Big B: వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు వెళ్లొద్దంటూ అమితాబ్‌కు ఫ్యాన్స్‌ స్వీట్‌ వార్నింగ్‌..

భారత్‌- ఆస్ట్రేలియా మధ్య నవంబర్‌ 19న వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు వెళ్లొద్దంటూ అమితాబ్‌కు ఫ్యాన్స్‌ స్వీట్‌ వార్నింగ్ ఇస్తున్నారు.

Updated : 17 Nov 2023 15:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమితాబ్‌ బచ్చన్‌కు (Amitabh Bachchan) అభిమానులు స్వీట్‌ వార్నింగ్ ఇచ్చారు. నవంబర్‌ 19న జరగనున్న వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు వెళ్లొద్దంటూ కామెంట్స్ పెడుతున్నారు. వాటికి బిగ్‌ బీ కూడా సరదాగా స్పందించడం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. సెమీస్‌లో న్యూజిలాండ్‌పై భారత్‌ ఘన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. దీంతో సోషల్‌ మీడియాలో టీమిండియాకు అభినందనలు వెల్లువెత్తాయి.

ప్రతి విషయంలో తనదైన శైలిలో స్పందించే అమితాబ్‌ కూడా ఈ మ్యాచ్‌పై ఫన్నీగా పోస్ట్ చేశారు. ‘నేను మ్యాచ్ చూడకపోతే. ఇండియా కచ్చితంగా గెలుస్తుంది’ అని రాశారు. ఈ పోస్ట్‌ చూసిన నెటిజన్లు సరదాగా కామెంట్స్‌ పెడుతున్నారు. ‘ఫైనల్‌ మ్యాచ్‌కు మీరు రావొద్దు’ అని ఒక నెటిజన్‌ కామెంట్ పెట్టారు. ‘మీరు అసలు ఇంట్లో కూడా టీవీ చూడొద్దు’ అని మరో యూజర్‌ కోరారు. ‘ఆరోజు మీరు బయటకు రాకుండా మీ ఇంటి గేట్‌కు తాళాలు వేసేందుకు మేము ఏర్పాటు చేస్తున్నాం’ అని మరొకరు అన్నారు. ఈ కామెంట్స్ చూసిన అమితాబ్‌ ‘ఇవన్నీ చూశాక.. మ్యాచ్‌కు రావాలా..? వద్దా..? అని ఇప్పుడు నిజంగానే ఆలోచిస్తున్నా’ అంటూ పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం అమితాబ్‌ పోస్ట్‌లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘టైగర్‌ నాగేశ్వరరావు’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

ఇక ఈ ఆదివారం అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ సారి కప్‌ మనదే అంటూ.. టీమ్‌ఇండియా అభిమానులు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ పోస్ట్‌లు పెడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు