Sai Dharam Tej: పుట్టినరోజున సాయిధరమ్‌ తేజ్‌ కీలక నిర్ణయం.. అదేంటంటే?

తన పుట్టిన రోజును పురస్కరించుకుని హీరో సాయిధరమ్‌ తేజ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Published : 15 Oct 2023 22:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ యంగ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) ఉదారత చాటుకున్నారు. సైనిక కుటుంబాలకు, ఏపీ, తెలంగాణ పోలీసులకు మొత్తంగా రూ. 20 లక్షల సాయం చేసేందుకు సిద్ధమయ్యారు. తన పుట్టినరోజు (అక్టోబర్‌ 15న) సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సోషల్‌ మీడియా వేదికగా సంబంధిత లేఖను పోస్ట్‌ చేశారు. ‘‘నా హీరోల కోసం.. ఏదో ఒక మార్పు తీసుకురావడానికే మనమంతా ఇక్కడకు వచ్చాం. నా పుట్టినరోజు సందర్భంగా వీరనారీలకు (అమరులైన సైనికుల సతీమణులు)రూ. 10లక్షలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ పోలీసులకు రూ. 10లక్షలు చొప్పున డొనేట్‌ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నా. దీనికి మీ సపోర్ట్‌ కావాలి. అయితే,  అది విరాళాల రూపంలో కాదు. సైనికులు, పోలీసులు మనకోసం చేస్తున్న త్యాగానికి అభిమానం, గౌరవం రూపంలో మీ మద్దతు కావాలి’ అని అభిమానులను కోరారు. సాయి ధరమ్‌తేజ్‌ నిర్ణయంపై అభిమానులు స్పందిస్తున్నారు. మంచి పనిచేస్తున్నారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

అంతా ఓపెన్‌ బుక్‌.. ఎవరికీ భయపడేదే లేదు.. ‘విగ్గు’ కామెంట్‌పై బాలకృష్ణ

సినిమాల విషయానికొస్తే.. ‘విరూపాక్ష’తో మంచి విజయాన్ని అందుకున్న సాయిధరమ్‌ తేజ్‌ ప్రస్తుతం ‘గాంజా శంకర్‌’ (Gaanja Shankar)లో నటిస్తున్నారు. సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్‌ని హీరో బర్త్‌డే సందర్భంగా ఆదివారం ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని