Prabhas: మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. శివుడిగా ప్రభాస్‌..?

నటుడు ప్రభాస్‌ (Prabhas), మంచు విష్ణు (Manchu Vishnu) మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ ఓ సినిమా కోసం కలిసి పని చేయనున్నారు.

Updated : 10 Sep 2023 10:23 IST

హైదరాబాద్‌: నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) కలల ప్రాజెక్టుల్లో ‘కన్నప్ప’ (Kannappa) ఒకటి. భక్త కన్నప్ప కథతో రూపొందనున్న ఈ చిత్రానికి ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించనున్నారు. ఇటీవల ఇది పట్టాలెక్కింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రముఖ నటుడు ప్రభాస్‌ ఈ చిత్రంలో అతిథి పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది. ఆయన పాత్ర ఎంతో కీలకంగా ఉండనుందని వార్తలు వస్తున్నాయి. నెట్టింట వైరల్‌గా మారిన ఈ విషయంపై మంచు విష్ణు తాజాగా స్పందించారు. ‘హర హర మహాదేవ్‌’ అని ట్వీట్‌ చేశారు. దీనిని చూసిన అభిమానులు.. ‘కన్నప్ప’ చిత్రంలో ప్రభాస్‌ శివుడిగా కనిపించనున్నారని భావిస్తున్నారు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. ప్రభాస్‌ని మూడోసారి దేవుడి పాత్రలో చూసే అవకాశం అభిమానులకు దక్కుతుంది. ఆయన ఇప్పటికే ‘ఆదిపురుష్‌’లో రాముడిగా కనిపించారు. ‘కల్కి’లో విష్ణు మూర్తిగా కనిపించనున్నట్లు సమాచారం.

‘లక్ష్మీ మేనన్‌తో విశాల్‌ వివాహం’.. ఆ పేపర్‌ క్లిప్‌ను నాన్న దాచుకున్నారు: విశాల్‌

విష్ణు ఎన్నో ఏళ్ల నుంచి ‘కన్నప్ప’ చిత్రాన్ని తెరకెక్కించాలని ఆశించారు. ఆగస్టులో దీనిని పట్టాలెక్కించారు. నుపుర్‌ సనన్‌ కథానాయిక. ‘‘మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్తకన్నప్ప చరిత్రను ఆదర్శంగా తీసుకుని ఈ చలనచిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. కన్నప్ప వృత్తాంతం 2వ శతాబ్దంలో జరిగిందని, ప్రస్తుతం ఇక్కడి పరిసరాల్లో చలనచిత్రం తీయడం వీలుకాదు. అందుకోసం ఈ చిత్ర నిర్మాణానికి ఆర్నెల్లపాటు న్యూజిల్యాండ్‌కు వెళ్తున్నాం. కన్నప్ప భక్తిని, ఆయన గొప్పతనాన్నీ నేటి తరానికి తెలియజేయాలనే సంకల్పంతో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న చిత్రమిది. భారీ బడ్జెట్‌తో... అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో సిద్ధం చేస్తున్నాం. పరుచూరి గోపాలకృష్ణ, బుర్ర సాయిమాధవ్‌, తోట ప్రసాద్‌ కథకి కీలకమైన మెరుగులు దిద్దారు. మణిశర్మ, స్టీఫెన్‌ దేవాసి సంగీతం అందిస్తారు. ఒకే షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తి చేస్తాం’’ అని ఈ సినిమా ఓపెనింగ్‌ రోజు విష్ణు తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని