Samantha: మయోసైటిస్‌తో బాధపడుతున్నట్లు సామ్‌ మాతో కూడా చెప్పలేదు!

సమంత మయోసైటిస్‌తో బాధపడుతున్న విషయం ‘యశోద’ సెట్స్‌లో కూడా ఎప్పుడు చెప్పలేదని నటుడు ఉన్ని ముకుందన్‌ అన్నారు.

Updated : 07 Dec 2022 19:09 IST

హైదరాబాద్‌: అగ్ర కథానాయిక సమంత మయోసైటిస్‌తో బాధపడుతున్నట్లు ఇటీవల అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ‘యశోద’ సెట్స్‌లో కూడా ఎప్పుడు సామ్‌ చెప్పలేదని నటుడు ఉన్ని ముకుందన్‌ అన్నారు. సమంత కీలక పాత్రలో హరి-హరీష్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. నవంబరు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఉన్ని ముకుందన్‌ మాట్లాడుతూ.. ‘‘షూటింగ్‌ సమయంలో కూడా ఈ విషయం నాకు తెలియదు. సమంత చాలా ప్రొఫెషనల్‌. మయోసైటిస్‌తో పోరాడుతున్నట్లు ఎప్పుడూ చెప్పలేదు. ఆమె పోస్ట్‌ చూసిన తర్వాత చాలా బాధగా అనిపించింది. ఆ వ్యాధిపై పోరాడి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నా’’ అని ఉన్ని అన్నారు.

సమంత అనారోగ్యంతో బాధపడుతున్నట్లు గత కొన్ని రోజుల కిందట వార్తలు వచ్చాయి. తొలుత వీటిపై సమంత స్పందించలేదు. ఆమె బాగానే ఉన్నారంటూ సన్నిహితులు చెప్పుకొచ్చారు. కానీ, సామ్‌ తాను మయోసైటిస్‌తో పోరాటం చేస్తున్నట్లు సోషల్‌మీడియా వేదికగా చెప్పారు.  ‘సమంత నిబద్ధత కలిగిన నటి. తన పాత్ర కోసం ఎంతో కసరత్తు చేస్తుంది. ఎమోషనల్‌ సీన్స్‌తో పాటు, యాక్షన్‌ సన్నివేశాల కోసం చాలా కష్టపడింది. సెట్‌లోని ప్రతి ఆర్టిస్ట్‌తోనూ ఎంతో మర్యాదపూర్వకంగా ఉంటుంది’’ అని ఉన్ని ముకుందన్‌ చెప్పుకొచ్చారు.

మరోవైపు ‘యశోద’ విడుదల దగ్గర పడుతుండటంతో తాను కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు సామ్‌ చెబుతూ ఇన్‌స్టాలో స్పెషల్‌ పోస్టు పెట్టారు. ఇక ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌, రావు రమేశ్‌, మురళీశర్మ, సంపత్‌రాజ్‌ తదితరులు నటిస్తున్నారు.మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీని శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని