Hero: రాజమౌళి పరిచయం చేసిన ‘హీరో’ కథ.. సందడి చేస్తున్న ట్రైలర్‌!

కొత్త ‘హీరో’ కథని తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేశారు ప్రముఖ దర్శకుడు రాజమౌళి.

Published : 10 Jan 2022 16:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్: కొత్త ‘హీరో’ కథని తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేశారు ప్రముఖ దర్శకుడు రాజమౌళి. ఆ హీరో ఎవరో కాదు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ కుమారుడు అశోక్‌. ఈయన కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘హీరో’. సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలకానుంది. ఈ సందర్భంగా ‘హీరో’ ట్రైలర్‌ను సామాజిక మాధ్యమాల వేదికగా రాజమౌళి సోమవారం విడుదల చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

‘‘కలల్లో బిర్యానీ వండుకుంటే వాస్తవంలో కడుపు నిండదురా’’ అని సీనియర్‌ నటుడు నరేశ్‌ చెప్పిన డైలాగ్‌తో ఈ ట్రైలర్‌ ప్రారంభమైంది. లవ్‌, కామెడీ, యాక్షన్‌ సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. అన్ని కమర్షియల్‌ హంగులతో ఈ సినిమా రూపొందినట్టు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. సంభాషణలను బట్టి కథానాయకుడి పాత్ర ‘హీరో’ అవ్వాలనుకుంటుందని తెలుస్తోంది. జిబ్రాన్‌ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. అశోక్‌ లుక్స్‌, నటన అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్‌ కథానాయిక. జగపతిబాబు, వెన్నెల కిషోర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అమరరాజా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని