించే ఆపరేషన్ల నిర్వహణలో భారత నౌకాదళ పాత్రను అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ కొనియాడారు. శుక్రవారం భారత నౌకాదళం నడి సముద్రంలో సాహసోపేత ఆపరేషన్ నిర్వహించి.. -
సంక్షిప్త వార్తలు (5)
కబేళాలు, మాంసం ప్రాసెసింగ్ యూనిట్లను ‘పర్యావరణ ప్రభావ మదింపు(ఈఐఏ)-2006’ పరిధిలోకి చేర్చాల్సిన అవసరం లేదని జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ)కు కేంద్ర ప్రభుత్వం సూచించింది.
తాజా వార్తలు (Latest News)
-
TCS: టీసీఎస్ ఉద్యోగులకు గుడ్న్యూస్.. త్వరలో వేతన పెంపు!
-
Mallikarjun Kharge: భాజపా హామీలు.. 2004 ఫలితమే వస్తుంది: ఖర్గే
-
Flight Journey: ‘బరువు ఉన్నామని విమానం నుంచి దించేశారు’
-
YSRCP: చిలకలూరిపేట పంచాయితీ.. మల్లెల రాజేశ్కు సీఎంవో నుంచి పిలుపు
-
Ashwini Vaishnaw: 2026లో బుల్లెట్ రైలు పరుగులు.. త్వరలోనే ‘మేడిన్ ఇండియా’ చిప్
-
IPL-SRH: సన్రైజర్స్ హైదరాబాద్కు షాక్.. మూడు మ్యాచ్లకు కీలక ఆటగాడు దూరం