Ranbir Kapoor: ఈ అవార్డు వారికే అంకితం.. అప్పుడు ఆయన్ను చూస్తే భయమేసింది: రణ్బీర్ కపూర్
రణ్బీర్ కపూర్ నటించిన తాజా చిత్రం ‘యానిమల్’(Animal). ఈ సినిమాకిగాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. ఆ వేడుకలో తన తండ్రి రిషి కపూర్ను గుర్తుచేసుకున్నారు..
గాంధీనగర్: బాలీవుడ్ ప్రముఖ హీరో రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor) ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు (Filmfare Awards)ను అందుకున్నారు. ఈ పురస్కారాన్ని తన తండ్రి రిషి కపూర్, కుమార్తె రాహాలకు అంకితమిస్తున్నట్లు తెలిపారు. ఆ వేడుకలో తన తండ్రిని గుర్తుచేసుకుంటూ మాట్లాడారు. ‘‘నాన్నా.. నేను ఎప్పుడూ మీ గురించే ఆలోచిస్తా. మీరు నాపై చూపించిన ప్రేమ, ఆప్యాయతను రోజూ గుర్తుచేసుకుంటా. మీరు ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండాలని ఈ వేదిక సాక్షిగా కోరుకుంటున్నా. నా కుమార్తె రాహా పుట్టిన వారం రోజుల తర్వాత ‘యానిమల్’ సినిమా చిత్రీకరణ ప్రారంభించాం. రాహా అంటే నాకు చాలా ఇష్టం. తన అల్లరిని మిస్ అవ్వకూడదని షూటింగ్ అయిపోయాక ఇంటికి వెళ్లిపోయేవాణ్ని. రాహా.. ఈ రోజు నువ్వు ఆడుకోవడానికి అమ్మ, నేను అవార్డులు తీసుకొస్తున్నాం’’ అని పేర్కొన్నారు. బాలీవుడ్ ప్రతిష్ఠాత్మకంగా భావించే ఫిల్మ్ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం (69వ) గుజరాత్లోని గాంధీనగర్లో అట్టహాసంగా జరిగింది. ఉత్తమ నటుడిగా రణ్బీర్ (యానిమల్ చిత్రానికి), ఆయన భార్య అలియా భట్ ఉత్తమ నటిగా (రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ) అవార్డులు అందుకున్నారు.
ఉత్తమ నటుడు రణ్బీర్.. ఉత్తమ చిత్రం 12th ఫెయిల్
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రమే ‘యానిమల్’. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రణ్బీర్ క్లైమాక్స్ ఫైట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ‘‘క్లైమాక్స్ చిత్రీకరణలో.. చొక్కా విప్పి ఫైట్ చేస్తున్నప్పుడు అందరూ చప్పట్లు కొట్టి నన్ను ప్రోత్సహించారు. దాంతో, కెమెరాలో బాగా కనిపిస్తా అనుకున్నా. కానీ, బాబీ దేవోల్ చొక్కా విప్పి ఫైట్ చేసేందుకు సిద్ధమవుతుండగా నేను, నా జిమ్ ట్రైనర్ అక్కడి నుంచి వెళ్లిపోవాలనుకున్నాం. ఆయన్ను చూస్తే అంత భయమేసింది’’ అని అన్నారు. ప్రతినాయకుడిగా నటించిన బాబీ దేవోల్ మంచి మార్కులు కొట్టేశారు. రష్మిక (Rashmika) కథానాయికగా నటించిన ఈ చిత్రంలో త్రిప్తి దిమ్రి, అనిల్ కపూర్, పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించి, మెప్పించారు. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేకప్ రూమ్లో బంధించారు.. నిర్మాతపై నటి ఆరోపణలు
నిర్మాత వేధింపుల కారణంగా బాలీవుడ్ డ్రామా షో ‘శుభ్ షగున్’ నుంచి బయటకు వచ్చేసినట్లు నటి కృష్ణ ముఖర్జీ తెలిపారు. -
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
ప్రేమ స్వభావం ఎలా ఉన్నప్పటికీ దానిని వదులుకోవడం చాలా కష్టమన్నారు అగ్ర కథానాయకుడు కమల్ హాసన్. -
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
హాలీవుడ్కు వెళ్లిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తెలిపారు. -
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
బరువు పెరిగినప్పుడు బాధపడినట్లు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తెలిపారు. -
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
తన అభిమానులపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది. -
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోలతో సినిమా తీయడం తన కల అని దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ చెప్పారు. -
సూర్య చెప్పాకే జ్యోతిక ఈ చిత్రాన్ని ఓకే చేశారు: దర్శకుడు తుషార్ హీరానందానీ
‘శ్రీకాంత్’ చిత్రంలోని పాత్రను జ్యోతిక మొదట అంగీకరించలేదని.. సూర్య చెప్పాక ఓకే చేశారని ఆ చిత్ర దర్శకుడు తెలిపారు. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్