Akshay Kumar: ఆస్కార్‌ బరిలోకి అక్షయ్‌ కుమార్‌ సినిమా!

అక్షయ్‌ కుమార్‌ తాజా చిత్రం ‘మిషన్‌ రాణిగంజ్‌’కు సంబంధించిన ఓ ఆసక్తికర అంశం ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ సినిమా ఆస్కార్‌ బరిలో పోటీపడడానికి సిద్ధమైంది.

Updated : 14 Oct 2023 11:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్: బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ నటించిన తాజా చిత్రం ‘మిషన్‌ రాణిగంజ్‌’ (Mission Raniganj). ‘ది గ్రేట్‌ భారత్‌ రెస్క్యూ’ అనేది ఉపశీర్షిక. టిను సురేష్‌ దేశాయ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ఆస్కార్‌ బరిలో నిలవనుంది.

ఆస్కార్‌ రేసులో పోటీ పడేందుకు జనరల్‌ కేటగిరిలో ఇండిపెండెంట్‌గా ఈ చిత్ర బృందం నామినేషన్ వేసింది. దీంతో ఈ చిత్రానికి సోషల్‌ మీడియాలో ఆల్‌ ది బెస్ట్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో వైరల్‌గా మారింది. ఇక గతంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ కూడా ఇలానే ఇండిపెండెంట్‌గా కొన్ని కేటగిరీల్లో నామినేషన్‌ వేసిన సంగతి తెలిసిందే. ఇక ‘ఆస్కార్‌ 2024’ (Oscar 2024) అధికారిక ఎంట్రీ కోసం పలు భారతీయ చిత్రాలు పోటీ పడగా, జ్యూరీ మలయాళ మూవీ ‘2018’ను ఎంపిక చేసింది.

రాఖీ సావంత్‌పై నటి తనూశ్రీ ఘాటు వ్యాఖ్యలు

‘మిషన్‌ రాణిగంజ్‌’ విషయానికొస్తే.. రాణిగంజ్‌ కోల్‌ఫీల్డ్స్‌లో 65మంది మైనర్లను కాపాడిన జశ్వంత్‌ సింగ్‌ గిల్‌ జీవితం ఆధారంగా ఇది తెరకెక్కింది. అక్షయ్‌ కుమార్‌ టైటిల్‌ పాత్రలో కనిపించగా ఆయన సరసన పరిణీతి చోప్రా నటించారు. అక్టోబర్‌ 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినీ ప్రముఖులు ప్రశంసల అందుకున్నప్పటికీ కమర్షియల్‌గా విజయాన్ని అందుకోలేకపోయింది. ఇదిలా ఉండగా వివేక్‌ అగ్నిహోత్రి (Vivek Agnihotri) చిత్రం ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ (The Vaccine War) స్క్రిప్ట్‌ ఆస్కార్‌ లైబ్రరీలో శాశ్వతంగా చోటు సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని చిత్రబృందం ఎక్స్‌లో పంచుకుని సంతోషం వ్యక్తం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని