Rajamouli: దిల్లీ ఎయిర్‌పోర్ట్‌పై రాజమౌళి అసహనం

దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న పరిస్థితులు చూసి ప్రముఖ దర్శకుడు రాజమౌళి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో కనీస వసతులు కూడా లేవని.. దానివల్ల శుభ్రత విషయంలో....

Updated : 02 Jul 2021 11:42 IST

హైదరాబాద్‌: దిల్లీ విమానాశ్రయంలో ఉన్న పరిస్థితులు చూసి ప్రముఖ దర్శకుడు రాజమౌళి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో కనీస వసతులు కూడా లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. వృత్తిపరమైన పనుల రీత్యా బుధవారం అర్ధరాత్రి దిల్లీ ఎయిర్‌పోర్ట్‌ చేరుకున్న ఆయన అక్కడ ఉన్న పరిస్థితుల గురించి తాజాగా  ట్వీట్‌ చేశారు.

‘అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో దిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాను. ఆర్టీపీసీఆర్‌ పరీక్షల కోసం అవసరమైన కొన్ని పత్రాలు ఇచ్చి వాటిలో తగిన సమాచారాన్ని రాసి ఇవ్వమన్నారు. ఆ పత్రాలు నింపడం కోసం కొంతమంది ప్రయాణికులు గోడలకు ఆనుకుని.. మరి కొంతమంది నేలపైనే కూర్చొని వాటిని పూర్తి చేసి ఇచ్చారు. అక్కడ పరిస్థితి చూడడానికి ఏమీ బాలేదు. ఇటువంటి వాటి కోసం చిన్న టేబులైనా ఏర్పాటు చేయాల్సింది. ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు వచ్చే ద్వారం వద్ద ఎన్నో వీధి కుక్కలు ఉన్నాయి. ఇలాంటివి చూస్తే విదేశీయులకు మన దేశంపై ఎలాంటి భావన కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. దయచేసి వీటిపై దృష్టి సారించండి ’ అని రాజమౌళి ట్వీట్‌ చేశారు.

ఇక సినిమాల విషయానికి వస్తే రాజమౌళి ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తెరకెక్కిస్తున్నారు. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, తారక్‌ కొమురంభీమ్‌గా కనిపించనున్నారు. చెర్రీ సరసన ఆలియాభట్‌, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరీస్‌ సందడి చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూట్‌ పూర్తి కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు